Thursday, December 11, 2025

బ్రహ్మచారి మహిళల్లో కనిపించే 7 అద్భుత ఆధ్యాత్మిక శక్తులు | Female Brahmacharya 7 Powers

బ్రహ్మచారి మహిళల్లో కనిపించే 7 అద్భుత ఆధ్యాత్మిక శక్తులు | Female Brahmacharya 7 Powers

https://youtu.be/gkRG45RPQrM?si=v6J02GXvFGDk_b7L


https://www.youtube.com/watch?v=gkRG45RPQrM

Transcript:
(00:08) [సంగీతం] చాలామంది ఆడవాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించే మహిళలకు కలిగే ఏడు ఆధ్యాత్మిక దివ్య ఫలితాలు ఈరోజు మనం వీడియోలో డెప్త్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఒక గొప్ప రహస్యం ఉంది.
(00:37) మహిళ తన శక్తిని కాపాడుకుంటే ఆమెను ఎవ్వరూ అనగదొక్కలేరు. బ్రహ్మచర్యం అంటే చాలామంది శరీర నియంత్రణ అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే బ్రహ్మచర్యం అనేది శక్తి పరిరక్షణ. శక్తి పరిరక్షణ అనేది దైవత్వపు ద్వారం. ఒక మహిళ తన శక్తిని అర్థం చేసుకున్నప్పుడు ఆమె ఆత్మలో ఒక జ్యోతి వెలుగుతుంది. ఈరోజు నీకు చెప్పేది అదే బ్రహ్మచర్యం పాటించే మహిళలకు కలిగే సెవెన్ ఇంట్యూషన్ పవర్స్ ఫస్ట్ వన్ ముఖంపై దివ్యకాంతి చైతన్య వెలుగు బ్రహ్మచర్యం పాటిస్తున్న మహిళ ముఖం మారదు కానీ ముఖం వెలిగిపోతుంది.
(01:16) ఆమె శక్తి బయటకు వృధా కాకుండా లోపలే సగటవుతుంది. అప్పుడు ముఖం పై సహజమైన ప్రకాశం, కలలో లోతైన ఆకర్షణ, చుట్టూ రెండు, మూడు అంగులాల దాకా స్ప్రెడ్ అయ్యేదాకా ఆర ఇవి సహజంగా కనిపిస్తాయి. ఆమెను చూసినప్పుడు కూడా ఈ అమ్మాయిలో ఏదో దివ్యతత్వం ఉంది అనే భావన ఇతరులకు కనిపిస్తుంది. సెకండ్, భావోద్వేగాలపై పట్టు మనసు నిశ్చలం. బ్రహ్మచారి మహిళ భావోద్వేగాలకు బానిస కాదు ఎందుకంటే ఆమె తన అంతర్గత శక్తిని పరిరక్షిస్తుంది.
(01:50) అనవసరం లేని అటాచ్మెంట్స్ తగ్గిపోతాయి హార్ట్ బ్రేక్స్ మీద భయం ముగిసిపోతుంది. ఎవ్వరూ ఆమె మనసును డిస్టర్బ్ చేయలేరు. ఆమె దగ్గర ఎల్లప్పుడూ నిశశబ్దమైన శక్తి అనిపిస్తుంటుంది. థర్డ్ వన్ శక్తి మేలుకొలుపు బ్రహ్మచర్యం పాటిస్తున్న మహిళల్లో రెండు స్థాయిల శక్తి పైకి లేస్తాయి. ఒకటి స్థూల శక్తి శరీరంలోని ప్రాణశక్తి రెండు సూక్ష్మ శక్తి కుండలిని చైతన్యం ఇవి పైకి ఎగిస్తే అంతర్గత బలం పెరుగుతుంది.
(02:22) ఇంట్యూషన్ అంతర్జ్ఞానం పదునెక్కుతుంది. ఆత్మవిశ్వాసం దైవీ స్థాయికి చేరుతుంది. మహిళ ప్రెసెన్స్ మాగ్నెటిక్ గా మారుతుంది. ఈ దశలో ఆమెలోకి దేవి తత్వం ప్రవేశిస్తుంది. అది మాటల్లో చెప్పలేం. ఫోర్త్ వన్ పురుషులపై దూరం నుండి ప్రభావం.ఆ ఆరా అధిపత్యం బ్రహ్మచర్యం పాటించే మహిళల్ని పురుషులు అలా సులభంగా చేరుకోలేరు.
(02:49) ఎందుకంటే ఆమె ఆరాలోకి లోయర్ వైబ్రేషన్ ఎనర్జీ ప్రవేశించలేదు. పురుషులపై ఆమె ప్రభావం ఇలా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది హద్దులు దాటి మాట్లాడేందుకు భయపడతారు. దూరం నుండే ఆకర్షణ ఏర్పడుతుంది. ఆమె ఆర ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఐదు ఆధ్యాత్మిక పురోగతి వేగవంతం సహజ సమాధి బ్రహ్మచర్యం వల్ల నిలిచిపోయే ప్రాణశక్తి ధ్యానం చేసేటప్పుడు పైకి ఎగిసిపోతుంది. దాంతో మంత్రాలు త్వరగా ఫలిస్తాయి.
(03:20) ధ్యానంలో లోతైన శాంతి వస్తుంది. దేవతలతో అనుబంధం బలపడుతుంది. అంతర్ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె చేసే ప్రార్థన కూడా అంతరిక్షాన్ని దాటి విశ్వ స్వరూపానికి నేరుగా చేరుతుంది. ఆరు శరీరం పవిత్ర ఆలయం అవుతుంది. జీవశక్తి సమతుల్యత. ఆధ్యాత్మిక శక్తి, జీవశక్తి కలిసి పని చేస్తాయి. బ్రహ్మచర్యంలో ఆడవారికి కనిపించే శరీరక లాభాలు హార్మోన్ సమతుల్యంగా ఉంటాయి.
(03:54) మెన్స్ట్రువల్ సైకిల్ స్థిరత్వంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గిపోతుంది. శరీరం లేతగా శక్తివంతంగా మారుతుంది. శరీరం పవిత్ర ఆలయంలా పనిచేస్తుంది. ఏడు జీవితంపై పూర్తి స్థాయి నియంత్రణ. విధి స్వాధీనం భావాలు సంబంధాలు ఆకర్షణ ఇవి ఎక్కువ మహిళల్ని లైఫ్ పాస్ నుండి తొలగిస్తాయి. కానీ బ్రహ్మచారి మహిళ తన మార్గాన్ని స్పష్టంగా చూస్తుంది. తన శక్తిని ఎవరికీ కోల్పోదు.
(04:25) నిర్ణయాలు దైవిక స్థితి నుండి తీసుకుంటుంది. తన విధిని తానే రూపుదిద్దుకుంటుంది. ఆమె మనసు అశ్రమం అవుతుంది. ఆమె ఆర రక్షణ అవుతుంది. ఆమె ఆత్మ విజయం అవుతుంది. బ్రహ్మచర్యం ఒక పరిమితి కాదు ఒక శక్తి సంరక్షణ యాత్ర. ఒక మహిళ తన శక్తిని అర్థం చేసుకుని కాపాడుకుంటే ఆమె ఎదుగుదలను ప్రపంచం కూడా ఆపలేదు. నీ లోపల ఉన్న దైవత్వం బయటకు రావాలంటే నీ శక్తిని దారి తప్పనివ్వకూడదు.
(04:56) దానిని కాపాడు దానిని లేపు మిగతా మార్గం ఆ శక్తి తానే చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుసా [సంగీతం] [సంగీతం] [సంగీతం]

మగవాళ్లకేనా? ఆడవాళ్లకీ ఉంది! బ్రహ్మచర్యం & బ్రహ్మచారిణి దైవిక లక్షణాలు 🔥

మగవాళ్లకేనా? ఆడవాళ్లకీ ఉంది! బ్రహ్మచర్యం & బ్రహ్మచారిణి దైవిక లక్షణాలు 🔥

https://youtu.be/IW4UM-CFOB4?si=4d19_5VhXVsLKGAY


https://www.youtube.com/watch?v=IW4UM-CFOB4

Transcript:
(00:05) [సంగీతం] బ్రహ్మచర్యం అంటే మగవాళ్ళకేనా ఆడవాళ్ళకి బ్రహ్మచర్యం ఉండదా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే తెలుస్తుంది. మొదట మనం శక్తి ఎలా పని చేస్తుందో అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మచర్యం అంటే కేవలం శరీర నియంత్రణ కాదు అది జీవశక్తిని ఎక్కడ లీక్ కాకుండా ఉంచుతూ దాన్ని పైకి ఎక్కించడం ఈ ప్రక్రియ మగవాళ్ళలో ఒక విధంగా జరుగుతుంది కానీ ఆడవాళ్ళలో పూర్తిగా వేరే విధంగా జరుగుతుంది.
(00:46) ఆడవాళ్ళకి వీర్యం ఉండదు కానీ వారి దగ్గర ఉంది ఒక అత్యంత పవర్ఫుల్ మైన శక్తి దాన్నే రేతస్సు అంటారు. రీప్రొడక్టివ్ ఎనర్జీ ఒక్క ఓవం కూడా ఒక ప్రాణిని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. అంటే ఆడదిలో కూడా సృష్టి శక్తి నిలవ ఉంది. దాన్ని శాస్త్రం రేతస్సు అంటుంది. శాస్త్రం శక్తి అంటుంది. స్పిరిచువాలిటీ దాన్ని దేవీ తత్వం అంటుంది. అందుకే ఆడదిలో బ్రహ్మచర్యం అంటే సృష్టి శక్తి భావోద్వేగ శక్తి హృదయ శక్తి ఈ త్రీ బ్యాలెన్స్డ్ గా ఉంచడం.
(01:21) ఆడవాళ్ళకి బ్రహ్మచర్యం ఎలా వేరేలా ఉంటుంది? మగవాళ్ళలో ఎనర్జీ లీక్ శరీరంతో కానీ ఆడవాళ్ళలో ఎనర్జీ లీక్ శరీరంతో కంటే బాగావేగాలతో జరుగుతుంది. ఆడది ఎక్కువగా గివింగ్ ఎక్కువగా ఎమోషనల్ ఎక్కువ అటాచ్ అయ్యే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే ఒక తప్పుడు వ్యక్తి మీద అతి ఎఫెక్షన్, ఓవర్ థింకింగ్, హార్ట్ బ్రేక్, మెంటల్ క్లింగ్ ఇవే ఆడదిలో శక్తిని డ్రైన్ చేసే ప్రధాన కారణాలు.
(01:52) అందుకే నెంబర్ వన్ ఆడవాళ్ళలో బ్రహ్మచర్యం అంటే ఎమోషనల్ బ్రహ్మచర్యని పాటించడం. ఒక మహిళ తన భావోద్వేగాలు తన జీవశక్తి తన మనసును ఒకే దిశలో నడిపితే ఆమెను బ్రహ్మచారిని అంటారు. బ్రహ్మచారిని అంటే కేవలం శారీరక సంబంధాలు మానేసిన అమ్మాయి కాదు. తన శక్తిని లీక్ కాకుండా దాన్ని ఆత్మీక దిశలో మార్చిన అమ్మాయి. ఈ రోజున మీరు బ్రహ్మచారిని ఎలా అవ్వాలి? ఆమె జీవితం ఎలా మారుతుంది ఎలాంటి డిసిప్లిన్ ఫాలో అవ్వాలో డెప్త్ గా తెలుసుకోబోతున్నారు.
(02:26) బ్రహ్మచారిని అంటే ఏంటి? ఆడదిలో ప్రధాన శక్తి ఎమోషనల్ క్రియేటివ్ ఇంట్యూషన్ ఎనర్జీ ఈ మూడు ఒకే దిశలో ఉన్నప్పుడు ఆమె ఆర పవర్ఫుల్ ఫుల్ గా మారుతుంది. మగవాళ్ళలో బ్రహ్మచర్యం ఎక్కువగా శరీరం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆడవాళ్ళలో బ్రహ్మచర్యం ఎక్కువగా భావోద్వేగాలు మనసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే శరీర నియంత్రణ 30% భావోద్వేగ నియంత్రణ 40% మనసు నియంత్రణ 30% ఈ మూడు కలిసినప్పుడే ఆ మహిళా బ్రహ్మచారిణి అవుతుంది.
(03:03) బ్రహ్మచారిణి అంటే ఎవరు? ఆడవాళ్ళలో శక్తి ప్రధానంగా మూడు చోట్ల ఉంటుంది. హృదయం భావోద్వేగ శక్తి, గర్భాశయం, స్పృజన శక్తి, శుషుమ్న నాడి ఆత్మిక శక్తి. ఈ మూడు చోట్ల శక్తి నిల్వలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఆమెను బ్రహ్మచారిని అంటారు. మగవాళ్ళకి శరీర నియంత్రణ ముఖ్యమైంది. కానీ ఆడవాళ్ళకి అత్యంత ముఖ్యమైనది భావోద్వేగ నియంత్రణ. ఎందుకంటే ఆడది హృదయం ద్వారా జీవిస్తుంది కాబట్టి బ్రహ్మచారిణి కోసం మొదటి దశ శరీరం పవిత్రంగా ఉంచడం అంటే అన్వాంటెడ్ టచ్ ఎవరిని టచ్ చేయకుండా ఉండటం శరీరాన్ని గౌరవించడం శాంతమైన ఆహారం తినడం ఎక్కువ మసాలా ఉప్పు వేడి పదార్థాలు తగ్గించడం నిద్ర పద్ధతి సరిగ్గా
(03:52) పెట్టుకోవడం శరీరాన్ని అలసటకు గురి చేసే పనులు తగ్గించడం శరీరం ప్రశాంత తంగా ఉంటే ప్రాణశక్తి పైకిఎక్కుతుంది. అక్కడే నిజమైన బ్రహ్మచారిని స్థితి మొదలవుతుంది. ఆడదిలో శక్తి ఎక్కువగా మనసు మరియు భావోద్వేగాల్లో ఉంటుంది. ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా మనసులో ఉంచుకోవడం ఊహల్లో ఎక్కువ ఉండడం బాధల్లో నిండిపోవడం ఎవరినైనా వదలలేకపోవడం ఇవన్నీ శక్తి లోపల నుంచే తగ్గించే అతి పెద్ద కారణాలు.
(04:27) భావశుద్ధి అవసరం లేని అటాచ్మెంట్లు వదిలేయడం హృదయాన్ని శాంతంగా ఉంచడం మనసు ఎవరి మీద ఆధారపడకుండా ఉంచడం బాహ్య ప్రపంచం మనల్ని ప్రభావితం చేయనికపోవడం ఇది వచ్చినప్పుడు ఆడదిలో తేజస్సు పెరుగుతుంది. బ్రహ్మచారిణి అంటే మనసుని కట్టడి చేసిన స్త్రీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. ఆలోచనలు శుభ్రంగా ఉంటాయి. తప్పుడు ఆకర్షణలు తగ్గుతాయి.
(04:57) అసహనం కోపం దాదాపు ఉండవు. మనసుని నియంత్రించే కొన్ని పద్ధతులు దీర్ఘశ్వాష ధ్యానం నిశశబ్దం ఒంటరిగా గడపడం ప్రకృతితో సమయం ఇవి మనసు బలాన్ని పెంచి శక్తిని లోపలే నిల్వ చేస్తాయి. జీవశక్తిని నిల్వ చేయడం ఆడదిలో రేతస్సు సృష్టి శక్తి అమూల్యమైనది దాన్ని వృధా చేస్తే హృదయ శక్తి కూడా బలహీనమవుతుంది. బ్రహ్మచారిని జీవశక్తిని ఇలా కాపాడుతుంది.
(05:26) ఆలోచన పవిత్రం స్వీయ గౌరవం శరీరం మనసు రెండింటిని శాంతంగా ఉంచడం శక్తిని బయటికి నెట్టే వ్యక్తులు సంబంధాలకి దూరంగా ఉండడం హృదయం మీద తక్కువ భారం పెట్టుకోవడం జీవశక్తి నిల్వ అయినప్పుడు ఆమె ఆకర్షణ కాంతి గ్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఆత్మిక శక్తిని పెంచుకోవడం ఇది బ్రహ్మచారిణి యొక్క అసలు ప్రయాణం ఆమె ఆత్మికంగా ఎదగడానికి చేస్తుంది.
(05:56) మంత్రజపం నిత్య ధ్యానం శాష సాధన పవిత్రమైన వాతావరణంలో జీవించడం స్వప్రయాణం ఇవి కుండలిని శక్తిని మెల్లగా సురక్షితంగా పైకి తీసుకెళ్తాయి. ఆమె లోపల శాంతి వ్యవహారంలో గౌరవం కనిపిస్తుంది. బ్రహ్మచారిని లక్షణాలు ఒక నిజమైన బ్రహ్మచారిని ఇలా గుర్తించొచ్చు ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళల్లో అనవసర తపన ఉండదు. మాటల్లో దయ ధైర్యం ఉంటాయి.
(06:25) ఆరా వెలుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కదిలిపోదు ఎవరి మీద డిపెండ్ అవ్వదు. నిర్ణయాల్లో స్వతంత్రత ఉంటుంది. అనవసరమైన ఆకర్షణలు పోలికలు ఉండవు. అంతర్గతంగా శక్తి నిల్వగా ఉన్నప్పుడే ఆమె దేవతా గుణం పొందుతుంది. బ్రహ్మచారిని జీవితం ఎలా మారుతుంది? హృదయం బలంగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. భయం, గిల్టీ, అనిశ్చిత తగ్గిపోతాయి.
(06:54) చుట్టూ ఉన్నవారు గౌరవించడం మొదలు పెడతారు. ఆమె మాటల్లో ఏదో ప్రభావం పెరుగుతుంది. జీవితం మీద పూర్తి నియంత్రణ వస్తుంది. శరీరం మనసు రెండు సమతుల్యం అవుతాయి. ఆత్మీక శక్తి పెరుగుతుంది. బ్రహ్మచారిని అవ్వడం అంటే జీవితాన్ని ఎవరికోసం మార్చడం కాదు తనకోసం తనని మార్చుకోవడం ఇది ఒక పవిత్రమైన యాత్ర శరీర యాత్ర కాదు భావోద్వేగ యాత్ర కాదు ఆత్మ యాత్ర ఎక్కడ శక్తి ఉంది అక్కడే దేవత ఉంటుంది.
(07:29) ఆ శక్తిని లోపల నిల్వ చేసి దాన్ని పర్వతంలా నిలబెట్టిన స్త్రీ నిజమైన బ్రహ్మచారిని ఆసోసేసే [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓం

 మీకు ఎవరిపట్ల గానీ, దేనిపట్ల గానీ ఎలాంటి కర్తవ్యమూ లేదు. మీలో ప్రేమ, శ్రద్ధ ఉంటే అవసరమైనది మీరే చేస్తారు.
You do not have any duty towards anyone or anything. If you have Love and Care, you will do what is needed.

Sadguru

Source - http://youtube.com/post/UgkxNULSvEtBYDBNP7H8s0rFh-7Vcpq7uD29?si=GqDNiAtFhbV1Csnk




Why Mark Zuckerberg Married a Less Attractive Woman

Why Mark Zuckerberg Married a Less Attractive Woman

https://youtube.com/shorts/79FchNoPdkQ?si=Io_FgMAE4y2MGWf2


https://www.youtube.com/watch?v=79FchNoPdkQ

Transcript:
(00:00) Why did Mark Zuckerberg marry Priscilla Chan? Even though many people online say she isn't attractive enough for a billionaire. Some people laugh at the fact that the second richest man on Earth worth over $200 billion chose a woman who looks simple while other billionaires like Elon Musk change young partners often.
(00:17) Priscilla is the daughter of a Chinese father and a Vietnamese mother who came to America as refugees. She met Zuckerberg at Harvard and they started dating long before Facebook became huge. Through every big idea, every failure, and every moment people doubted him, Priscilla stood beside him, quietly supporting him. They married in 2012, 9 years after their first date.
(00:37) Someone once asked him if he felt that his wife was using him to rise in status. Zuckerberg replied that she never wanted anything from him

  1.*సలహా అనేది ఎవరికి అవసరమో, వారికే రుచించదు.*

2.*తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.*

3.*మన సంతోషం మన తెలివితేటలపై అధారపడి వుంటుంది.*

4.*కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంటుంది.*

5.*థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.*

6.*బాధ్యతా నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.*

7.మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగా వుంటుంది.

8.మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.

9.అఙ్నానం భిన్నత్వానికి, జ్ఞానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.

10.వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.

11.నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది. గర్వం శత్రువుల్ని పెంచుతుంది.

12.సత్యమార్గంలో నడిచేవాడే సంపన్నుడు.

13.ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్యసాధనం మరొకటి లేదు.

14.దుఃఖం అనేది శిక్ష కాదు.సంతోషం అనేది వరమూ కాదు. రెండూ ఫలితాలే .

15.స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.

16.నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, జ్ఞానం, వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.

17.సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్కృతి

18.మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.

19.ధైర్యం, కాలం, ప్రకృతి,....ఈ మూడూ ఉత్తమమైన గొప్ప వైద్యులు .

20.పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది. మానవుడే పరిస్థితుల్ని సృష్టించుకున్నాడు.

21.సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.

22. మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.

23. లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు

24. ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.

25.బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా

26.మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి

27.చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది

28.కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి

29.*సంసార సాగరం దాటాలంటే…సంస్కారముల పరివర్తన కావాలి*.          

30.*కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది.*
 *🧘పంచభూత కీర్తన🧘‍♀*


🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!🔥  
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

🕉చింతయామి విశ్వేశ్వర లింగం!🔱
🕉🪷చింతయామి విశ్వేశ్వర లింగం!!🔱

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

🎆అంబరభావ చిదంబర లింగం !🎆
🎆అంబరభావ చిదంబర లింగం !!🎆

🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం !!🔥

🌬శ్రీ కాళహస్తి పావన లింగం!🌬
🌬శ్రీ కాళహస్తి పావన లింగం!!🌬

🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

🔥అరుణమచల మరుణాచల లింగం!🔥
🔥అరుణమచల మరుణాచల లింగం!!🔥

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం !🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం !!🔥

🌏 ఏకామ్రేశ్వర పృథ్వీ 
లింగం !🌏
🌏 ఏకామ్రేశ్వర పృథ్వీ 
లింగం !!🌏

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం !🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం !!🔥

💦 జంబుకేశముజ్వల జలలింగం ! 💦
💦 జంబుకేశముజ్వల జలలింగం!! 💦

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

🌏💦🔥🌬🎆
పంచభూత మూలం పరలింగం!
పంచభూత మూలం పరలింగం!!
🌏💦🔥🌬🎆

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

💦గంగాజలాభిషిక్తి 
శుభాంగం !💦
💦గంగాజలాభిషిక్తి 
శుభాంగం !!💦

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

🦚షణ్ముఖార్చితం శాంభవ లింగం ! 🦚
🦚షణ్ముఖార్చితం శాంభవ లింగం !!🦚

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

🔥చిన్మయ జ్యోతిర్మయ 
లింగం ! 🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥

 *శరీరం లోని చైతన్యం నశిస్తే నిర్యాణం* 
*మనసులోని ఆలోచనలు నశిస్తే నిర్వాణం* 

*"శీర్యతే ఇతి శరీరమ్"* నాశనమయ్యే స్వభావం కలది కాబట్టి దీనిని శరీరం అంటున్నాము.

భిన్న దేహాలను ఒకదాని తరువాత మరొకటిగా జీవుడు స్వీకరిస్తాడు.
తన కర్మల ననుసరించి జీవుడు వివిధ దేహాలను పొందుతాడు. 
జీవునికి లభ్యమయ్యే దేహాలలో మానవ దేహం ఉత్తమమైనది. 

శాస్త్రాలు అలాగే చెప్తున్నాయి. 
శాస్త్రాలు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే..
ఆత్మ, దేహం ఒకటి కాదని ముందు గ్రహించాలి.

*ఇతర దేహాలకు లేని ప్రాధాన్యత మానవ దేహానికి ఎందుకని ఇచ్చారు?*
ఇతర దేహాలు పూర్వ కర్మ ఫలాలను అనుభవించటానికి మాత్రమే.
మానవ దేహం నూతనంగా కర్మలను ఆచరించగలదు. అదే ముఖ్యమైన తేడా. పశువుల జీవితాలు ఆహార స్వీకారం, నిద్ర మొదలైన వాటిలో గడిచిపోతున్నాయి.

*"దండో ద్యత కరం పురుషమభిముఖముపలభ్యమాం హంతు మయమిచ్చతీతి పలాయితుమారంభతే*

పశువులు ఎవరైనా కర్ర తీసుకొని వస్తే పారిపోతాయి.

*"హరితతృణ పూర్ణ పాణి ముపలభ్యతం ప్రత్యభి ముఖీ భవంతి"*

చేతిలో పచ్చగడ్డితో వస్తే అతనిని సమీపిస్తాయి. 

పశువులకు తెలిసిందంతే.

కానీ *మానవుదలా కాదు భగవద్దత్తమైన బుద్ధి కారణంగా*
*మోక్షాన్ని కూడ సంపాదించగల యోగ్యతను కలిగియున్నాడు.*

అతని బుద్ధి వ్యవహరించే తీరును బట్టి ఎదైనా సాధించగలదు. 
అందువలన మానవజన్మ విశేషమైనదని శాస్త్రంలో చెప్పబడింది.

*"మహతా పుణ్య పణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా*
*పారం దుఃఖోదధేర్గన్తుం తర యావన్న భిద్యతే!!"*

*మానవదేహం ఒక నావలాంటిది.*
*చాల ధనాన్ని వెచ్చించి దానిని ఖరీదు చేశాం.*
*మరొకటి దొరుకుతుందో లేదో తెలియదు.*
*దానితో ఒక మహాసాగరాన్ని దాటాలి.* 
*దానికి మధ్యలో బీటలు పడి, మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది.* 
*కాబట్టి నావ ఎక్కువకాలం ఉండదనీ విదితమే.*
అలా పడిన బీటలు వారే లోపల, ఆ పడవను ఖరీదు
చేసిన ఉద్దేశ్యం నెరవేర్చుకున్నట్లయితే అటువంటి వానిని తెలివైన వాడనాలి. 

*ఇంతకీ ఆ మహాసాగరం ఏమిటి?* 
జనన మరణ వలయమే ఒక మహాసాగరం. 

మానవ జీవిత సార్ధకత జ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది. 
కానీ మరో దానితో కాదు. మానవ దేహాన్ని పొందిన తరువాత కూడా జ్ఞాన సముపార్జనకై ప్రయత్నించని వారు మానవ జన్మను వృథా చేసినట్లే.
అటువంటి వారు పశువులుగా జన్మించటమే మేలు.

ఎందువల్లననగా పశువులకు ప్రత్యవాయం అంటూ ఉండదు కాబట్టి.

అపి మానుష్యకం లబ్ధ్వా భవంతి జ్ఞానినో న యే!
పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్!!

అందువలన మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే అని తీర్మానం.
🪷🪷🧘🧘‍♀🪷🪷.      
 🔱ఓం నమః శివాయ🔱:                *శ్రీ లలితోపాఖ్యానము*
షోడశ శ్రీపురాలు, పర్వతాలు
"ప్రధమం మేరుపృష్ఠే చ నిషధే చ మహీధరే
హేమకూటే హిమగిరౌ పంచమం గంధమాదనే
నీలమేషే చ శృంగాఖ్యే మహేంద్రే చ మహాగిరౌ
(సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయికా)
సముద్రాలు
లవణాబ్ధీక్షుసారాబ్ధి ధృత సాగరాః దధి సింధుర్జలసింధుశ్చ సప్తమః
మధ్యనున్న శిఖరంలో ఉన్నదే శ్రీపురం. 7 నలుచదరపు లోహపు గోడలతో, నిర్మించబడి ఉంటుంది.(ఈ గోడలే ప్రాకారాలు కోటలు అని కూడా అనబడుతాయి.)
ఒక్కొక్క ప్రాకారం మధ్య 7 యోజనాల దూరం ఉంటుంది.
మొదటిది అయోధాతు నిర్మితం. ఇనుముతో ధాతు శిలలతో దృఢంగా నిర్మించబడ్డ  ప్రాకారం. 16 వేల యోజనాల చుట్టుకొలత కలిగి రకరకాల అస్త్రశస్త్రాలు ధరించిన రక్షకభటులు ఆ ప్రాకారం మీద కావలి తిరుగుతూ ఉంటారు. ఆ మహా ప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలుంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతలు వారి వెంట వచ్చే గణాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటారు. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళ్ళితే అడుగడుగునా సరస్సులూ రత్నద్రుమవాటికలు కనిపిస్తాయి.
ఆ సుందర వనాలు దాటి వెళ్ళితే కనిపించేది రెండవ ప్రాకారం, కాంస్య ప్రాకారము. ఇది ఇనుప కోటకన్నా నూరు రెట్లు కాంతి కలిగి ఉంటుంది. వీటి రెంటి మధ్యనున్న భాగం రత్న వృక్షాలతో అందమైన వనాలతో నిండి కనుల పండుగగా ఉంటుంది. కోకిలారవాలు, భ్రమర నాదాలు మారుమోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. నెమళుల క్రేంకారాలు. కనులకు చెవులకు విందు చేస్తూ ఉంటాయి.
కాలచక్రము అనే సింహాసనము అధిరోహించిన మహాకాళి మాహాకాలుడు అక్కడి రక్షకులు.
మూడవది తామ్ర ప్రాకారం (రాగి కోట). చతురస్రాకారంలో ఉండి  కాంస్య ప్రాకారం లాగానే సప్త యోజనాల ఎత్తు. ఈ రెండు ప్రాకారలకు నడుమ కల్పవృక్షాల వనంతో నిండి ఉంటుంది. కనుక దీనిని కల్పవాటిక అని కూడా అంటారు. పండ్లలోని బీజములు కూడా రత్నాలే. వాటి సువాసనలు చాలా దూరము దాకా వ్యాపించి ఉటాయి. ఇది రెండవ ప్రాకారం. మధుశ్రీ, మాధవశ్రీ భార్యలగా ఉన్న వసంతుడు తామ్ర కుడ్యానికి రక్షకుడుగా ఉంటాడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని, పుష్ప కిరీటం ధరించి, పుష్పచత్రంతో పుష్పభూషితుడుగా చిరునవ్వులు చిందిస్తూ భార్యలతో పూలబంతులతో ఆడుకుంటూ ఉంటాడు. వారి గంధర్వ గానం చెవులకింపుగా ఉంటుంది.
ఆ సుందరవనంలో దేవతలూ గంధర్వులూ జంటలుజంటలుగా విహరిస్తూ ఉంటారు.
తామ్రసాల దాటిన తరువాత కనిపించేది నాలుగవదైన సీసనిర్మిత ప్రాకారము. ఈ సీసముతో నిర్మించిన ఏడు యోజనాల ఎత్తు. తామ్రప్రాకారం, సీస ప్రాకారానికి మధ్య ఉన్న ప్రాంతం మొత్తం సంతాన వృక్షాలతో నిండి సంతానవాటిక అనబడుతుంది. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. చెట్ల మొదళ్ళోఅమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానకవృక్షాల కింద సేదతీరుతూంటాయి. దేవతలు సిద్దులూ విలాసినీ మణులతో వనంలో విశ్రమిస్తూ ఉంటారు. శుక్రశ్రీ శుచిశ్రీ భార్యలుగా ఉన్న గ్రీష్ముడు తోటమాలి.
ఇత్తడితో చేయబడ్డ ఈ నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తు కలిగి, రెండు ప్రాకారాల నడుమ హరిచందన వృక్షవాటిక వర్షరుతువు వనపాలకుడుగా ఉంటుంది. మెరుపులు కన్నులుగా పింగల వర్ణంలో తళతళలాడుతూ, మేఘాలు కవచంగా ధరించి , ఉరుము వంటి కఠద్వనితో, నిరంతరం వర్షపుజల్లులతో, నభశ్రీ నభ్యశ్రీ మొదలుకొని పన్నెండు మంది  భార్యలతో కూడి ఉంటాడు. ఆ ప్రాంతంలో దేవతలూ, సిద్దులూ దేవీ పూజాతత్పరులు ఈ వనాలలో పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. నదీ నదములు ఎక్కువగా ఉంటాయి. పచ్చటి లతలతో కళకళ్ళాడుతూ ఉంటుంది.
సీసప్రాకారం దాటిన తరువాత ఆరవదైన పంచలోహప్రాకారము కనిపిస్తుంది. ఈ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఈ రెండు ప్రాకారల మధ్య మందారతరువాటిక ఉంటుంది. ఈషశ్రీ, ఊర్జశ్రీ (ఇష్టలక్ష్మి,ఊర్జలక్ష్మి) అన్నభార్యలతో శరదృతువు రక్షకుడుగా వనమాలిగా ఉంటాడు.
తరువాత ఏడవ ప్రాకారము రజత నిర్మిత ప్రాకారము.(వెండి కోట). సహశ్రీ, సహస్యశ్రీ అన్న భార్యలతో హేమంతఋతువు ఆ కోటకు రాజు. ఆ ప్రాంతమంతా పారిజాతవనాలతో నిండి ఉండి ఆ పూల వాసన పది యోజనాల వరకు వ్యాపించి ఉంటుంది.
వెండి ప్రాకారం దాటితే ఎనిమిదవ ప్రాకారము కనిపిస్తుంది సౌవర్ణప్రాకారము (బంగారపు కోట). ఏడు యోజనాల ఎత్తు ఉన్న ఈ ప్రాకారం బంగారంతో కట్టబడి ఉండి మధ్యలో కదంబ వృక్షంతో అలరిస్తూ ఉంటుంది.
(కదంబవనవాసినీ)
నిరంతరం పూలతో పండ్లతో నిండి ఉండి నాలుగు పక్కల నుండి తేనెధారలు కారుతూ ఉంటాయి. దేవి భక్తులు ఆ మకరందాన్ని త్రాగి ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. శిశిరఋతువు ఆ ప్రాకారపు అధినేత. తపశ్రీ,తపస్యశ్రీ అనే భార్యలతో శిశిఋడు ఆనంద సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
తొమ్మిదవదైన పుష్పరాగ ప్రాకారం సౌవర్ణ ప్రాకారము దాటిన తరువాత కనిపిస్తుంది. కుంకుమ వంటి అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల కోనేరులతో సహా వనాలు ఉపవనాలు వృక్షాలు ఎగిరే పక్షులు. కదిలే జంతువులు, పారే నీళ్ళు మండపాలు మండప స్తంభాలు అన్ని పుష్యరాగమయాలే. సౌవర్ణసాల కన్నా తేజస్సులో లక్షరెట్లు అధికం.

ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు.
తూర్పు దిక్కున ఉన్న భవంతిలో అమరావతి ఉంటుంది. ఇక్కడ మహేంద్రుడు ఐరావతం అధిరోహించి వజ్రాయుధం చేతబూని, శచీదేవితో సహా కొలువై ఉంటాడు. స్వర్గలోకంలో కన్నా ఇకడ భోగం వేయిరెట్లు.
ఆగ్నేయమూలన ఉన్నది వహ్నిపట్టణం. ఆ పట్టణంలో తన ఇద్దరు భార్యలైన స్వాహా స్వధాలతో కూడి కొలువై ఉంటాడు.
దక్షిణ దిక్కున ఉన్నది యమపురి. యమధర్మరాజు దండధారి అయి చిత్రగుప్తుడితో యమభటులు వాహనమైన మహిషం ఇక్కడ దర్శనమిస్తాయి.
నైఋతి కోణం రాక్షస స్థావరం. నిరృతి గొడ్డలి చేతబూని భార్యా సమేతంగా ఇతర రాక్షసులతో కొలువుతీరి ఉంటాడు.
పశ్చిమ దిక్కున వరుణుడి రాజ్యం. భార్య వారుణితో వాహనమైన ఝష (పెద్ద చేప)వాహనం అధిరోహించి పాశం చేతబూని వారుణీ మధువు త్రాగుతూ మత్తులో ఉంటాడు. జలచరాలు చుట్టు నడయాడుతుండగా విహరిస్తూ ఉంటాడు.
వాయవ్య మూలనున్నది వాయులోకం. ప్రాణాయామ సంసిద్ధులైన యోగి సమూహం ఇతడి పరివారము. ద్వజము చేతబూని మృగవాహనుడై, నలభై తొమ్మిది మంది మరుద్గణాలు వెంటరాగా విహరిస్తూ ఉంటాడు.
ఉత్తర దిక్కున ఉన్నది యక్షలోకం. యక్షరాజు కుబేరుడు వృద్ధి ఋద్ది శక్తులతో నవనిధులకు అధిపతై మణిభద్రాది యక్ష సేనానులు పరివేష్టులై ఉండగా ఈ కోటలో నివసిస్తూ ఉంటాడు.
ఈశాన కోణంలో ఉన్నది రుద్రలోకం అనేక రత్నాలతో అలంకరింపబడిన భవంతిలో రుద్రదేవుడు నివసిస్తాడు. వీపున అమ్ములపొది ఎడమ చేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సు ధరించి ఉంటాడు.నేత్రాలు ఎల్లప్పుడూ కోపంతో ఎర్రబడి ఉంటాయి. అతని వెన్నంటి అసంఖ్యాక రుద్రులు   వెన్నంటి ఉంటారు. భద్రకాళీతో సహా ఇతర ప్రముఖ మాతృకలు పరివేష్ఠించి ఉండగా కోట్లాది రుద్రాణులు వీరి వెన్నంటే ఉంటారు.
డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు పరివేష్టియై మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు.
(డామర్యాదిభిరావృతా)
డమరు ధ్వనులు, ప్రమధగణాలు రుద్రగణాలతో బీకర వాతావరణం కనిపిస్తూ ఉన్న ఈ రుద్రలోకానికి భూతసంఘంతో కొలువు తీరి ఉన్న భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. అతని పేరు కూడా ఈశానుడే.
ఈ విధంగా అష్ట దిక్పాలకులతో విలసిల్లుతున్న పుష్యరాగ ప్రాకారం దాటిన తరువాత కనిపించేది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా పది యోజనాల ఎత్తులో ఉండి కుంకుమకాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఈ రెండు ప్రాకారాల మధ్య ఉన్న ప్రాంతము నేల చెట్ట్లు చేమలు సమస్తమూ పద్మరాగమయమే. ఈ ప్రాకారంలో రకరకాల ఆయుధాలు ధరించి, వివిధ రత్నాలంకృతులైన చతుషష్టి కళాశక్తులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ అరవైనాలుగు శక్తులు అమ్మవారి కళాంశ రూపాలు. వీరందరికీ ఎవరి లోకం వారికి ఉంది. ఎవరి వాహనాలు వారికి ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలామాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ, అంతటినీ సర్వనాశనం చేస్తాం యుద్దం యుద్దం అంటూ నినాదలు చేస్తూ ఉంటారు. వీరి శిరోజాలు రాగి వర్ణంలో ఉండి రాగితీగల్లాగా నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఈ జగత్తులో వీళ్ళు తలుచుకుంటే చేయలేనిదేమీ ఉండదు.
(మహాచతుషష్టికోటి యోగినీగణసేవితా)
పద్మరాగప్రాకారం దాటిన తరువాత కనిపించేది పది యోజనాల ఎత్తు ఉన్న గోమేధిక రత్నమయమైన ప్రాకారం గోమేధికప్రాకారం. కొత్తగా వికసించిన జపాపుష్ప వర్ణంలో ఉంటుంది. నేల చెట్లు, తటాకాలు, ఇళ్ళు స్తంభాలు,ఇది అది అనేమిటి సర్వం గోమేధికమణులతో నిర్మించబడి కనిపిస్తాయి.
ఈ ప్రాకారంలో ముప్పై రెండు మహాశక్తులు గోమేధికమణులతో చేయబడ్డ ఆభరణాలు ధరించి, రకరకాల ఆయుధాలు చేతబూని,  నిరంతర యుద్దాసక్తులై కనిపిస్తారు. కళ్ళు కోపంతో ఎర్రబడి ఉంటాయి. పిశాచ వదనాలతో,చక్రాల వంటి చేతులతో ఎవరినో ఒకరిని చంపు నరుకు అంటూ నినాదాలు చేస్తూ వుంటారు. ప్రతి ఒక్కరి వద్ద పరాజయము ఎరగని అత్యంత బలమైన పది అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. వారు తలుచుకుంటే బ్రహ్మాండాలన్నిటిని గెలిచే శక్తిగలవారు. ఈ ప్రాకార వాసులు ఈ మహాశక్తులను ఆరాధిస్తూ ఉంటారు.
లెక్కలేనని రధాలు ఏనుగులు ఇతర వాహనాలు ఇక్కడ కనిపిస్తాయి.
దేవి యుద్దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం గోమేధిక ప్రాకారంలో నిలవ వుంటుంది.
గోమేధిక ప్రాకారం దాటితే కనిపించేది వజ్రమయప్రాకారము. ముందటి ప్రాకారాలవలె ఇక్కడ  అంతా వజ్రమయం.  ప్రాకారంలో అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల,అన్న ఎనిమిదిమంది భువనేశ్వరీదేవి పరిచారికలు లక్షలాది సేవకులు చుట్టుముట్టి కనిపిస్తారు. ఒకరిని మించి ఒకరు సౌందర్యవంతులు. రకరకాల సౌందర్య సాధనాలు చేత బట్టి ఉంటారు. వివిధ కళలలో ఆరితేరినవారు. అమ్మ కరుణాకటాక్షం ముందర ఇతరమేవీ కంటికి కనిపించవు. విద్యుల్లతల వంటి కాంతితో ప్రకాశిస్తూంటారు.
దేవి పరిసరాలలో వారు నడయాడుతున్నప్పుడు నాలుగు పక్కలా మెరుపుల కాంతి కనిపిస్తుంది.
ప్రాకారపు ప్రహరీ గోడ బయటి భాగాన ఎనిమిదిమంది సఖుల నివాస గృహాలు ఉంటాయి. ఆ గృహాలలో వివిధ ఆయుధాలు వాహనాలు నిండి ఉంటాయి.         
 🔱ఓం నమః శివాయ🔱: *శ్రీ      లలితోపాఖ్యానము*
(కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక)
దేవతలు ఆనందంతో దుందుభులు మ్రోగించి పూలవర్షం కురిపించి కర్పూరం వెలిగించి జయజయనాదాలు చేస్తారు.
 (కామ సంజీవనం) కాముడు తిరిగి జీవించటం.
భండాసురుడు మరణించిన తరువాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నిటినీ పోగొట్టుతుంది.యుద్దం వల్ల కలిగిన శ్రమ నుండి సేద తీరుస్తుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవినిదర్శించుకోవటానికి వస్తారు. సింహాసనం మీద కూర్చున్న తల్లిని స్తోత్రం చేస్తారు.
బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు,
నమో నమస్తే జగదేక నాథే నమోనమః శ్రీ త్రిపురాభిధానే
నమోనమః భండ మహాసురాఘ్నే నమోస్తు కామేశ్వరి వామకేశి
అంటూ లలితా దేవి ఘన కీర్తి,  కొనియాడుతారు.
(బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ).
ఆ శ్లాఘనలో,
"తల్లీ! భండాసురుడైతే మరణించాడు. కాని అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే వుండి మమ్మల్ని హింసలపాలు చేస్తున్నాడు.
అతనిని అంతమొందించాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి. మేమంతా అందుకోసమే ప్రయత్నాలు చేస్తూ ఉండగా మన్మధుడు దహించబడటం ఆ తరువాత ఈ సంఘటనలు చోటు చేసుకోవటం జరిగింది.” అని తల్లికిజరిగిన సంఘటనలు  వివరిస్తారు.
“రతీదేవి మన్మధుడి మరణంతో దుఃఖితురాలై రోదిస్తూ వున్నది." అని దేవతలు రతీదేవిని లలితాదేవికి చూపిస్తారు. రతీదేవి మాతకు నమస్కరిస్తుంది.
ఆ మాటలు విన్న లలితాదేవి ప్రేమ పూరిత దృక్కులతో కామేశ్వరుడి వైపు చూపు సారిస్తుంది. ఆ కనులలో నుండి మన్మధుడు పునరుజ్జీవుడౌతాడు.
(హరనేత్రాగ్ని సందగ్ధా కామసంజీవనౌషధిః)  హరుని చూపుల అగ్నిలో దహింపబడ్డ మన్మధుని జీవితుడిని చేసిన సంజీవని ఆ తల్లి. రతి మన్మధులు మాత పాదాలకు నమస్కరిస్తారు.
"రతీదేవిని అలంకరించి తీసుకురండి రతీ మన్మధుల వివాహం చేద్దాం" అని శ్యామలా దేవి చెలికత్తెలకు ఆఙ్ఞాపిస్తుంది.
ఆ దంపతులను తల్లి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది.
"మన్మధా, నీకు ఇంక ఏ భయమూ లేదు. వెళ్ళు. మరొక్కసారి నీ పూలబాణం పరమేశ్వరునిపై సంధించు.
శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహమాడుతాడు. నా ఆశీస్సులతో శివుడు నీకు ఏ విధమైన హానీ కలిగించడు. ఈ క్షణం నుండి నీవు ప్రతి ఒక్కరి శరీరం లోకి ప్రవేశించి రాగ మోహాలను ఉత్పన్నం కలుగ చేయి. నాభక్తులను కాపాడు."
తల్లి ఆశీర్వాదాలు పొందిన మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రులైన వసంతుడు మొదలైన వారిని వెంటబెట్టుకొని శివుడు తపస్సు చేస్తున్న స్థాణ్వాశ్రమానికి వెళ్ళి  తన ప్రభావం చూపిస్తాడు. శివునికి తపోభంగమైవిరహవేదనతో పార్వతికై వెతకటం మొదలెడుతాడు. ఈ లోగా మన్మధుడు తన బాణాలు పార్వతి మీద కూడా ప్రయోగిస్తాడు. పార్వతి చేస్తున్న తపస్సుతో సంతుష్టుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెనువివాహమాడుతాడు. ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవసేనకు అధిపతై తారకాసుర సంహారం చేసి ఇంద్రుని పుత్రిక అయిన దేవసేనను పెళ్ళాడుతాడు.
 మన్మధుడు తాను వచ్చిన పని నిర్విఘ్నంగా పూర్తి చేసినవాడై లలితాదేవి సేవకు శ్రీపురం చేరుకుంటాడు.
**
శ్రీ నగరం
 భండాసురుడు అంతమయిన తరువాత త్రిమూర్తులు దేవ శిల్పి అయిన విశ్వకర్మను రాక్షసుల శిల్పి అయిన మయుడిని  పిలువనంపుతారు. లలితాదేవి, శివకామేశ్వరుల నివాసయోగ్యమైన 16భవంతులు, 16 పుణ్య క్షేత్రాలలో నిర్మించమని ఆదేశిస్తారు. ఆ 16 స్థావరాలు. మేరు, నిషధ, హేమకూటము,హిమగిరి, గంధమాదన, నీల, మేష, శృంగార మహేంద్ర పర్వతాలు (9 అత్యున్నత పర్వతాలు), జలసముద్రముతో సహా, లవణ, చెరుకు, పాల,సురా, నేతి, పెరుగు సప్త సముద్రాలలో, మొత్తం 16 క్షేత్రాలలో అమ్మవారి కోసం నిర్మించిన భవంతులే శ్రీపురము. ఈ భవనాలలో అమ్మవారు పదునాలుగు రూపాలలో నివసిస్తుంది.
లలితాదేవి నివసించే భవనం దేవ శిల్పులు నిర్మించాలి, అని, ఇక మిగిలిన భవనాలు కామేశ్వరపురి, భగమాలాపురి, నిత్యక్లిన్నాపురి అనే పేర్లతో నిర్మాణం జరగాలి అని త్రిమూర్తుల ఆదేశం విన్న విశ్వకర్ముడు మయుని సహాయంతో ప్రాకారాల నిర్మాణం చేస్తాడు.
*****
బ్రహ్మలోకానికి ఊర్ధ్వ భాగాన ఉన్న సర్వలోకమే మణిద్వీపం. పరాంబిక తన ఇచ్చానుసారం మనస్సుతో సంకల్పించుకొని  ఈ లోకం నిర్మించుకున్నది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా గోలోకం కన్నా అత్యధికం. ఈ ద్వీపానికి చుట్టూ అమృత సముద్రముంటుంది. రత్నాలు దొరికే ఇసుకతిన్నెలు కనువిందు చేస్తాయి. ఆ సముద్రపు ఒడ్డున రత్నద్రుమం అనే మహా వృక్షం ఉంటుంది. దాని పై నుండి చూస్తే కనిపిస్తుంది ఒక మహాప్రాకారం.
(సుధాసాగర మధ్యస్థా)
 మేరు పర్వతం 4 శిఖరాలు కలిగి ఉంటుంది. తూర్పు వైపు ఒకటి, నైఋతిలొ ఒకటి వాయవ్యంలో ఒకటి. ఒక్కొక్కటి 100 యోజనాల పొడుగు, 100 యోజనాల వెడల్పు కలిగి త్రిమూర్తుల ఆవాసాలుగా ఉంటాయి. నాలుగవ శిఖరం మధ్యభాగంలో 400 యోజనాల పొడువు 400 యోజనాల వెడల్పులో ఉంటుంది.

షోడశ శ్రీపురాలు, పర్వతాలు
"ప్రధమం మేరుపృష్ఠే చ నిషధే చ మహీధరే
హేమకూటే హిమగిరౌ పంచమం గంధమాదనే
నీలమేషే చ శృంగాఖ్యే మహేంద్రే చ మహాగిరౌ
(సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయికా)
సముద్రాలు
లవణాబ్ధీక్షుసారాబ్ధి ధృత సాగరాః దధి సింధుర్జలసింధుశ్చ సప్తమః
మధ్యనున్న శిఖరంలో ఉన్నదే శ్రీపురం. 7 నలుచదరపు లోహపు గోడలతో, నిర్మించబడి ఉంటుంది.(ఈ గోడలే ప్రాకారాలు కోటలు అని కూడా అనబడుతాయి.)
ఒక్కొక్క ప్రాకారం మధ్య 7 యోజనాల దూరం ఉంటుంది.
మొదటిది అయోధాతు నిర్మితం. ఇనుముతో ధాతు శిలలతో దృఢంగా నిర్మించబడ్డ  ప్రాకారం. 16 వేల యోజనాల చుట్టుకొలత కలిగి రకరకాల అస్త్రశస్త్రాలు ధరించిన రక్షకభటులు ఆ ప్రాకారం మీద కావలి తిరుగుతూ ఉంటారు. ఆ మహా ప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలుంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతలు వారి వెంట వచ్చే గణాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటారు. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళ్ళితే అడుగడుగునా సరస్సులూ రత్నద్రుమవాటికలు కనిపిస్తాయి.
ఆ సుందర వనాలు దాటి వెళ్ళితే కనిపించేది రెండవ ప్రాకారం, కాంస్య ప్రాకారము. ఇది ఇనుప కోటకన్నా నూరు రెట్లు కాంతి కలిగి ఉంటుంది. వీటి రెంటి మధ్యనున్న భాగం రత్న వృక్షాలతో అందమైన వనాలతో నిండి కనుల పండుగగా ఉంటుంది. కోకిలారవాలు, భ్రమర నాదాలు మారుమోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. నెమళుల క్రేంకారాలు. కనులకు చెవులకు విందు చేస్తూ ఉంటాయి.
కాలచక్రము అనే సింహాసనము అధిరోహించిన మహాకాళి మాహాకాలుడు అక్కడి రక్షకులు.
మూడవది తామ్ర ప్రాకారం (రాగి కోట). చతురస్రాకారంలో ఉండి  కాంస్య ప్రాకారం లాగానే సప్త యోజనాల ఎత్తు. ఈ రెండు ప్రాకారలకు నడుమ కల్పవృక్షాల వనంతో నిండి ఉంటుంది. కనుక దీనిని కల్పవాటిక అని కూడా అంటారు. పండ్లలోని బీజములు కూడా రత్నాలే. వాటి సువాసనలు చాలా దూరము దాకా వ్యాపించి ఉటాయి. ఇది రెండవ ప్రాకారం. మధుశ్రీ, మాధవశ్రీ భార్యలగా ఉన్న వసంతుడు తామ్ర కుడ్యానికి రక్షకుడుగా ఉంటాడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని, పుష్ప కిరీటం ధరించి, పుష్పచత్రంతో పుష్పభూషితుడుగా చిరునవ్వులు చిందిస్తూ భార్యలతో పూలబంతులతో ఆడుకుంటూ ఉంటాడు. వారి గంధర్వ గానం చెవులకింపుగా ఉంటుంది.
ఆ సుందరవనంలో దేవతలూ గంధర్వులూ జంటలుజంటలుగా విహరిస్తూ ఉంటారు.
తామ్రసాల దాటిన తరువాత కనిపించేది నాలుగవదైన సీసనిర్మిత ప్రాకారము. ఈ సీసముతో నిర్మించిన ఏడు యోజనాల ఎత్తు. తామ్రప్రాకారం, సీస ప్రాకారానికి మధ్య ఉన్న ప్రాంతం మొత్తం సంతాన వృక్షాలతో నిండి సంతానవాటిక అనబడుతుంది. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. చెట్ల మొదళ్ళోఅమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానకవృక్షాల కింద సేదతీరుతూంటాయి. దేవతలు సిద్దులూ విలాసినీ మణులతో వనంలో విశ్రమిస్తూ ఉంటారు. శుక్రశ్రీ శుచిశ్రీ భార్యలుగా ఉన్న గ్రీష్ముడు తోటమాలి.
ఇత్తడితో చేయబడ్డ ఈ నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తు కలిగి, రెండు ప్రాకారాల నడుమ హరిచందన వృక్షవాటిక వర్షరుతువు వనపాలకుడుగా ఉంటుంది. మెరుపులు కన్నులుగా పింగల వర్ణంలో తళతళలాడుతూ, మేఘాలు కవచంగా ధరించి , ఉరుము వంటి కఠద్వనితో, నిరంతరం వర్షపుజల్లులతో, నభశ్రీ నభ్యశ్రీ మొదలుకొని పన్నెండు మంది  భార్యలతో కూడి ఉంటాడు. ఆ ప్రాంతంలో దేవతలూ, సిద్దులూ దేవీ పూజాతత్పరులు ఈ వనాలలో పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. నదీ నదములు ఎక్కువగా ఉంటాయి. పచ్చటి లతలతో కళకళ్ళాడుతూ ఉంటుంది.
సీసప్రాకారం దాటిన తరువాత ఆరవదైన పంచలోహప్రాకారము కనిపిస్తుంది. ఈ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఈ రెండు ప్రాకారల మధ్య మందారతరువాటిక ఉంటుంది. ఈషశ్రీ, ఊర్జశ్రీ (ఇష్టలక్ష్మి,ఊర్జలక్ష్మి) అన్నభార్యలతో శరదృతువు రక్షకుడుగా వనమాలిగా ఉంటాడు.
తరువాత ఏడవ ప్రాకారము రజత నిర్మిత ప్రాకారము.(వెండి కోట). సహశ్రీ, సహస్యశ్రీ అన్న భార్యలతో హేమంతఋతువు ఆ కోటకు రాజు. ఆ ప్రాంతమంతా పారిజాతవనాలతో నిండి ఉండి ఆ పూల వాసన పది యోజనాల వరకు వ్యాపించి ఉంటుంది.
వెండి ప్రాకారం దాటితే ఎనిమిదవ ప్రాకారము కనిపిస్తుంది సౌవర్ణప్రాకారము (బంగారపు కోట). ఏడు యోజనాల ఎత్తు ఉన్న ఈ ప్రాకారం బంగారంతో కట్టబడి ఉండి మధ్యలో కదంబ వృక్షంతో అలరిస్తూ ఉంటుంది.
(కదంబవనవాసినీ)
నిరంతరం పూలతో పండ్లతో నిండి ఉండి నాలుగు పక్కల నుండి తేనెధారలు కారుతూ ఉంటాయి. దేవి భక్తులు ఆ మకరందాన్ని త్రాగి ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. శిశిరఋతువు ఆ ప్రాకారపు అధినేత. తపశ్రీ,తపస్యశ్రీ అనే భార్యలతో శిశిఋడు ఆనంద సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
తొమ్మిదవదైన పుష్పరాగ ప్రాకారం సౌవర్ణ ప్రాకారము దాటిన తరువాత కనిపిస్తుంది. కుంకుమ వంటి అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల కోనేరులతో సహా వనాలు ఉపవనాలు వృక్షాలు ఎగిరే పక్షులు. కదిలే జంతువులు, పారే నీళ్ళు మండపాలు మండప స్తంభాలు అన్ని పుష్యరాగమయాలే. సౌవర్ణసాల కన్నా తేజస్సులో లక్షరెట్లు అధికం.

ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు.
తూర్పు దిక్కున ఉన్న భవంతిలో అమరావతి ఉంటుంది. ఇక్కడ మహేంద్రుడు ఐరావతం అధిరోహించి వజ్రాయుధం చేతబూని, శచీదేవితో సహా కొలువై ఉంటాడు. స్వర్గలోకంలో కన్నా ఇకడ భోగం వేయిరెట్లు.
ఆగ్నేయమూలన ఉన్నది వహ్నిపట్టణం. ఆ పట్టణంలో తన ఇద్దరు భార్యలైన స్వాహా స్వధాలతో కూడి కొలువై ఉంటాడు.
దక్షిణ దిక్కున ఉన్నది యమపురి. యమధర్మరాజు దండధారి అయి చిత్రగుప్తుడితో యమభటులు వాహనమైన మహిషం ఇక్కడ దర్శనమిస్తాయి.
నైఋతి కోణం రాక్షస స్థావరం. నిరృతి గొడ్డలి చేతబూని భార్యా సమేతంగా ఇతర రాక్షసులతో కొలువుతీరి ఉంటాడు.
పశ్చిమ దిక్కున వరుణుడి రాజ్యం. భార్య వారుణితో వాహనమైన ఝష (పెద్ద చేప)వాహనం అధిరోహించి పాశం చేతబూని వారుణీ మధువు త్రాగుతూ మత్తులో ఉంటాడు. జలచరాలు చుట్టు నడయాడుతుండగా విహరిస్తూ ఉంటాడు.
వాయవ్య మూలనున్నది వాయులోకం. ప్రాణాయామ సంసిద్ధులైన యోగి సమూహం ఇతడి పరివారము. ద్వజము చేతబూని మృగవాహనుడై, నలభై తొమ్మిది మంది మరుద్గణాలు వెంటరాగా విహరిస్తూ ఉంటాడు.
ఉత్తర దిక్కున ఉన్నది యక్షలోకం. యక్షరాజు కుబేరుడు వృద్ధి ఋద్ది శక్తులతో నవనిధులకు అధిపతై మణిభద్రాది యక్ష సేనానులు పరివేష్టులై ఉండగా ఈ కోటలో నివసిస్తూ ఉంటాడు.
ఈశాన కోణంలో ఉన్నది రుద్రలోకం అనేక రత్నాలతో అలంకరింపబడిన భవంతిలో రుద్రదేవుడు నివసిస్తాడు. వీపున అమ్ములపొది ఎడమ చేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సు ధరించి ఉంటాడు.నేత్రాలు ఎల్లప్పుడూ కోపంతో ఎర్రబడి ఉంటాయి. అతని వెన్నంటి అసంఖ్యాక రుద్రులు   వెన్నంటి ఉంటారు. భద్రకాళీతో సహా ఇతర ప్రముఖ మాతృకలు పరివేష్ఠించి ఉండగా కోట్లాది రుద్రాణులు వీరి వెన్నంటే ఉంటారు.
డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు పరివేష్టియై మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు.
(డామర్యాదిభిరావృతా)
డమరు ధ్వనులు, ప్రమధగణాలు రుద్రగణాలతో బీకర వాతావరణం కనిపిస్తూ ఉన్న ఈ రుద్రలోకానికి భూతసంఘంతో కొలువు తీరి ఉన్న భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. అతని పేరు కూడా ఈశానుడే.
ఈ విధంగా అష్ట దిక్పాలకులతో విలసిల్లుతున్న పుష్యరాగ ప్రాకారం దాటిన తరువాత కనిపించేది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా పది యోజనాల ఎత్తులో ఉండి కుంకుమకాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఈ రెండు ప్రాకారాల మధ్య ఉన్న ప్రాంతము నేల చెట్ట్లు చేమలు సమస్తమూ పద్మరాగమయమే. ఈ ప్రాకారంలో రకరకాల ఆయుధాలు ధరించి, వివిధ రత్నాలంకృతులైన చతుషష్టి కళాశక్తులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ అరవైనాలుగు శక్తులు అమ్మవారి కళాంశ రూపాలు. వీరందరికీ ఎవరి లోకం వారికి ఉంది. ఎవరి వాహనాలు వారికి ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలామాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ, అంతటినీ సర్వనాశనం చేస్తాం యుద్దం యుద్దం అంటూ నినాదలు చేస్తూ ఉంటారు. వీరి శిరోజాలు రాగి వర్ణంలో ఉండి రాగితీగల్లాగా నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఈ జగత్తులో వీళ్ళు తలుచుకుంటే చేయలేనిదేమీ ఉండదు.
(మహాచతుషష్టికోటి యోగినీగణసేవితా)
పద్మరాగప్రాకారం దాటిన తరువాత కనిపించేది పది యోజనాల ఎత్తు ఉన్న గోమేధిక రత్నమయమైన ప్రాకారం గోమేధికప్రాకారం. కొత్తగా వికసించిన జపాపుష్ప వర్ణంలో ఉంటుంది. నేల చెట్లు, తటాకాలు, ఇళ్ళు స్తంభాలు,ఇది అది అనేమిటి సర్వం గోమేధికమణులతో నిర్మించబడి కనిపిస్తాయి.
ఈ ప్రాకారంలో ముప్పై రెండు మహాశక్తులు గోమేధికమణులతో చేయబడ్డ ఆభరణాలు ధరించి, రకరకాల ఆయుధాలు చేతబూని,  నిరంతర యుద్దాసక్తులై కనిపిస్తారు. కళ్ళు కోపంతో ఎర్రబడి ఉంటాయి. పిశాచ వదనాలతో,చక్రాల వంటి చేతులతో ఎవరినో ఒకరిని చంపు నరుకు అంటూ నినాదాలు చేస్తూ వుంటారు. ప్రతి ఒక్కరి వద్ద పరాజయము ఎరగని అత్యంత బలమైన పది అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. వారు తలుచుకుంటే బ్రహ్మాండాలన్నిటిని గెలిచే శక్తిగలవారు. ఈ ప్రాకార వాసులు ఈ మహాశక్తులను ఆరాధిస్తూ ఉంటారు.
లెక్కలేనని రధాలు ఏనుగులు ఇతర వాహనాలు ఇక్కడ కనిపిస్తాయి.
దేవి యుద్దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం గోమేధిక ప్రాకారంలో నిలవ వుంటుంది.
గోమేధిక ప్రాకారం దాటితే కనిపించేది వజ్రమయప్రాకారము. ముందటి ప్రాకారాలవలె ఇక్కడ  అంతా వజ్రమయం.  ప్రాకారంలో అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల,అన్న ఎనిమిదిమంది భువనేశ్వరీదేవి పరిచారికలు లక్షలాది సేవకులు చుట్టుముట్టి కనిపిస్తారు. ఒకరిని మించి ఒకరు సౌందర్యవంతులు. రకరకాల సౌందర్య సాధనాలు చేత బట్టి ఉంటారు. వివిధ కళలలో ఆరితేరినవారు. అమ్మ కరుణాకటాక్షం ముందర ఇతరమేవీ కంటికి కనిపించవు. విద్యుల్లతల వంటి కాంతితో ప్రకాశిస్తూంటారు.
దేవి పరిసరాలలో వారు నడయాడుతున్నప్పుడు నాలుగు పక్కలా మెరుపుల కాంతి కనిపిస్తుంది.
ప్రాకారపు ప్రహరీ గోడ బయటి భాగాన ఎనిమిదిమంది సఖుల నివాస గృహాలు ఉంటాయి. ఆ గృహాలలో వివిధ ఆయుధాలు వాహనాలు నిండి ఉంటాయి.            
 *నాలుగు గోడల మధ్య సంసారమైనా*
*నలుగురు మధ్యన జరిగే* *సంభాషణలైనా*
*అవగాహనతో* *అర్ధంచేసుకొని*
*మర్యాదలు* *ఇచ్చిపుచ్చుకొని*
*అపార్ధాలు చెరిపివేసుకొని*
*ఆనందాలు పంచుకుంటే* 
*ఆలుమగల అన్యోన్య* *దాంపత్యానికి*
*ఇదే నిదర్శనం కాదా* *మరి పెళ్లి*
🟢🟢🟢🟢🟢🟢🟢
అందం దేహానికి ఒక ఆభరణం మాత్రమే
మాటతీరు నీకు మరో ఆయుధం
ఆలోచనాశక్తి నిన్ను మరో మెట్టుకు 
తీసుకెళ్లే సాధనం
ఆచరణ నిన్ను ఉన్నతస్థితిలో 
కూర్చోబెట్టే పాశుపతాస్త్రం
🔶🔶🔶🔶🔶🔶🔶
వినడంలో ఉన్న శ్రద్ధ
శోధించడంలో ఉన్న పట్టుదల
విశధీకరించడంలో ఉన్న నైపుణ్యం
సంధిచడంలో ఉన్న తాత్పర్యం
ప్రేమించడంలో ఉన్న గాఢత్వం
బంధించబడడంలో ఉన్న ఆంతర్యం
అన్ని కలగలిపిన పాఠమే జీవితమంటే
💠💠💠💠💠💠💠
విలువలు తెలియని వాళ్ళ ముందు
నీ కన్నీటిని చూపించకు
నీ బాధే నీకు పరిష్కారాన్ని 
చూపిస్తుంది
నీ గుండెకోతే నీకు కొండంత
ధైర్యాన్ని ఇస్తుంది.
🔴🔴🔴🔴🔴🔴🔴
నీ సంతోషాన్ని చెబితే 
నీకు కావాల్సిన వాళ్ళు
ఆనందపడతారు, 
నిన్ను చూసి అసూయపడేవాళ్ళు
ఆనందపడినట్లు నటిస్తారు.

🫐🫐🫐🫐🫐🫐🫐
అలుపెరగని ప్రయాణంలో
ఎన్నో సమస్యలు 
ఒకటి పరిష్కరిస్తే
మరెన్నో దారిలో 
నీ ముందుకు వస్తాయి
🌊🌊🌊🌊🌊🌊🌊. 
 🔱ఓం నమః శివాయ🔱:                                *శ్రీ లలితో పాఖ్యానము*
లలితాదేవి తన పరిసరాలలో ఉన్న సైన్యాన్ని గమనిస్తూ ఉన్న అవకాశం చూసుకొని విషంగుడు హఠాత్తుగా రధం వెనక  వైపు నుండి విపాటవం అన్న ఆయుధంతో దాడి చేస్తాడు. అక్కడే ఉన్న అణిమాదేవితో సహా ఇతర దేవతలు ఒక్క క్షణం అవాక్కయి మరుక్షణమే తేరుకొని తిరుగుదాడికి సిద్దమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుండి దాడి చేయ ఉపక్రమిస్తాడు.
రెండు పక్కల నుండి జరుగుతున్న దాడిని చూసిన లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈ లోగా విషంగుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది.
 అది చూసిన కామేశ్వరి మొదలైన దేవతలు కోపించిన వారై మాతను సమీపించి, వహ్నివాసిని జ్వాలామాలిని అన్న నిత్యదేవతలకు స్వయం ప్రాకాశన శక్తి కలదని, వారే కనుక తమ ప్రకాశం ప్రదర్శిస్తే అంధకారంలో ఉన్న రాక్షసులు వెలుగులోకి వస్తారని విన్నవించుకుంటారు. లలితాదేవి అనుమతితో వహ్నివాసిని జ్వాలామాలిని అగ్ని గుండాల వలె  ప్రకాశించ సాగారు.
చీకటి మాటున దాక్కొని యుద్దం చేస్తున్న రాక్షసులందరు ఆ ప్రకాశం ఫలితంగా వెలుగులోకి వస్తారు. లలితాదేవి యొక్క షోడశ నిత్యాదేవతలు వారిని హతమార్చి వేస్తారు. మిగిలిన సేనాధిపతులందరు మరణించటంతో విషంగుడు శరీరమంతా గాయాలతో నిర్లజ్జగా రణరంగం నుండి పారిపోతాడు.
***
విషంగుడు రణరంగం నుండి వెనుతిరగటం చూసిన కుటిలాక్షుడు కూడా పారిపోతాడు.  నిత్యాదేవతల పరాక్రమం చూసిన లలితాదేవి ఆనందం పొందుతుంది. (నిత్యాపరాక్రమతోప నిరీక్షణ సమత్సుక)
అనుకోకుండా రాత్రి సమయంలో జరిగిన దాడి చూసిన మంత్రిణీ దేవి, దండనాథ దేవి దుఃఖితులౌతారు. అంత పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసినా అసురుల దాడి నుండి తట్టుకోలేక  విఫలమయిపోయిందని బాధ పడతారు.
(అగ్ని ప్రాకారము)
ఇరువురు కలిసి లలితాదేవి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనకు తమ బాధ వ్యక్తపరిచి, కోట రక్షణకై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు.
లలితాదేవి, జ్వాలామాలిని దేవిని,"ఓ వత్సా, నీవు అగ్నిస్వరూపవు. జ్వాలామాలలే నీ ఆకారము. కనుక సైన్యం చుట్టూతా 100 యోజనాల వెడల్పు, 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రాకారం నిర్మాణము చేయి." అన్న ఆఙ్ఞతో జ్వాలామాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది.
(ఒక యోజనము షుమారుగా 8 మైళ్ళు).
 దేవి సైన్యం రాకపోకలకు వీలుగా శూన్యపురానికి అభిముఖంగా గోడకు దక్షిణ కొస వద్ద ఒక యోజనం భాగం వాకిలి ఏర్పాటు చేస్తుంది.(జ్వాలామాలనికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా).
దండనాథ దేవి కూటమిలో ఒకరైన స్థంభినీదేవి 20 అక్షౌహిణి సేనతో వాకిలి వద్ద కావలి ఉంటుంది. శత్రువుల కోట ఆక్రమణకు విఘ్నకారిణి అయినందున ఆమెను విఘ్నదేవి అని కూడా అంటారు.
ఏర్పాట్లన్ని పూర్తయ్యే సరికి సాయం సమయం అవుతుంది.
ఈ సమాచారం తెలిసిన భండాసురుడికి భయం ఆవరించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. ఈ మారు చతుర్బాహు మొదలుకొని ఉపమాయుడి వరకు తనకున్న 30 మంది కొడుకులను యుద్దరంగంలో దింపుతాడు. "కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ లేరు. మాయావి యైన ఒక స్త్రీ మనవారినందరినీ సంహరిస్తోంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి." అని ఆదేశిస్తాడు.
యుద్దరంగంలో దేవికి కుడి ఎడమలలో శ్యామలా దండనాయికలు, ముందు వెనుక  సంపత్కరీ అశ్వారూఢలు సైన్యసమేతులై వ్యూహాలు పన్ని రక్షణగా ఉన్న సమయంలో భండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనక నుండి ముట్టడి చేస్తారు.
ఆ సమయంలో ముమ్మూర్తులా తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలో ఉంటుంది. ఆమె నిత్య బాలాస్వరూపిణి. భండాసురుని కొడుకులు యుద్ద రంగంలోకి ప్రవేశించిన వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచినా, కుమార్తె శౌర్యం ఆత్మశక్తి తెలుసుకొని భండపుత్రులను ఎదుర్కోవటానికి అనుమతించి కవచాన్ని బహుమతిగా ఇస్తుంది.
నూరు హంసలచే లాగబడుతున్న కర్ణీ అన్న రధం ఎక్కి బాలాదేవి యుద్దరంగంలోకి ప్రవేశించటం చూసిన మంత్రిణీ దండనాయకలు ఆశ్చర్యచకితులౌతారు. కాని వెను వెంటనే కర్తవ్యం తెలుసుకొని ఆమెకు సంరక్షణకు అంగరక్షకులుగా నిలబడతారు.
బాలాదేవి భండాసురుడి 30 మంది కొడుకులతో చేస్తున్న భీకరమైన పోరాటం చూసిన వారంతా విస్తుపోతారు. యుద్ధం రెండవరోజు పూర్తిగా బాలాదేవి పోరాటం కొనసాగించి ఆ సాయం సమయంలో ఒకేసారి 30 బాణాలు ప్రయోగించి 30 మంది భండాసుర పుత్రులను ఒక్కసారిగా హతమారుస్తుంది.
ఆ దృశ్యం చూసిన లలితా దేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది.
(భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా).
****
విఘ్నయంత్ర నాశనం.
భండాసురుడు దుఃఖాక్రాంతుడౌతాడు.
"ఆ దుష్టురాలిని నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతాను." అని నిస్సహాయుడై స్వయంగా యుద్దరంగానికి తరలి వెళ్తాడు.

అతనిని సముదాయించిన విషంగుడు విశుక్రుడు తాము స్వయంగ శత్రువులను ఎదుర్కోవటానికి ఉద్యుక్తులౌతారు.
భండాసురుడు ముందుగా విషుక్రుడిని  పోరుకు పంపిస్తాడు.
"విశుక్రా, శత్రువుల స్థావరమ్లొకి ప్రవేశించి జయవిఘ్నం అన్న యంత్రాన్ని స్థాపించు." అని ఆజ్ఞాపిస్తాడు.
రాత్రి అంధకారంలో విషుక్రుడు చుట్టూ కట్టబడ్డ వహ్నిప్రాకారం సమీపిస్తాడు. లోపలికి వెళ్ళటానికి మార్గం కనిపించక  ప్రాకారానికి బయటే ఉండి శిలవట్టం అనే యంత్రాన్ని రచించి, బలిపూజలు చేసి, ఆ యంత్రం పై నుండి ప్రాకారం లోపలికి దూకుతాడు. ఒక చదునైన రాతి మీద ఒక తాంత్రిక గుర్తు రచించి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరం మంత్రించిన శిలవట్టం అన్న రాతిని బలమంతా ఉపయోగించి విసిరేస్తాడు.
అగ్నిప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. వహ్నిప్రాకారంలో జయవిఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. ఆ మాయా యంత్ర ప్రభావం వల్ల శక్తిసేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవటం మొదలెడుతారు.
ఈ యుద్దం చేయటమే తప్పు.
దేవతల పక్షాన యుద్దం చేయవలసిన అవసరం మనకు ఏముంది?
అసలు ఈ లలితాదేవి ఎవరు? మనమీద పెత్తనం  చెలాయించటానికి ఆమెకు ఎవరు అధికారం ఇచ్చారు?
మనమందరమూ యుద్దం చేయటానికి నిరాకరిస్తే ఆమె ఏమి చేయగలుగుతుంది?
అఙ్ఞానపు నిద్ర ఆవహించిన వారు ఈ విధంగా తమలో తామే వాదించుకోసాగారు.
విశుక్రుడు అర్ధరాత్రి దాటిన తరువాత తన 30 అక్షౌహిణుల సైన్యంతో వహ్నిప్రాకారం ఆక్రమించుకుంటాడు. అప్పటికి కూడా శక్తిసేన విఘ్నయంత్రం కలిగించిన మాయనిద్ర నుండి లేవలేక పోతారు.
అంత జరిగినప్పటికి యంత్ర ప్రభావం దండనాథ మీద కాని మంత్రిణీదేవి మీదగాని పడదు. ప్రమత్తులై ఉన్న వారిరువురు శక్తిసేనకు పట్టిన  దుస్థితి చూసి బాధపడతారు. ఏమి చేయాలో పాలుపోక తమ కర్తవ్యం ఏమిటని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులో నుండి గణపతి ఉద్భవిస్తాడు.
(కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా).
దేవి ఆదేశం ఇచ్చిన వెనువెంటనే గణపతి అగ్నిప్రాకారంలో వెతుకగా శక్తిసేనకు పట్టిన దుస్థితికి కారణమైన   జయవిఘ్న మహా యంత్రం కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి ఛిన్నాభిన్నం చేస్తాడు.
 (మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత).
గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త అని ఆరుగురు విఘ్నకర్తలను సృష్టిస్తాడు.
వారు ఏడు కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసుల పైకి దాడి చేస్తారు.  విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను ఆవహించిన మాయ నిద్ర నుండి బయటబడి తిరిగి యుద్దానికి సన్నత్తులౌతారు. శక్తిసేన సహితుడై విఘ్నేశ్వరుడు వహ్నిప్రాకారం నుండి వెలుపలకు వచ్చి విషుక్రుడితో పోరు ఆరంభిస్తాడు.
ముందుగా గణపతి మీదకు  పంపించిన గజాసురుడు అంతం అవటం చూసిన విషుక్రుడు రణరంగం నుండి పారిపోతాడు.
*
విశుక్ర విషంగ వధ
గజాసురుడు మరణించిన వార్త విన్న భండాసురిడితో చర్చలనంతరం తమ్ముడైన విషంగుడు, మేనల్లుడు ఉలూకుడూ వెంటరాగా విశుక్రుడు తిరిగి యుద్ద రంగానికి చేరుకుంటాడు. దీనితో మూడవరోజు యుద్దం ఆరంభమవుతుంది. మరో పక్క దండనాథ, మంత్రిణి శత్రువులపై తమ పోరు కొనసాగిస్తారు. చేతబూనిన హలాయుధాన్ని భీకరంగా తిప్పుతూ  కిరిచక్ర రధం అధిరోహించిన దండనాథదేవి ముందుగా దారి తీయగా,  విల్లంబులు ధరించిన మంత్రిణీదేవి గేయచక్ర రథం ఆరోహించి ఒక యోధుడి వలె వెనకనే అనుసరిస్తుంది.
దండనాథదేవి విశుక్రుడిని ఎదుర్కొనగా, అశ్వారూఢ, సంపత్కరీ దేవతలు వారి అల్లుళ్ళను ఎదుర్కొంటారు. రాక్షస సేన బలహీనమవటం గమనించిన విశుక్రుడు తృషాస్త్రం అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడ సాగింది. ఇంద్రియాలన్నిశక్తిని కోల్పోయాయి. అస్త్రాలను విడిచి పెట్టి మూర్ఛ పోతారు.
దండనాథ వారాహిని పిలిచి, "దేవీ ఇది రాక్షస మాయ. వారు ప్రయోగించిన తృషాస్త్ర ప్రభావం. మన సైన్యానికి దాహం తీరే మార్గం ఆలోచించాలి." అనగానే దానికి ప్రతిచర్యగా తృష్ణ బాధితులకు ఉపశమనం కొరకు దండనాథదేవి కీరిచక్ర రధం నుండి మదిరా సింధువును  ఆహ్వానిస్తుంది. మద్య సముద్రదేవత ఏనుగు తొండపు ధారలతో కురిపించిన మద్య వర్షంతో శక్తిసేన తమ దాహం తీర్చుకొని రెట్టింపైన ఉత్సాహంతో యుద్దం కొనసాగిస్తారు.సముద్రుడు చేసిన సహాయానికి సంతో షించిన దేవి, "సముద్రుడా దేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. నా అనుగ్రహం వలన ద్వాపర యుగంలో యజ్ఞం చేసే వారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగ పడతావు. మంత్ర యుక్తంగా నిన్ను స్ఇకరించతంతో జనులు సిద్ధిని, బుద్ధిని బలాన్ని పొందుతారు." అని వరాన్ని ఇస్తుంది.
సాయం సమయానికి శత్రు సైన్యంలో భండాసురుని అల్లుళ్ళతో సహా చాలా భాగం మరణిస్తారు. ఈ లోగా శ్యామలాదేవి (మంత్రిణి) విషంగుడితో పోరాడి, బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుడిని సంహరిస్తుంది.దండనాథాదేవి (పోత్రిణి) విశుక్రుడిని హలాయుధంతో సంహరిస్తుంది. (మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత)

ఆ పాటికి అర్ధరాత్రయింది. భండాసురుడిని ఓదార్చటానికి ఇంక మిగిలింది కుటిలాక్షుడు మాత్రమే.
"కుటిలాక్షా లలితాదేవి తన చూపుతోనే నా సోదరులను సంహరించింది. ఆమె కంఠం నుండి రతం ప్రవహిచేలాగా చేసి నా సోదరులకు శాంతి కలిగేలా చేస్తాను." అని ఆవేశంతో కుటిలాక్షుడి సమేతంగా భండాసురుడు యుద్దరంగంలోకి ప్రవేశిస్తాడు. అతని వెనక  2185 అక్షౌహిణుల సైన్యం 40 మంది సేనాపతులు ఉంటారు.
అతను ఆభిలము (భీకరమైన) అనే రథం ఆ‘రోహిస్తాడు.
అతను ఘాతకం (నరకంలో హింస) అన్న కత్తి చేపూనుతాడు.
రణరంగంలో ప్రవేశించిన భండాసురుడు వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చేస్తాడు.
ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్దరంగానికి బయలుదేరుతుంది. ఆమె వెనక గేయచక్ర రథంలో మంత్రిణీ దేవి, కిరిచక్ర రథంలో పోత్రిణి దేవి అనుసరిస్తుంటారు. ఆ వెనుక 
కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు. ఆ దేవతలు శస్త్రాలు (మంత్రపూరితమైన ఆయుధాలు) ప్రత్యస్త్రాలు (శత్రువులు ప్రయోగిస్తున్న ఆయుధాలను ఎదుర్కొనే ఆయుధాలు) ప్రయోగించటంలో ఒకరి కన్నా ఒకరు ఏ మాత్రమూ తీసిపోరు.
( భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి)
భండాసురుడు ప్రయోగించిన మంత్ర తంత్ర ఆయుధాలలో అంధతామిస్రం అన్న అస్త్రం లలితాదేవి గాయత్రి అస్త్రం అంతకాస్త్రమును మృత్యుంజయాస్త్రంతో,  సర్వాస్త్ర స్మృతిని ధారణ అస్త్రం తో ఎదుర్కుంటుంది. ఈ విధంగా ఇరువురూ అనేక శస్త్రప్రత్యస్త్రాలు ప్రయోగిస్తూ భీకర పోరాటం చేస్తూంటారు.
శక్తిసేనను ఆయుష్షును తగ్గించటానికి ప్రయోగించిన ఆయుః అన్న అస్త్రం ఎదుర్కోవటానికి లలితాదేవి ధనుస్సు నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయల్దేరి వారి హూంకారంతో భండాసురుడికి అస్త్ర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి తిరిగి వెళ్ళిపోతారు.
మహాసురాస్త్రం నుండి పుట్టుకొచ్చిన మధుకైటభులను మహిషాసురుడిని రక్తబీజుడిని మరి ఇతర అసురులను పునర్జీవితుల చేస్తాడు. లలితా దేవి పెద్దగా వికటాట్టహాసం చేస్తుంది. అట్టహాసం నుండి  చండీ సప్తశతిలోని ఇతర దేవతలతో సహా దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది.
ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్ని శక్తిని, వాయువు ధనుస్సును, కుబేరుడు పానపాత్రను, యముడు కాలదండాన్ని, పాశాన్ని ఇస్తారు. ఆమె సింహాసనారూఢురాలై మహిషాసురాది రాక్షసులను సంహరిస్తుంది.
పిదప భండాసురుడు సోమకుడుని మరి కొంతమంది రాక్షసులని పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్ళ గోళ్ళ నుండి విష్ణు యొక్క పది రూపాలను ఆవిర్భింప చేస్తుంది.
(కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః)
నారాయణుడి దశావతారాలు ఆయా రూపాలలో  వధించిన రాక్షసులనందరినీ భండాసురుడు సృష్టించటం ఆరంభిస్తాడు. లలితాదేవి. రెండు చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు.
భండాసురుడి అర్ణవాస్త్ర ప్రభావం వలన నీటిలో మునిగిన శక్తి సేనను కుడిచేతి చూపుడు వేలి నుండి ఉద్భవించిన కూర్మరూపము నీటినంతటిని త్రాగి శక్తిసేనను రక్షిస్తాడు. హైరణ్యాక్షాస్త్రము నుండి వేలకొలదిగా జన్మించిన హిరణ్యాక్షులను దేవి కుడిచేతి నడిమి వేలి నుండి పుట్టిన వరాహ రూపి సంహరిస్తుంది.
కనుబొమల నుండి జన్మించిన హిరణ్యులు ప్రహ్లాదుణ్ణి పీడిస్తుండగా, దేవి కుడి చేతి ఉంగరపు వేలి నుండి సృష్టింప బడ్డ నరసింహుడు వారిని తన వాడిఐన గోళ్ళతో చీల్చి చంపుతాడు.
బలీంద్రాస్త్రాన్ని వామనాస్త్ర్ం నుండి వచ్చిన వామనులు బలీంద్రులను బంధిస్తారు.
హైహయాస్త్రం నుండి పుట్టిన కార్తవీర్యులను లలితాదేవి ఎడమచేతి నుండి పుట్టిన పరశురాములు సంహరిస్తారు.
భండాసురుడు ఆగ్రహంతో చేసిన హూంకారము నుండి పుట్టుకొచ్చిన చంద్రహాసఖడ్గము నుండి కుంభకర్ణుడు, మేఘనాధుడు వెంటరాగా పుట్టుకొచ్చిన రావణాసురుడిని లలితాదేవి ఎడమచేతి చూపుడు వేలి నుండి రామలక్ష్మణులు సంహరిస్తారు.
భండసురుడు సృష్టించిన  ద్వివిదాస్త్రుడు అనేక మైన కోతులను పుట్టించగా తల్లి ఎడమచేతి నడిమి వేలి నుండి ఉద్భవించిన బలరాముడు ఆ కోతులను సంహరిస్తాడు.
రాజాసురాస్త్రము నుండి పుట్టిన శిశుపాల దంతవక్త్ర శాల్వులను లలితాదేవి ఎడమచేతి ఉంగరం వేలి గోటి నుండి ఉద్భవించిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు సంహరిస్తారు.
కల్వస్త్రము నుండి పుట్టిన రాజులను లలితాదేవి చిటికిన వేలు నుండి ఆవిర్భవించిన జనార్దనుడు హతమారుస్తాడు.
ఆ పాటికి సూర్యాస్తమ సమయం అవుబోతున్నది. ఇంక లలితాదేవి ఏ మాత్రమూ ఉపేక్షించ దలచుకోలేదు. నారాయణాస్త్రము ఇరవై నాలుగురు సేనా నయకులను సంహరిస్తుంది.  రాక్షసులను, వారి సేనాధిపతులను హతమారుస్తుంది.
(మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైన్యక).
ఇంక చివరకు మిగిలింది భండాసురుడు మాత్రమే. లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి భండాసురుడిని సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యక పట్టణం దహించుకు పోయి బూడిద కుప్పగా మారిపోతుంది.                                  
 *"మీరు చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తారు...🙏 నమస్కారమంటే ఏమిటి?"*

*ఐదు కర్మేంద్రియాలు,  ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించమే  నిజమైన నమస్కారం..!*

 *' న  మ ' అనగా  'నాది కాదు' అని అర్థం..!*

*అంటే సర్వమూ భగవంతునిదే అన్న నిరంహకార భావానికి చిహ్నం నమస్కారం.*

*కర్మలను ప్రారంభించే ముందు మీరు కర్మలకు నమస్కరించాలి..!*

*"తస్మై నమః  కర్మణే "...*

*’ఓ కర్మ దేవతా!  నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు' అని ప్రార్థించాలి.*

*నమస్కారం అంటే ఏదో రెండు చేతులు జోడించడం కాదు, తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని  భగవంతుని ప్రార్థించడమే నమస్కారంనకు అంతరార్థం..!*

 కొంత మంది అడుగుతారు కదా..! చచ్చాక డబ్బులు తీసుకోని వెళ్తావా అని వాళ్ళందరికీ చెబుతున్నాను.. చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం...                                                   
  ❤️💖❤️                                                              నదిలో మునిగిపోయి కొట్టుకుపోతున్న ఒక బాలుడు 'రక్షించండి, రక్షించండి' అంటూ పెద్దగా కేకలు పెడుతున్నాడు. అటుగా పోతున్న పెద్దమనిషి నదిలోకి దూకి, మునిగి పోతున్న ఆ బాలుడిని రక్షించాడు. ఆ బాలుడు పెద్దమనిషి కాళ్ళ మీద పడి, "స్వామీ! మీరు మీరు రక్షించకపోతే ర చచ్చిపోయే వాడిని, మీ ఋణం ఎలా తీర్చుకోగలను." అని వేడుకున్నాడు. "నాకు ఈత వచ్చు కాబట్టి రక్షించాను, ఇందులో నా గొప్పదనం ఏమీలేదు... అయితే, భవిష్యత్తులో నీవు రక్షించబడాల్సినంత గొప్పవాడివని నిరూపించుకో!! నిన్ను రక్షించకపోతే ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయేదనిపించుకో.... అంతే "
❤️💖❤️
ఒక చిన్న చీమ మీ కాలిని కాటేయగలదు, కానీ మీరు దాని కాలిని కొరకలేరు. అందుకే జీవితంలో ఎవరినీ చిన్నగా చూడకండి. వారు చేయగలిగింది, బహుశా మీరు చేయలేకపోవచ్చు.                ❤️💖❤️

 *కాశి ఆలయ చరిత్ర*

👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 

👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*

👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*

👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*

👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*

👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు*

👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*

👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*

👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*

👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*

👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*

👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*

👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*

👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*

👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*

👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*

👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*

👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*

👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*

👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 

👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*

👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*

👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*

👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*

👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*

👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*

👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*

👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*
 🔱ఓం నమః శివాయ🔱:
*లలితో పాఖ్యానం*                     అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
సర్వసౌభాగ్యదాయక చక్రం చతుర్ధ ఆవరణం ఇందులో త్రిపురవాసిని అధి దేవత సంప్రదాయయోగిని యోగినీ దేవతగా సర్వసంక్షోభిణి మొదలుగా పదునాలుగు మంది దేవతలు ఉంటారు
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసమ్పత్తిపూరిణీ, సర్వమంత్రమయీ,సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సమ్ప్రదాయయోగినీ,
దశకోణముల బహిర్దశారమైన సర్వార్దక్సాధక చక్రంలో త్రిపురాశ్రీ అధిదేవతగా, కులోత్తీర్ణ యోగిని యోగినీదేవతగా, సర్వసిద్ధిప్రదాదేవి మొదలుగా పది మంది దేవతలు ఉంటారు.
సర్వసిద్ధిప్రదే, సర్వసమ్పత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ,కులోత్తీర్ణయోగినీ,
దశకోణముల అంతర్దశారమైన సర్వరక్షాకర చక్రమైన ఆవరణలో త్రిపురమాలిని అధిదేవత, నిగర్భయోగిని యోగినీ దేవతగా సర్వఙ్ఞా దేవి మొదలగు దశ దేవతలు ఉంటారు.
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
అష్టకోణ సప్తావరణం సర్వరోగహర చక్రం. అధిదేవత త్రిపురాసిద్దాంబ, రహస్యయోగిని తో కూడి వశిని మొదలుగా ఎనిమిది మంది వాగ్దేవతలు ఉంటారు.
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌలిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
నవమావరణము సర్వానందమయి చక్రము బిందువు.
అధిదేవత మహాత్రిపుర సుందరి. యోగినీదేవత పరాపర రహస్యయోగిని.
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,
***
లలితాదేవి వెనక ఏడు అంతస్థుల గేయచక్రరథం, ఐదు అంతస్థుల కిరిచక్ర రథం బయలు దేరుతాయి.
లలితాదేవి దండయాత్రకు బయల్దేరిందన్న వార్త విన్న భండాసురుని శూన్యక నగరవాసులు భయభ్రాంతులౌతారు. భవనాలు అకారణంగా బీటలు వారుతుంటాయి.
లలితాదేవి దండయాత్రకు బయలు దేరిందన్న వార్త విన్న శూన్యక పట్టణవాసులు భయభ్రాంతులౌతారు. అకారణంగా భవనాలు బీటలు బారుతాయి.ఉల్కలు పడటం ప్రారంభమవుతుంది. భూకంపం, భూమి మండిపడటంతో ప్రజలంతా వణికి పోసాగారు.
చారుల ద్వారా ఈ సమాచారము విన్న భండాసురుడు భయపడక తమ్ములు విశుక్రుడు విషంగుడిని పిలిపిస్తాడు. సామంత రాజులంతా సభాస్థలికి చేరుకుంటారు.
లలితాదేవి యుద్దసంరంభంలో ఉన్న సమయంలో భండాసురుడి నగరమైన శూన్యకపట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. వెంటనే అతను  విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశుక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ,
"దేవతలు అందరూ అగ్నికుండంలో పడి మరణించారు. ఆ అగ్ని కుండం నుండి మాత ఉద్భవించి అందరిని పునరుజ్జీవులను కావించింది. మహిళాసేనతో మనమీదకు యుద్దానికి బయల్దేరింది. వారంతా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్ళను పగులకొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పట్టికి మనము అప్రమత్తులయి మన సైన్యాన్ని వారిని ఎదురుకోవటానికి పంపించాలి." అంటాడు.
ఆ మాటలు విన్న విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు.
1."ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి.
ముందుగా మన గూఢచారులను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి.
ఏ పరిస్థితిలోనూ వారిని తక్కువ అంచనా వేయకూడదు.
గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు.
శంబనిశంబులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు.
కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి.
అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలి." అని వివరంగా చెప్తాడు.
అంతా విన్న భండాసురుడు ఆ మాటలను కొట్టి పారేస్తూ, "దేవుళ్ళు అందరూ ఆమె వెనక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. మన సైన్యంలో ఉన్న సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చి వేయగలరు. వారందరూ హిరణ్యకశిపుడితో సమానమైన వారు. అటువంటిది ఒక అబలను జయించటం ఎంత సేపు? పనికిమాలిన ఆలోచనలతో బుర్రలు పాడుచేసుకోవద్దు." అంటూ విషంగుడిని మందలించి,
సింహాసనం నుండి లేచి, "కుటిలాక్షా సైన్యాన్ని సిద్దం చేయి శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు. ఆమెను జుట్టు పట్టుకొని తీసుకు రావాలి." అని సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు.

మంత్రులను పురోహితులను పిలిపించి అభిచారహోమం అనే క్షుద్రపూజ నిర్వహించమని ఆఙ్ఞాపిస్తాడు.
**
భండాసురుడి చేత లలితాదేవి కేశాలు పట్టుకొని లాక్కు రమ్మని ఆదేశించబడ్డ కుటిలాక్షుడు దుర్మదుడనే రాక్షసుడిని నాయకుడిగా నియమించి మొదటి సేనను యద్దరంగానికి పంపిస్తాడు. శూన్యకపట్టణ రక్షణ కోసం నాలుగు దిక్కులలో నలుగురిని పదిపది అక్షౌహిణుల సైన్యంతో నియమిస్తాడు. తూర్పుకోటను తాళజంఘుడు, దక్షిణకోటను తాళభుజుడు, ఉత్తరకోటను తాళకేతు పడమటికోటను తాళగ్రీవుడు తమతమ సైన్యాలతో రక్షణగా ఉంటారు.
శక్తిసేనను ఎదుర్కోవటానికి వచ్చిన దుర్మదుడి సైన్యాన్ని, లలితాదేవి శూలం నుండి ఆవిర్భవించిన సంపత్కరీదేవి తన ఏనుగుల సమూహంతో ఎదిరిస్తుంది. తను పంపించిన సైన్యం పరారవటం చూసిన దుర్మదుడు స్వయంగా ఉష్ట్ర (ఒంటె) వాహనుడై యుద్దరంగ ప్రవేశం చేస్తాడు. రణకోలాహలం అన్న ఏనుగును అధిరోహించిన సంపత్కరీ దేవి అతనిని ఎదుర్కుంటుంది. అప్పుడు జరిగిన భీకర పోరాటంలో సంపత్కరీ దేవి కిరీటంలోని ఒక వజ్రపురాయిని దుర్మదుడు పడగొట్టగలుగుతాడు. దాంతో ఇంకా ఆగ్రహించిన దేవి దుర్మదుడిని గుండెలో బాణాలు నాటి చంపుతుంది. దుర్మదుడి మరణంతో భయపడ్డ అతని సైన్యం వెనుతిరిగి పారిపోతుంది.
ఈ విషయం తెలుసుకున్న భండాసురుడు కోపోద్రిక్తుడైస్వయంగా ఖడ్గం తీసుకొని రణరంగానికి బయల్దేరుతాడు. అది చూసిన అతని వద్దకు వచ్చిన కుటిలాక్షుడితో, "దేవతలు కాని, యక్షులు కాని దుర్మదుణ్ణి జయించలేక పోయారు. అటువంటి వీరుడు ఒక అబల చేతిలో మరణించాడు, ఆమెను వధించటానికి కురండకుని వెంటనే పంపించ వలసింది." అని ఆజ్ఞాపిస్తాడు.
కురండుకుని పిలిపించిన కుటిలాక్షుడు, "నీవు మాయా యుద్దంలో ఆరితేరిన వాడవు. వెంటనే సైన్యం తీసుకొని వెళ్ళి శత్రువును వధించి రా." అని ఆజ్ఞాపించగానే, కురండకుడు ఇరవై అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని యుద్దరంగానికి బయలుదేరుతాడు.
సంపత్కరీదేవి సైన్యం లోని చండి, "చెలీ యితనితో నేను యుద్దం చేస్తాను. నీవు చంపలేవని కాదు. కాని ఈ దుష్టుడు నా చేతుల్లో మరణించాలి" అని వేడుకొనటంతో, సంపత్కరీ దేవి తన సైన్యాన్ని పక్కకు తప్పిస్తుంది.
చండి కురండుకుని పై బాణాల జడివాన కురిపిస్తుంది. ఆమె గుర్రపు సకిలింపుకు కురండుని సైన్యం మూర్చ పోతుంది. చండి చేతిలోని పాశాయుధం నుండి కోట్లాది సర్పాలు వెలువడి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండకుడి బాన ప్రయోగంతో చండి యొక్క వింటి నారి తెగిపోవటంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరి వేస్తుంది. ఆ దెబ్బకు కురండుడు మరణిస్తాడు. అంకుశం తరువాత రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తుంది.
ఈ విషయం విన్న భండాసురుడు ఉగ్రుడై 100 అక్షౌహిణుల సైన్యాన్ని అయిదుగురు సేనాధిపతులతో పంపిస్తాడు.
కరంకుడు పరివారంతో యుద్దభూమిలోకి ప్రవేశించగానే సర్పిణీ అనే మాయను ప్రయోగిస్తాడు. ఆ మాయ నుండి రణశంభరి అన్న సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తిసేన మీదకు పంపుతారు. దానవులు ఇంతకు ముందు కూడా ఇటువంటి మాయాయుద్దంతో ఎందరో దేవతలను హతమార్చారు. కోటానుకోట్ల సర్పాలు శక్తిసేనను హింసించటం మొదలెడుతాయి. ఆ సర్పాలు మరణించి కూడా మళ్ళీమళ్ళీ పుడుతూ ఉంటాయి.
కరేంద్రి నూరు గాడిదలను పూన్చిన రథం మీద చక్రంతో, వజ్రదంతుడు ఒంటెనెక్కి బల్లెంతో, అదే పేరుకల మరొక సేనాధిపతి రెండు గద్దల రథం ఎక్కి బాణాలతో శక్తి సైన్యాన్ని సంహరించటం మొదలెడతారు. నకులీదేవి గరుడవాహనారూఢురాలై రణరంగంలోకి ప్రవేశిస్తుంది. ఆవిడ నోటి నుండి 32 కోట్ల ముంగిసలు ఉద్భవించి పుట్టిన పాములను  పుట్టినట్టే మింగేయటం మొదలెడుతాయి. నాగదేవత రణశంభరిని నకులి దేవి గరుడాస్త్రం ప్రయోగించి చంపేస్తుంది.
అది చూసిన మిగిలిన అయిదుగురు సేనాధిపతులు ఒక్కసారిగా నకులీదేవి మీదకు విరుచుకు పడతారు. వెనక నుండి నకులీదేవి ముంగిస సైన్యం వారి మీదకు దాడి చేస్తుంది.  గగన మార్గం నుండి నకులీదేవి గరుడారూఢురాలై చేసిన యుద్దంలో అయిదుగురు సేనాధిపతుల తలలు నరికి హతమారుస్తుంది.
సేనాధిపతుల మరణానంతరం ఇద్దరు సోదరులను చర్చలకు పిలిపించిన భండాసురుడు, "నా సేన పేరు చెప్పగానే పారిపోయే దేవతలలో ఇంతటి తెగింపు వచ్చింది అంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు మనం మూలాల్ని చేధించాలి. గుర్రాలు ఏనుగులు ముందు నడుస్తుండగా ఆమె సైన్యాని కంతటికి వెనకగా ఉన్నదని చారుల ద్వారా తెలుస్తున్నది. అందుచేత ఆమె మీదకు వెనక నుండి విషంగుడు దాడి చేయవలసి ఉంటుంది" అని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
 లలితాదేవి వద్ద సైన్యం తక్కువగా వుండటం వల్ల వెనక భాగం వద్ద రక్షణ లేకపోవటం వల్ల ఆ విధంగా దాడి చేయటం లాభదాయకంగా వుంటుందన్న నమ్మకంతో విషంగుడు పదిహేను అక్షౌహిణుల సైన్యంతో శక్తిసేన మీద దాడికి ఉపక్రమిస్తాడు.
మొదటిరోజు యుద్దానంతరం సాయం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరుకుంటాడు. ఆ పాటికి శక్తిసేన పడమటి దిక్కు వైపు సాగిపోతున్నది. విషంగసేన ఉత్తర దిక్కుగా కదిలి తూర్పువైపు తిరిగారు. దగ్గరలోనే శ్రీచక్రరాజ రధం కనిపిస్తున్నది. లలితాదేవి చుట్టుపక్కల చాలా తక్కువ సైన్యం ఉన్నట్టు తెలుస్తున్నది.