Sunday, July 20, 2025

 పార్వతీదేవి శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలుసా? శ్రీలక్ష్మీ అమ్మవారిని సంతానంతో పాటు సకలసంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవి శాపానికిగురై శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించింది? ఈ ఆలయం ఎక్కడ వెలసింది? అనే విషయాలను మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం. గుంటూరుజిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీలక్ష్మీఅమ్మ వారి ఆలయం వుంది.పేరులో శ్రీలక్ష్మీ అని వున్నా ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు.ఇక ఆలయపురాణం విషయానికొస్తే పూర్వం కైలాసంలో పార్వతీపరమేశ్వరులు కూర్చొనివుండగా ప్రమధ గణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట. అప్పుడు జగన్మాత నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా అతడి నాట్యంలో తాళము,భావం ఏమీలేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట. అప్పుడు శిలాదుడికి కోపంవచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితవైన నీవు చిన్నతనంలోనే గర్భందాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు. అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాపవియోగమార్గమేమని అడుగగా నీతోపాటు కామధేనువు గో మాతగా అవతరిస్తుంది. నీవు రోజూ దానిని పూజిస్తావు.ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు.నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావుకాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా వుంటాడు. పెళ్ళికాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవరూపంవదలి నిదానంపాటి అమ్మవారుగా భక్తులకోర్కెలు తీరుస్తుంటావు. వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు.ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటిప్రాంతంలోని యాగంటిరామయ్య ఇంట్లో జన్మించిందని చెపుతారు. నలుగురు కుమారుల తరువాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశుసంపదలో కామధేనువు అనే గోవు వుండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజూ గోశాలకి వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని తాగుతూవుండేది. ఒక రోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది.ఆ విషయం తెలియని శ్రీ లక్ష్మి రోజూలాగే వెళ్లి గోమాతను పూజించి గోపంచతాన్ని తాగింది.అప్పుడు ఆమె కొన్నాళ్ళకు గర్భవతిఅయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆమెని,వారి ఇంటివారిని చాలా అవమానించారుదాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పుపెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో వున్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది.అలా

మంటలకు ఆహుతైన శ్రీ లక్ష్మి శిలగా మారిపోయింది.

శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment