*ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు. ఎందుకో తెలుసా.?వైద్య నిలయం సలహాలు*
ఎండాకాలంలో చాలామంది కూల్ వాటర్ తాగుతారు. చల్లటి నీళ్లు నోట్లో పడితే.. హాయిగా అనిపిస్తుంది. వాటితో ఏదో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. అయితే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఫ్రిడ్జ్లోని నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి:
*1.-*జీర్ణక్రియకు ఆటంకం* :
చల్లటి నీళ్లు తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఒక్కసారిగా కుంచించుకుపోతుంది. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు మరియు పోషకాలు శరీరం గ్రహించడంలో ఇబ్బంది కలుగుతుంది.
*2.-శరీర ఉష్ణోగ్రతలో మార్పు:*
వేడి నుండి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగితే, శరీరం తన ఉష్ణోగ్రతను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది.
*3.-గొంతు నొప్పి మరియు జలుబు:*
చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు మరియు జలుబు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
*4.-గుండెపై ప్రభావం:* కొందరిలో చల్లటి నీళ్లు తాగడం వల్ల గుండె వేగం తగ్గే అవకాశం ఉంది.
*5-మలబద్ధకం:*
చల్లటి నీళ్లు పెద్ద పేగును సంకోచింపజేస్తాయి, దీని వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది.
*6.-కూల్ వాటర్ తాగితే.. నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు. శరీరం లోని కొవ్వు బయటికి పోదు. ఈ కారణంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎండాకాలంలో ఎక్కువ కూల్ వాటర్ తాగే బదులు ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్ల తాగడం బెటర్. ఇలా చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు.*
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment