Monday, March 30, 2020

సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేనలను వివాహం చేసుకొనుట

సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేనలను వివాహం చేసుకొనుట

లోకసంరక్షనార్ధం తారకాసురున్ని వధించేందుకై దేవతలకోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ మార్గశిర షష్టి ని "సుబ్రహ్మణ్య షష్టి" లేదా "స్కంద షష్టి" గా పిలువబడుతోంది.

సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అందరినీ వధించిన తరువాత షణ్ముఖుడు తిరుచందూర్ ప్రాంతానికి వచ్చి సేదతీరారట . కురువ వంశానికి చెందిన గిరిజనుల నాయకుడు నంబిరాజన్. అతనికి అడవిలో లభించిన వల్లీ దేవిని ఇక్కడే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వివాహం చేసుకున్నారు . కళ్యాణ క్షేత్రంగా ప్రసిద్ధి . ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికి ఇచ్చి వివాహం చేసాడు . తారకాసురునితో జరిగిన యుద్ధంలో కుమారుని ఛాతి భాగంలో లోతైన గాయం అయ్యినదట. స్వామి వారి పెద్ద భార్య దేవసేన తండ్రి దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు ఒక గంధపు చెట్టు తాలూకు భాగాన్ని అరగదీయడానికి కావలసిన రాతిని ఇచ్చి గంధం తీసి గాయం మీద రాయమన్నారట. నేటికీ కోవెలలో గంధం తీసే రాయి ఇంద్రుడు ఇచ్చినదిగా పరిగణిస్తారు.
అదే విధంగా మూలవిరాట్టుకు అలంకరించే చందనంలో అద్భుత ఔషధ గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు.

అల్లుడికి వివాహ కానుకగా లెక్కలేనన్ని కానుకలతో పాటు ఐరావతాన్ని కూడా ఇచ్చేశాడట దేవేంద్రుడు. ఆయన వైభవానికి కారణమైన తెల్ల ఏనుగు దేవలోకాన్ని వదిలి వెళ్లడంతో ఇంద్రుడు తన సంపదలను కోల్పోవడం ప్రారంభమైనది. మామగారి పరిస్థితి తెలుసుకొన్న షణ్ముఖుడు ఐరావతాన్ని అమరావతి వైపుకు తిరిగి ఉండమన్నారట. స్వర్గాధిపతి పరిస్థితి స్థిరపడింది. ఐరావతాన్ని తన లోకం వైపు చూసేలా చేసి తనకు పూర్వస్థితి దక్కేలా చేశారు అన్న కృతజ్ఞతతో ఇంద్రుడు కలువ పూలతో అర్చించారట. అందుకే ఈ ఉత్సవాల సందర్భంగా ఈ పూలతో అర్చన, అలంకరణ చేస్తారు.

No comments:

Post a Comment