*పరీక్షలు కాదు…!*
*మనలో… సహనాన్ని పెంచి,*
*సత్యానికి చేర వేసే వారధిలు..!!*
*ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తూ గురువు గారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధ పడుతూ వుంటాడు. *
*ఒక రోజు అగ్ని ప్రమాదం లో గురువు గారి ఆశ్రమం అంతా ఏమి మిగలకుండా అంతా కాలి బూడిద అయి పోతుంది.*
*అప్పుడు శిష్యుడు కి ఒక సందేహం వచ్చి గురువు గారిని ఇలా ప్రశ్నిస్తాడు…*
*”గురువు గారూ! మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఇది నేను చూస్తున్నాను. మీ లాగే ఎందరో గురువులు వారు కూడ మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు.*
*సోక్రటీస్, కబీర్, బుద్దుడు ఓషో, రాముడు, కృష్ణుడు, సత్య హరిశ్చంద్రుడు, ఇలా ఇంకా ఎందరో మహానుభావులు అందరు కూడ ఎన్నో కష్టాలను చవి చూశారు కదా, అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే… మీ గురువులు అందరు కూడ ‘ధర్మం లో ఉండండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది!’ అని అంటుంటారు.* *మరి ఈ గురువులు అందరు కూడ ధర్మంగానే ఉన్నారు కదా మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు?” అని ప్రశ్నిస్తాడు.*
*ఈ ప్రశ్నవిన్న గురువు గారు శిష్యుడు కి ఇలా సమాధానం ఇస్తారు…*
*”నువ్వు ‘గురువులు అందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు!’ అని నువ్వు అనుకుంటున్నావు కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు.*
*భౌతిక సుఖo కోసం ఆరాట పడే వారు సహనం తో ఉండలేరు. ఎవరైతే సహనంతో ఉండరో వారు ఎప్పుడూ సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు.*
*మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే!*
*మనం ఎన్ని పరీక్షలు అయితే ఎదుర్కుంటామో మనలో అంత సహనం పెరుగుతుంది.*
*మనం ఎంత సహనాన్ని పెంచు కుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము, చేరుకొగలుగుతాము.*
*అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే… ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది.*
*కాబట్టి మనకు వచ్చే పరీక్షలను పరీక్షలు అని అనుకోకండి! అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేర వేసే వారధిలు అనుకోండి.”
No comments:
Post a Comment