Friday, July 18, 2025

 *ప్రసాదాలలో పోషక విలువలు !!*

శరీరంలో ఉన్న షట్ చక్రాల 
అవరోధాలు తొలగి జాగృతం
అవ్వడం పూర్ణ ఆరోగ్యం కోసం
ఋషులు మనకు అందించిన
అద్భుతమైన విధానం 

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

*జీర్ణశక్తిని పెంచే ' కట్టె పొంగళి*
బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .

*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*
బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .! 
                          
*మేధస్సును పెంచే దద్యోధనం*
బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది !!      
                     
*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబప్రసాదం*
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి, పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు , పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం!!                       
                                *శ్లేష్మాన్ని తగ్గించే  పూర్ణాలు* "పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .!!

*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*
బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం !!

*కొబ్బరి పాల పాయసం*
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

ఈ ప్రసాదం లు 
స్త్రీ రూపంలో ఉన్న నారాయణి
 జగన్మాయ కనకదుర్గాదేవి 
అంశా దేవతలకు
ఇక్కడ అమ్మ దుర్గం అనే శరీర 
రూపమే దుర్గమ్మ 

పురుష రూపంలో ఉన్న
నారాయణుడు విష్ణుమాయ 
శ్రీ మహావిష్ణువు అవతార
స్వరూపం లకు
ఇక్కడ శరీరంలో స్థితి పాలక
రూపంలో ఉండేది
శ్రీ మన్నారాయణుడు 

నివేదన చేయవచ్చు

రూపములు వేరే కానీ
ఇరువురు ఒక్కటే

సర్వే జనాః సుఖినోభవంతు 
లోకా సమస్తా సుఖినోభవంతు 

G NEMI RAMAKRISHNAA

No comments:

Post a Comment