Monday, October 13, 2025

 248 వ భాగం 
🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 37

మూఢో నాప్నోతి తద్బబ్రహ్మ యతో భవితుమిచ్ఛతి|
అనిచ్చన్నపి జీరో హి పరబ్రహ్మ స్వరూపంబాక్||

మూఢుడు బ్రహ్మత్వాన్ని సాధించలేరు. సాధించాలనే అతని కోరిక అందుకు అవరోధంగా
నిలుస్తుంది. జ్ఞాని బ్రహ్మత్వాన్ని కోరకుండానే, అర్థము చేసుకోవడంతో ఆ బ్రహ్మమై నిలుస్తాడు.

ధ్యాన సాధనాలు అన్నిటికీ కారణ ంగా సాధించాలనే కోరిక ఉండి తీరుతుంది. చివరిదైనా ఈ కోరికే సాధకుని తన సాధనకు బందీని చేస్తుంది .చివరి కోరికైన ఈ మముక్షత్వం మొత్తం కోరికలన్నిటికంటే అతి బలియమై ధృడమైన బంధం గా సాధకుని మనసుని సాధనతో బంధిస్తుంది. ఈ చివరి బంధాన్ని చేదించటమే ఈ శ్లోకం లక్ష్యం .సాధన ప్రథమ దశలో ముముక్షత్వాన్ని గొప్పదిగా వర్ణించి ప్రోత్సహిస్తారు. అలా దానిపై విలువను పెంచుకున్న మనసు సహజంగా మిగిలిన కోరికల బంధం నుండి ముక్తమై, ఏకాగ్రమయి సునిశితము తీక్షణం అవుతుంది. అంతవరకు అనేక ఆకర్షణలతో చీలి హీనమైన మనసు తన శక్తి అంతటితో కోరిన ఈ ఒకే ఒక చివరి కోరిక మహాబలవంతంగా తయారై అజేయంగా అహంకారాన్ని రూపొందిస్తుంది. కోరే అహంకారము వేరుగా కోరబడేది వేరుగా ద్వైత భావము మరింత బలపడుతుంది. ద్వైతం ఏ రూపంలో ఉన్న గర్హ నీయమే. అద్వయమైన ఆత్మానుభవాన్ని పొందటానికి చూపించే మనో బుద్ధులను వీలైనంత బలహీనము చేసి చివరగా వాటిని అధిగమించాలి. ఇందుకు ముముక్షత్వం సాధన ప్రథమ దశలో సహకరించిన ,చివరికి బలియమైన బంధముగా రూపు దాలుస్తుంది. అందుకే ఆచార్యులు ఇక్కడ సాధనలను హెచ్చరిస్తూ అద్వైయమైన ఆత్మానుభవంలో ఉండటానికి ద్వైతాన్ని భావాల రూపంలో చూపించే మనసును అధిగమించి భావ శూన్య స్థితిలోకి రావలసిన అవసరాన్ని ఇంత గట్టిగా నొప్పి చెబుతున్నారు. మనసు భావ శూన్యరూపంలో తెలియబడుతూ ఉంటే మనసు అనబడుతుంది. ఆలోచన ప్రవాహం ఆగిపోతే అద్వైయమైన ఆత్మ తత్వం నిశ్చలంగా ఉంటుంది. కదలిక ఉన్నప్పుడు తరంగాలుగా నామరూపాలతో తెలియబడిన సముద్రమే కదలిక ఆగిపోయినప్పుడు నిచ్చల గంభీరంగా మహాసాగరంగా కేవలం గా నిలుస్తుంది.🙏🙏🙏
ఇంకా ఉంది మిగతాది రేపటి భాగంలో.    
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(243వ రోజు):--
     స్వామీజీ ప్రారంభోపన్యాసం 
     ఈ పుణ్యదినాన ఒకగొప్ప స్వప్నం నిజం కాబోతోంది. ఈనాటిసాంకేతిక యుగపు యువతకు జీవితానికి అర్థ మేమిటో బోధించటంకోసం ఒక నూతన సంస్థను స్థాపించాలనే ఆలోచన 20 ఏళ్ళనాటిది. మానవు ని అంతఃకరణకు సంబంధించిన ఈ వేదాంతజ్ఞానం నిజానికి మనందరి జన్మహక్కు ; కాని, చరిత్రచే నెట్టబడు తూ ముందుకు సాగుతున్న సమా జంలో మనం మన వారసత్వమైన ఈ ఆత్మవిద్యనుంచి వేరుచేయబడి కోరికలపుట్ట అనే అరణ్యంలో మానా భిమానాలు లేకుండా నిరాశా దుఃఖా లతో దిక్కుతెలియకుండా తిరుగు తున్నాం. 
         ఇరవయ్యేళ్ళక్రితం ఈఆలోచన నాకు వచ్చినపుడు ఎవరూ దానిని పట్టించుకోలేదు. ఆఖరుకు మతాచా ర్యులు కూడా నన్ను వింతగాచూచి జాలిపడ్డారు, ఈ చురుకైన,తెలివైన యువకునికి పిన్నవయసులోనే ఎలా వచ్చిందా ఈ ఉన్మాదం అని. 
       చాలా ఏళ్ళు శ్రమపడాల్సి వచ్చింది - ప్రతిఘటనలు ఎదుర్కొం టూ, నిరసనలను సహిస్తూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా బాధాకరమైన జడత్వాన్ని అధిగమించి నిర్భయం గా ముందుకు సాగుతూ. భారత దేశంలో మా ఘనవిజయాన్ని చూచి మతంలో ఎంతో నమ్మికఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు, అడ్డంకు లన్నీ ఎలా తొలిగిపోయాయోనని. భారతదేశంలోని మా హిందూసమా జంనుంచి చైతన్యవంతమైన భక్తి బ్రహ్మాండమైన ప్రవాహంగా ఉవ్వె త్తున లేచింది. ఆ మహాకెరటపు శిఖ రాన తేలుతూ చిన్మయమిషన్ అమెరికా ఖండాన్ని చేరి, చిన్మయ మిషన్ వెస్ట్ గా ఆవిర్భవించింది.
         మీరంతా శ్రద్ధగా, నిస్వార్ధంగా, అంకితభావంతో, పూర్ణాహుతితో, చక్కని క్రమశిక్షణతో కష్టించి సాధన చేస్తారని ఆశిస్తున్నాం. మిమ్మల్ని 
మారమని మేం కోరటంలేదు ; అంత రంగంలో మీకు కలుగుతున్న వికాసంవల్ల బాహ్యప్రపంచంలో కూడా మీరు ప్రవర్తించే వైఖరిలో కలుగుతున్న మార్పులను గమనించ మని మాత్రమే మిమ్మల్ని కోరుతు న్నాం. 
          మీరు పరిపూర్ణులు కావాలి; ఆ విధంగా మరెందరో పరిపూర్ణులు కావటానికి మీరు చేయూత నీయాలి. 
                      —***—
        🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺   
🦚జ్ఞానప్రసూనాలు🚩
13/10/2025

1) : సాధన అంటే?
తానెవరో జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రయత్నం.

2) ఏదో ఒక కిరణాన్ని పట్టుకుని వెళితే సూర్యుణ్ణి చేరుకున్నట్టు ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని వెళితే దేవుణ్ణి చేరుకోగలం.

3) దేనినీ నిర్వచించకుండా... ఉన్నదానిని  ఉన్నట్టుగా... యథాతథంగా చూడడమే... దైవదర్శనం.

4) జీవితానికి ఏదో పరమార్థం ఉందనుకోవడమే జీవితంలో సంభవించే అన్ని సుఖదుఃఖాలకు కారణం.
జీవితానికి ఏదో పరమార్థం ఉందనే భావన వదిలేయగలిగితే, అదే నిజమైన జీవిత పరమార్థం.

5) సాక్షిగా తన జీవితాన్ని తాను చూడగలిగితే చాలు.
అంతకు మించి ఆధ్యాత్మికత లేదు.

6) వైరాగ్యం అంటే వదలటం కాదు. ఏ క్షణంలోనైనా వదలటానికి సిద్ధంగా ఉండటం.
 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️ ప్రశ్న : “భగవాన్‌, సన్యాసికి ఏకాంతం అవసరమా ?”_*
*_🦚 భగవాన్ సమాధానం :_* 
> *_“ఏకాంతము మనిషి మనస్సులో ఉంటుంది. ఒకడు జన మధ్యంలో ఉండి కూడా కొఱత లేని మనశ్శాంతిని నిలబెట్టుకోవచ్చు. అట్టివానికి ఎప్పుడూ ఏకాంతమే. ఇంకొకడు అడవిలో ఉన్నా మనస్సును నిగ్రహించుకోలేకపోవచ్చు. అట్టివాడు ఏకాంత వాసి అని చెప్పలేము. ఏకాంతమనేది ఒక మనోవృత్తి. లౌకిక విషయాసక్తునికి ఎక్కడ ఉన్నా ఏకాంతం లభించదు. నిరాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసియే."_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
 *🌹🌹  శివుడే విష్ణువు విష్ణువే శివుడు..  🌹🌹*

             *దేవుడు మనిషిని సృష్టించి పంచభూతాలతో ప్రకృతిని సృజించి అద్భుతమైన జీవనసౌఖ్యాన్ని అనుభవాన్ని పొందమన్నాడు అయితే హిందూ మతధర్మం, ఆర్ష విజ్ఞానం భోదించేది ఒకటే. దైవం ఒక్కడే భారత వర్షంలో మతవిధానము ఒక్కటే అని ఉద్భోదించినా, మనుషులు తమ స్వార్ధానికి నిర్మించుకున్న పాపకూపాలే వివిధ మతాలు అది శైవమైనా వైష్ణవమైనా అంతే. దైవానికి విభజన లేదు.*

             *శివ సహస్ర నామస్తోత్రం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యుని వద్దకు తీసుకుని వెళ్ళగా, కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మా లనూ ధర్మరాజుకు భోదించాడు. అంతా నేర్చుకున్న తరువాత ధర్మరాజు తన మనసులోని మాటను బయట పెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్ర నామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరతాడు.*

             *అప్పుడు బీష్మాచార్యుడు ఏ మాత్రం భేషజం లేకుండా ఇలా అంటాడు." ధర్మజా! శివుని గురించి సమగ్రంగా చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. వారిద్దరూ ఒకటే కనుక, శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్ర నామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు." అని అంటాడు. అదే సందర్భంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజు మనోభిష్టాన్ని గ్రహించావు కదా! శివ సహస్ర నామ స్తోత్రం గురించి వివరించు '' అని అంటాడు. దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు. అంత వేగంగా, తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు. సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే, వారిని వేరు చేసి చూడటం తగదు.*

             *ఈ విషయాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా స్పష్టం చేసాడు. ఈశ్వరుని అంశతో జన్మించిన ఆంజనేయుణ్ణి తనకు నమ్మకమైన మిత్రునిగా, సచివునిగా శ్రీరామచంద్రుడు పరిగణించడానికి ప్రధాన కారణం ఇదే. శివ కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడనికి ఆంజనేయుడే ఉదాహరణ.*

            *శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి తోడ్పడినట్లే, విష్ణుమూర్తికి శివుడు తోడ్పడాడు. ఈశ్వరాంశ సంభూతు డైన ఆంజనేయుడు సీతాన్వేషణలో శ్రీరామచంద్రునికి తోడ్పడటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.*

           *"శివాయ, విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే " అని సంద్యావందనం శ్లోకాలు తెలుపుతున్నాయి.*

            *శివ, కేశవుల్లో ఎవరిని అరాధించినా ఒకటే.ఇద్దరినీ అరాధించినా తప్పు లేదు. సృష్టిలోని ప్రాణులను నిలబెడు తున్నది విష్ణుమూర్తి అయితే లయం చేసుకుంటున్నది పరమేశ్వరుడు.*

                            *నమః శివాయ*

                    *నమో నారాయణాయ*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
 *జై శ్రీమన్నారాయణ🕉️* 
              *ఆచార్య సద్భోదన*
                 ➖➖➖

**చాలామంది ఆధ్యాత్మిక* *సాధనలను ముసలితనంలో* *చేయవచ్చుననీ, జీవితంలోని* *రకరకాల  భోగభాగ్యాలను ముందు* *అనుభవిద్దామనీ అనుకుంటూ* *ఉంటారు* .

*వారు తమ శక్తిలో చాలా భాగం భౌతిక సుఖాలలో ఖర్చుపెట్టడం వలన కష్టతరమైన  ఆధ్యాత్మిక సాధనలు చేసే అవకాశం వారికి ఎన్నడూ రాదు. వారు ఆధ్యాత్మిక సాధనలు మొదలు పెట్టినా, చేయడానికి కావల్సిన శక్తి, ఓర్పు లేక వారికి అంతగా మేలు కలగదు.*

*అసంఖ్యాకులైన జనులు తమ జీవితం వ్యర్థమై పోయిందన్న విషయాన్ని తెలుసుకునే సరికి సమయం మించిపోతుంది. అయితే ఆ విషయమే తెలియక ఇంకా నవయౌవనంలోనే ఉన్నామనుకుంటూ భౌతిక సుఖాల వెంట పరిగెట్టే వృద్ధులకంటే వీరు నయం.*

*ఆధ్యాత్మిక జీవనాన్ని వీలైనంత తక్కువ వయస్సులోనే ప్రారంభించాలి. ఆధ్యాత్మికత అనే బీజాన్ని మనలో మనం ముందుగా నాటుకోకపోతే వయసు ముదిరిపోయాక ఆ స్వభావాన్ని అలవరుకోవడ కష్టం.*

*బంధవిముక్తి, శోకనివృత్తి చేసుకుని పారమార్థిక సిద్ధిని పొందడమన్నదే కనుక మీ ఆదర్శమైతే ఇప్పుడే సాధన మొదలుపెట్టండి.*
             *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
                     
 6️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*16. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ య:l*
 *అఘాయురిన్డ్రియారామో మోఘం పార్థ స జీవతిll*

ఎవరైతే పై శ్లోకంలో చెప్పబడిన విధంగా సాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించరో, అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా, ఇంద్రియలోలుడై పాపము చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితము వ్యర్ధము.

ఎవరైతే ఈ జీవన చక్రాన్ని అనుసరించకకుండా, అంటే హెూమములు, పంచమహా యజ్ఞములను చేయకుండా, తాను చేసే కర్మలను ఒక యజ్ఞము మాదిరి ఆచరించకుండా, ప్రకృతి దేవతలను తృప్తి పరచకకుండా, ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతాభావన లేకుండా, కేవలం తన కోసరమే తింటుంటాడో, స్వార్థబుద్ధితో జీవిస్తుంటాడో, వాడు పాపాత్ముడు. వాడి జీవితము పాపభూయిష్టము. కేవలం ఇంద్రియములకు వశుడై, ఇంద్రియసుఖములను అనుభవిస్తూ జీవితం వృధాగా గడుపుతున్నాడు.

ప్రతిరోజూ ప్రతి గృహస్థు హోమం చేయ్యడం అందులో ఓషధులు వేల్చడం, వాటిని దేవతలకు అందచెయ్యడం మానవ ధర్మము. దాని వలన వర్షాలు కురుస్తున్నాయి. మానవులు వర్షముల వలన నీరు పొందుతున్నారు. నీటిని ఉపయోగించి ఆహార ధాన్యాలు పండించు కుంటున్నాడు. ఫలవృక్షముల నుండి ఫలములు పొందుతున్నాడు. కాని ప్రతిగా ఏమీ చేయడం లేదు.(దేవుడు ఇచ్చిన నీటి కోసం రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి.) ఊరికినే ఇతరుల సంపదను తినేవాడు పాపాత్ముడు. ఇటువంటి వారిని పరాన్నభుక్కులు అంటారు. ఇతరులు తెచ్చిపెడితే తినే రకాలు. ఆత్మజ్ఞానం సరిగా తెలియని వారి గురించి కర్మయోగము నిర్దేశింపబడిండి. మానవులు ముందుగా కర్మయోగము అవలంబించి, కర్మలను ఆచరించి తద్వారా జ్ఞానము సంపాదించి, ముక్తులవుతారు. కాబట్టి ఆత్మతత్వము తెలుసుకునే వరకు ఎవరెవరుచేయవలసిన కర్మలు వారు చేయవలసినదే. కర్మలు మానరాదు. పైగా ఈ కర్మలు అంటే నిత్యాగ్ని హెూమములు, పంచ మహాయజ్ఞములు, యజ్ఞయాగములు మొదలగు కర్మలు సమాజ హితం కోరి చేస్తున్నారు. అందరికీ ఆహారం సమృద్ధిగా సమకూరాలని చేస్తున్నారు. అది నిష్కామ కర్మ పరోపకారము గురించి చేసే కర్మ. ప్రతిఫలమును ఆశించకుండా చేసే కర్మ. దీని వలన జ్ఞానము కలుగుతుందే కానీ బంధము కలుగదు.

ఇప్పుడు ఒక సందేహము కలిగే అవకాశం ఉంది. ఈ పంచ మహా యజ్ఞములు హోమములు ఏమీ తెలియని వారికేనా లేక ఆత్మతత్వమును తెలుసుకున్న వారు కూడా చేయాలా అనే సందేహము రావచ్చు. కొంతమంది క్రితం జన్మలోనే యజ్ఞములు హోమములు పరోపకారములు, నిష్కామ కర్మలు చేసి ఆత్తతత్వమును తెలుసుకొని కేవలం పరమాత్మను చేరుకోడానికే ఈ భూమితో అవతరిస్తుంటారు. అటువంటి జీవన్ముక్తులకు ఎటువంటి కర్మలు చేయనవసరం లేదు. కానీ వారు కూడా సమాజ హితం కోరి చేస్తున్నారు. ఒకవేళ వారు చేయకపోయినా, సర్వసంగ పరిత్యాగులు, జీవన్ముక్తులు చేయడం లేదు కదా మనం చేయడం ఎందుకని మానకూడదు. ఈవిధంగా హెూమాలు పంచ మహా యజ్ఞులు చేయని వారు, పరోపకారం కోసం సమాజహితం కొరకు పాటుపడని వారు, కేవలం తమ స్వార్ధాన్ని మాత్రమే చూచుకొనే వారు పాపాత్ములు అని చెప్పబడ్డారు. వారిని అఘాయులు అని అన్నారు భగవానులు. అటువంటి వారు ఇంద్రియారాములు అంటే కేవలం ఇంద్రియములకు వశులై, ఇంద్రియ సుఖములు మాత్రమే అనుభవిస్తుంటారు. ఇతరుల గురించి పట్టించుకోరు. స్వార్ధపరులు, వారి జీవితములు వ్యర్ధములు. వారిని జీవచ్ఛవాలు అనికూడ అనవచ్చు.

ఈ శ్లోకంలో ఒకపదం వాడారు. ఇంద్రియారామ: అంటే ఎల్లప్పుడూ ఇంద్రియములు ఎలా చెబితే అలా చేసేవాడు. కేవలం ప్రాపంచిక విషయములలో, విషయ భోగముల యందు ఆసక్తి కలిగి ఉన్న వాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా చేస్తుంటాడు. బతకాలి కాబట్టి బతుకుతుంటాడు. ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెబితే అది చేస్తాడు. కంటితో చూచింది, చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణా జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడు పాపాత్ముడు. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు. అటువంటి వాడి జీవితం వ్యర్ధము. అని కృష్ణుడు ఖండితంగా చెప్పాడు.
(సశేషం)

🌹యోగక్షేమం వాహామ్యహం 🌹

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P168
 247 వ భాగం
🕉️ అష్టా వక్ర గీత🕉️ అధ్యాయము 18 
శ్లోకము 36

నాప్నోతి కర్మణా మోక్షం విమూఢోబ్యాస రూపిణా|
ధన్యో విజ్ఞాన మాత్రేన ముక్త స్తిష్ఠత్య విక్రయః||

మూఢుడు ధ్యాన సాధనాలతో మనసును నియమించడానికి ప్రయత్నము చేసిన ఆత్మానుభూతిని పొందలేడు. సుకృతం కలిగిన సాధకులు శ్రవణమననాలతో ముక్తిని పొంది ఆత్మానుభూతితో స్థిరంగా స్థితుడై ఉండగలుగుతాడు.

క్రిందటి శ్లోకములోని అష్టావక్రని ఉపదేశము శిష్యుడిని సంశయాలకు చిత్రుడుని చేస్తుంది. అతడి విశ్వాసాన్ని ఆలోచన శక్తిని సవాలు చేస్తుంది .వేదాధ్యయనము చేసేటప్పుడు ముందుగా కర్మకాండ విభాగంలో విభిన్న కార్యకలాపాలపై ఆచార విధానాలపై విలువను వ్యామోహాన్ని పెంచుకొని వాటిని వదలడం కష్టముగా భావిస్తారు. ఉపనిషత్ విభాగాన్ని మొదలుపెట్టేటప్పుడు గురువు తప్పనిసరిగా వారిని హెచ్చరిస్తారు. ఆ విధానాలలోనూ నియమ నిష్టలను వాటిపై విలువలను కూడా శిష్యులు విడిచిపెట్టవలసి ఉంటుంది. ఆచార వ్యవహార ఆచరణకు అలవాటు పడిన మనసును కదిలించి వాటిని విడిచిపెట్టి అంతకంటే సునిషితము సూక్ష్మము అయిన ఉపనిషత్ విజ్ఞానాన్ని అర్థము చేసుకోవడానికి అనువుగా శిష్యుని సంసిద్ధుని చేస్తారు ఆచార్యులు .ఆ తర్వాత అంతకంటే సూక్ష్మతరమైన ధ్యానంలో అధ్యయనాన్ని కూడా విస్మరింప చేస్తారు .ఈ విధంగా మనసు యొక్క పరిధిని ఏకాగ్రతను పెంచుతూ అనంత సత్యాన్ని బోధించి నిరూపించి ఆ అనుభవానికి శిష్యుడిని సంసిద్ధునిగా చేస్తారు గురుదేవులు.

ధ్యాననిష్టుడైన శిష్యుని ఆ ధ్యానం నుండి కూడా ముక్తుని చేసి ఆత్మానుభవానికి అనువుగా మలచటానికి మహర్షి ఇక్కడ ఇలా ఉపదేశించారు. ధ్యానం చేస్తున్నానన్న భావమే అహంకారానికి జీవం పోసి ధ్యానికి ధ్యాన లక్ష్యానికి మధ్య అర్థరహితము అనవసరము అయిన విభేదాన్ని సృష్టిస్తుంది. అందుకే మహర్షి చివరగా ఈ హెచ్చరికను చేస్తున్నారు.

కలాని ఖడ్గ సమమైన నేర్పుతో ఉపయోగించగలనని ఇదివరకే నిరూపించారు అష్టావక్రమునీంద్రుడు .వాడి అయిన తన లేఖినితో శిష్యుని మనసును గాయము చేసే హేళన చేసి అతని మూర్ఖత్వాన్ని శాశ్వతంగా నిర్మూలించగల సమర్థులు ఆయన. ఈ గీత మూడవ అధ్యాయం అంతటా ఈ విధానమే వాడబడటాన్ని మనం ఇదివరకు స్పష్టంగా చూసాము.

ఇక్కడ మళ్లీ అదే విధానాన్ని ఉపయోగిస్తూ గురుదేవులు ఇలా అంటున్నారు .మనసును ధ్యానముతో నియమించటానికి శ్రమించే మూడునికి ఆత్మ అనుభవం ఎన్నటికీ సిద్ధించదు.సుకృత బలముతో ధన్యుడై చిత్తశుద్ధితో సత్యాన్ని అన్వేషించి సాధకుడు శ్రవణ మననాలతో ఆత్మ తత్వాన్ని అర్థము చేసుకొని సర్వసాధనలను వీడి ఆత్మ అనుభవములో ఆనందంగా ఉండగలుగుతాడు. ధ్యానము మార్గమైతే అపరోక్షానుభూతి గమ్యం. యాంత్రికంగా సాధనలు చేస్తూ తెలివి తక్కువగా మనసుతో ఏదో ఒక భావాన్ని పట్టుకొని ఆగిపోవడం, ధ్యానికి సత్యానికి భేదం ఉందని ఒప్పుకోవటమే అవుతుంది .నామమాత్ర విశిష్టమైన ఈ అహంకారంకు కూడా పూర్తిగా నశించాలి .నేను ధ్యానిని అనే భావము అంతరించాలి. అప్పుడు మాత్రమే విషయి, విషయ రూపమైన ద్వంద ప్రపంచం అదృశ్యమై అద్వితీయమైన ఆత్మ తత్వం స్వయంగా ప్రకాశిస్తుంది.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(242వ రోజు):--
        1975 లో హాంబోల్ట్ రాష్ట్ర విశ్వ విద్యాలయంలో జరిగిన శిబిరం తర్వాత చిన్మయమిషన్ పశ్చిమ విభాగం స్థాపించబడింది. పిన్నలూ, పెద్దలూ, అన్నిమతాలవారూ, సమా జంలోని అన్నివర్గాలవారూ తూర్పు కు గాని, పడమరకుకాని పరిమితం కాని సత్యాన్ని ప్రయోజనకరమైన రీతిలో గ్రహించడానికి వీలుగా ప్రపంచజనులను మేల్కొలపడానికి స్వామీజీ తనకు నిశ్చయించుకున్న లక్ష్యాన్ని పాశ్చాత్యదేశాల్లో ప్రచారం చేయడమే ఈసంస్థ ముఖ్యోద్దేశం.
        ఈ సంస్థ అమెరికా, కెనడా, ట్రినిడాడ్, మెక్సికో, దక్షిణఅమెరికా, వెస్టిండీస్ లలో చిన్మయమిషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పఠనబృందాలు, వేదాంతపాఠాల తరగతులు, చిన్నచిన్న శిబిరాలు, పిల్లలకు బాలవిహార్ కేంద్రాలు, స్వామీజీ ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వ హించడానికి స్థానికకేంద్రాలు బాధ్య త వహిస్తాయి. ముఖ్యకార్యాలయం చాలాఏళ్లపాటు నళిని,బిల్ బ్రౌనింగ్ ల స్వస్థలమైన నాపా, కాలిఫోర్నియా లో ఉంది. మిషన్ కు సంబంధించిన సమాచార పత్రికలనూ, గ్రంథాలనూ ప్రచురించే బాధ్యతను స్వచ్చందంగా స్వీకరించిన ఆ దంపతులిద్దరూ 20 ఏళ్లపాటు సంస్థకు ఆలంబనగా నిలి చారు. 1989 లో శాన్ యోసే, కాలి ఫోర్నియాలో కొంత ఆస్తిని కొనటం ద్వారా సంస్థ కార్యక్రమాలను వృద్ధి చేయటానికీ, తరగతులను నిర్వహిం చడానికీ సానుకూలమైంది. సంస్థకు అధిపతిగా భారతదేశంనుంచి స్వామి తేజోమయానంద ఈకేంద్రం లోనూ, వాషింగ్టన్, డి.సి.; ఫ్లింట్, మిచిగాన్; హౌస్టన్, టెక్సాస్ లవంటి దేశంలోని పెద్ద నగరాల్లోనూ బోధన కార్యక్రమాలు చేపట్టారు. గ్రంథాలు, టేపులు, సమాచార పత్రిక, మననం అనే త్రైమాసిక పత్రిక,- వీటి ప్రచురణ పంపిణీల బాధ్యతలను మాత్రం బ్రౌనింగ్ దంపతులే కొనసాగించారు. 
       స్వామీజీ ఏటేటా అమెరికా వచ్చి ఐదారు పెద్ద నగరాలలో ఉన్న విశ్వ విద్యాలయాల్లో ఉపన్యసించేవారు. 1977లో మాత్రం ఇందిరాగాంధీ దేశంలో విధించిన అత్యవసరపరి స్థితిని బాహాటంగా విమర్శించటం చేత ఆయనకు పాస్పోర్ట్ జారీచెయ్య డం ఆలస్యం చేశారు; ఈకారణం వల్ల ఆయన రాలేకపోయారు. 1979 లో నార్తకెరొలినాలోని రెడ్ వుడ్ కంట్రీలో 8 ఎకరాల భూమి కొని సాందీపని సాధనాలయపు నమూ నా లో ఒక ఆశ్రమపాఠశాల స్థాపిం చారు. ఆస్థలంలో ఉన్న రహదారి బంగళా 50 మంది విద్యార్థులు నివాసానికి సరిపోతుంది. భవనపు భోజనశాలలో కొంతభాగం తరగతు లు నిర్వహించడానికి కేటాయించ బడింది. స్వామి దయానంద (శ్రీ నట రాజన్ అయ్యర్ -పూర్వాశ్రమంలో) సాందీపని నుంచి వచ్చి అధికారి గానూ,మూడేళ్లపాటు జరిగే పాఠ్య కార్యక్రమానికి ముఖ్యాచార్యునిగాను బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజున స్వామీజీ ఉపన్యసించారు.
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺    
 *ఆలోచనల్లో స్పష్టత*

మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది. ఏ దిశలో ఆలోచిస్తే, అటువైపే జీవితం ప్రయాణిస్తుంది. కాబట్టి ‘ఆలోచన’ అనేది అన్ని వైపులా, సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మిక    విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు.

శ్రీకృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి ప్రేరేపించేటప్పుడు విజయాన్ని మాత్రమే కాదు; ధర్మ పరిరక్షణ, భవిష్యత్‌ తరాల సంక్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చాడు. అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచన వల్లే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు. బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్లినప్పుడు, అది క్షణికోత్సాహం కాదు. జీవితం, మరణం, దుఃఖం, విముక్తి- అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం. దాని వల్లే ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టివచ్చింది.

దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా, లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా; శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం శ్రీకృష్ణుడి ఆలోచన తాలూకు శ్రేష్ఠ రూపం. ఒక సమస్యపై ఎక్కువ కోణాల్లో ఆలోచించినప్పుడు మెదడులోని ప్రీఫ్రాంటల్‌ విభాగం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిర్ణయ సామర్థ్యం, భవిష్యత్‌ ఫలితాల అంచనా, సమస్య పరిష్కారం వంటి అంశాలను మెరుగు పరుస్తుంది. క్రమబద్ధమైన, లోతైన ఆలోచన మెదడులో న్యూరల్‌ సంబంధాలను బలపరచి, దీర్ఘకాలికంగా మన జ్ఞానాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.
ఆలోచనకు సహనం, జ్ఞానం, ధర్మపరమైన దృష్టి అవసరం. వేగంగా స్పందించడం కన్నా, మనసును శాంతపరచుకుని, పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది. మొత్తానికి, సరైన ఆలోచన అనేది భౌతిక విజయాలకే కాదు, ఆధ్యాత్మిక వికాసానికి కూడా మార్గం చూపుతుంది. ఇది మనలో వివేకాన్ని పెంచి, శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచనా స్పష్టతను పెంపొందించుకోవాలి. ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మంచి ఆలోచనలు శుభఫలితాలను, దుష్ట ఆలోచనలు సమస్యలను తెస్తాయి. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచననూ జాగ్రత్తగా, సానుకూల దిశలో మలచుకోవాలి. ఆలోచనా శుద్ధి మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది. 

మనసనే నదిలో తేలే దీపంలాంటిది ఆలోచన. అది చీకటిలో వెలుగునిచ్చి, ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలా మార్చి, దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది. లోతైన ఆలోచన కడలిలా విస్తరించి, జ్ఞాన ముత్యాలను జీవిత తీరానికి తీసుకువస్తుంది. ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధురగీతంలా సాగిపోతుంది.
~ఆనందసాయి స్వామి
 *శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ధర్మ సూత్రాలు.🙏*

*ఒక పురుగు దేహంలో ప్రవేశించి నపుడు రోగం మొదలౌతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు. అలాగే చెడుని  చంపితేనే మంచి వస్తుంది.   ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది. కాలధర్మం ప్రకారం వీళ్ళను చంపాలి. నీవు నిమిత్త మాత్రుడివి. పుట్టిన వానికి చావు తప్పదు. యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట, కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది. మమకారం వదిలి పెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు.*

*కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు “ఇది ధర్మమా కృష్ణా!” అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు “నీవు ఒకే ధర్మాన్నిచూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. ఆవు శాకాహారము తింటుంది. మాంసాహారము తినదు. కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మమే.*
                 
*యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్దం  చేయలేదు. వెళ్ళిపోయాడు. ఆ మరునాడు రావణుడు శివుణ్ణి దూషిస్తాడు. నీవు భక్తుణ్ణి రక్షించలేదని. ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడ్డాడు.*

*అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి. కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం. మన ఇంట్లో దొంగలు పడ్డారు. సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు. నీవు కారు వేసుకుని తారురోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి కదా! అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి "కుంజరహః" అని చిన్నగా చెప్పమన్నాడు.* 

*అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన ‘భగవంతుడు ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు’ అని నమ్మి విశ్వాసంతో నడవాలి.*

*పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు.*

*పొట్టకూటికి ప్రపంచ విద్యలు అనేవి ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే       దైవజ్ఞానం కావాలి.* 

*ప్రతి దేశంలోనూ యుద్ధం చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతుంది. ‘ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా!’ అనుకోరు. కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధంఅయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు మనం ఏమి చేయగలము? వారికి బానిసలు కావాలి. అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత యిస్తుంది. దీనుడైన అర్జునుడిని ధీరునివలె భగవద్గీత మార్చివేసినది. అదేవిధంగా చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసినవారు  ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.*
    
*భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే ‘గీతా పారాయణ కన్నా గీతా ఆచరణ ముఖ్యం’ అన్నారు. భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అంటే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరం లేదు. ఒక్క పుల్ల చాలు.*🦋
 6️⃣5️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.* 

  *14. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవ:l*
 *యజ్ఞాద్భవతి పర్జన్యోయజ్ఞ: కర్మ పముద్భవ:ll*

*15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్l*
 *తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ll*

ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తున్నాయి. అన్నము వర్షము వలన ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము. ఆ చేయవలసిన పనులు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలము పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు. ఇది ఒక చక్రము. నిరంతరము తిరుగుతూ ఉంటుంది.

ప్రాణులన్నీ అన్నము వలన జన్మిస్తున్నాయి అంటే అన్ని ప్రాణులు అన్నము అంటే వివిధములైన ఆహారములను తింటాయి. ఆ అన్నము జీర్ణమై, రక్తముగా, శక్తిగా మారుతుంది. ఆ రక్తము వీర్యముగా మారుతుంది. ఆ వీర్యములో జీవకణములు ఉంటాయి. మగవాడి వీర్యములో ఉత్పత్తి అయిన జీవకణములు స్త్రీనుండి విడుదలఅయిన అండముతో కలిసి పిండముగా మారుతుంది తొమ్మిది నెలలు శిశువుగా తయారవుతుంది. అంటే అన్నము నుండి ప్రాణులు జన్మిస్తాయి. ఈ అన్నము (ఆహారము) ఎలా వచ్చింది? మనకు పంటలు పండటం వలన వస్తుంది. పంటలు ఎలా పండుతాయి? వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. వర్షములు ఎలా కురుస్తాయి? వర్షములు యజ్ఞములు వలన కురుస్తున్నాయి. దీని గురించి మనుస్మృతిలో ఇలా చెప్పబడింది. “మనం హోమంలో వేసే ఓషధులు ధూమంగా మారి పైకి లేచి ఆకాశంలో ఉన్న మేఘములను తాకి వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం వలన అన్నం లభ్యం అవుతుంది. అన్నం వలన జీవులు పుడుతున్నాయి." ఇక్కడ యజ్ఞము అంటే హోమము, నిత్య అగ్నిహోత్రము. ఎక్కడో ఒక చోట యజ్ఞ చేయడం కాదు. ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో హోమాగ్ని వెలిగేది. ప్రతి ఇంట్లో ఉన్న అగ్నిలో వేసే ఓషధుల వలన రేగిన ధూమము ఆకాశంలోకి చేరి మనకు వర్షాలు కురిపించేవి. (ఇప్పుడు ఫాక్టరీల పొగ చేరి కాలుష్యం పెరుగుతూ ఉంది. వర్షాలను అడ్డుకుంటూ ఉంది.) ఈ ప్రక్రియ యజుర్వేదంలో కూడా చెప్పబడింది. కాబట్టి వేదాలలో చెప్పబడినట్టు ప్రతిరోజూ దేవతలను ఆహ్వానించడానికి హెమం చేస్తూ, ఓషధులను అగ్నిలో వేస్తే అవి ధూమంగా మారి మేఘాలను చేరి వర్షాలను కురిపిస్తే, వాటి వలన ఆహారం లభిస్తే, అది తిని సృష్టి అభివృద్ధి చెందితే, ఆ పుట్టినవాళ్లు మరలా హెూమాలు చేస్తారు. ఇదీ ఆహార సైకిల్. ఈ హెూమములలో పరమాత్మ ఉన్నాడు. ఈ సైకిల్ మొత్తం సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అందుకే విష్ణువును యజ్ఞస్వరూపుడు అన్నారు. హోమం చేయడం, ఆ హోమంలో ఓషధులు వేయడం కూడా పరమాత్మను పూజించడమే. అగ్నిని హవ్యవాహనుడు అన్నారు. మనం అగ్నిలో వేసే ఓషధులు ధూమ రూపంలో పర్జన్యుడికి అందుతాయి. దానికి ప్రతిగా ఆయన వర్షాలు కురిపిస్తాడు. అంటే మనం వరుణ దేవుడిని పూజిస్తే మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి కానీ మేఘమధనం వలన కాదు. సూర్యుడిని సూర్యనారాయణుడు అన్నారు అంటే సూర్యుడు కూడా నారాయణ స్వరూపము. ఇక్కడ అగ్నితో చేసే హెూమం అంటే యజ్ఞం కూడా నారాయణ స్వరూపము. ఇప్పుడు హెూమాలు లేవు. యజ్ఞాలు లేవు. అందుకే అతి వృష్టి అనావృష్టి. మేఘాలను అదుపులో ఉంచే హెూమాలను మనం చేయడంలేదు. అక్కడక్కడా చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం వర్షపాతం ఉంది.

దీనినే ప్రకృతి ధర్మము, ఆహార చక్రం అని అంటారు. ధర్మము అంటే సమతుల్యము పాటించడం. అన్నిటినీ ధరించి ఉన్నది ధర్మము. ఏది ఎలా ఉండాలో నిర్దేశించేది ధర్మము. ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. అది ప్రకృతి ధర్మము. మనం చేసే కర్మలు కూడా ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. కానీ ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేవిగా ఉండకూడదు. ఉదాహరణకు జీవకోటి జీవించాలి అంటే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కావాలి. ప్రాణవాయువు పీల్చుకుంటేనే మనం జీవించగలుగుతాము. ఆ పీల్చుకున్న ప్రాణవాయువు మరలా కార్టన్డయాక్సైడ్ గా మారి బయటకు వస్తుంది. అది ఏమవుతుంది. ఎవరు పీల్చుకోవాలి. చెట్లు, చెట్లకు ఉన్న పచ్చటి ఆకులు పీల్చుకుంటాయి. ఆ చెట్లు, చెట్ల ఆకులు మరలా మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకుంటాము. ఇది ఒక సైకిల్. ప్రకృతి ధర్మము. ఈ ధర్మాన్ని మనం కూడా కాపాడాలి. కాని మనం ఏం చేస్తున్నాము చెట్లు అడవులు అన్నీ నరికేసి ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము. అందుకే ప్రకృతిని మనం కాపాడితే. ప్రకృతి మనలను కాపాడుతుంది అనే నినాదం వచ్చింది.

కాబట్టి మనం సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా బతకాలంటే మనకు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉండాలి. ఇదీ ప్రకృతి ధర్మము. అలాగే మనకు ఆహారం కావాలంటే వర్షము, వర్షానికి మేఘాలు, మేఘాలు కావాలంటే యజ్ఞములు, ఆ యజ్ఞములు వేదాలలో చెప్పబడ్డాయి. ఆ వేదములే పరమాత్మ స్వరూపాలు. కాబట్టి మనం ప్రకృతి సమతుల్యం పాటించాలి. అదే యజ్ఞము. ఆ యజ్ఞం ఈశ్వర స్వరూపము. యజ్ఞం చేయడం ఈశ్వరుని ఆరాదించడమే. యజ్ఞము అంటే ప్రకృతిని పరిరక్షించడం, ప్రకృతి సమతుల్యం పాటించడం. కాబట్టి ఈ ప్రకృతిలో అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా సమతుల్యం దెబ్బతింటుంది అని గ్రహించాలి.

మనం చేసే కర్మలు వేదవిహితంగా ఉండాలి. వేదము అంటే ఏమిటి? తెలుసుకోతగినది. తెలుసుకోవలసినది. వేదము ఏదో ఒక ఋషి తాను అనుకున్నది చెప్పినది కాదు. ఋషులు ప్రకృతిని పరిశీలించి, వాటికి తమ అనుభవాలను జోడించి, ధర్మాలను అంటే మానవులు ఆచరించవలసిన కర్మలను నిర్దేశించారు. వాటినే వేదములు అని అన్నారు. ఆ వేదములలో చెప్పబడిన విషయములను ఆచరించడమే ప్రతి వాడి కర్తవ్యము. వేదవిహితములైన కర్మలు చేస్తే పరమాత్మను ఆరాధించినట్టే. " తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్" అంటే ఈ చరాచర జగత్తు అంతటా తానే అయి ఉన్న బ్రహ్మ, మనం చేసే యజ్ఞములలో అంటే వేదవిహితమైన కర్మలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతి మంచి కర్మా ఒక యజ్ఞమే. ఆ కర్మలో దైవం ఉన్నాడు. పనియే దైవము. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. కాబట్టి మనం వేద విహిత కర్మలే చేయాలి. ప్రకృతికి కానీ, సాటి ప్రాణికోటికి హాని కలిగించే కర్మలు చేయకూడదు. ప్రకృతి సమతుల్యాన్ని మనం పాటిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుంది.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P166
 🦚 జ్ఞాన ప్రసూనాలు 🚩
12/10/2025

1) ఎల్లప్పుడూ భగవంతుడి మీదనే మనస్సును నిలుపుకోవాలి. మొదట కొంత శ్రమ చేయవలసి ఉంటుంది.
తర్వాత మనసుకు భగవత్ ధ్యానం,స్మరణ అలవాటు అయేకొద్ది నీ ప్రయత్నం తగ్గి నీ మనసే నిన్ను అటువైపు లాగుకొని వెళ్తుంది.

2) ఈ ప్రపంచంలో ఎవరికైనాసరే తొంభైతొమ్మిది మంచి పనులు చేసి, ఒక్క చెడు పని చేస్తే చాలు; ఆ వ్యక్తి చేసిన మేలునంతా మరచి పోయి ఆ ఒక్క కీడునే గుర్తుంచుకుంటాడు.
కాని అదే భగవంతుడి విషయం ఇందుకు పూర్తిగా భిన్నం.
తొంభై తొమ్మిదిసార్లు పాపకృత్యాలు చేసి ఒక్కసారి భగవంతుడికి ఇష్టమైన మంచి పని చేస్తే చాలు -నీ దుష్ప్రవర్తన నంతటిని ఆయన క్షమిస్తాడు.
సామాన్యులు చూపించే ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్య యింతటి వ్యత్యాసం ఉంది.

3) ఎండు కట్టెలను చిదుగులను పోగుచేసి కష్టపడి ఎవడైనా మంట రాజేస్తే దాని సెగతో అనేకులు చలికాచుకొంటారు.
అలాగే తీవ్ర జపతపాలను గావించి ఈశ్వర సాక్షాత్కారం పొందిన మహనీయుల సాంగత్యం చెయ్యటంచేతా వారి సదుపదేశాలను అనుసరించటంచేతా అనేకులు తమ మనస్సును భగవంతుడిమీద లగ్నం చేసుకోగలరు.

4) ఒక్క “నేను“ నుంచే అన్ని నేనులూ పుట్టుకొచ్చాయి. కాబట్టి అన్ని నేనులకు "నేను" అనేది ఇంటి పేరు.

5) ఆధ్యాత్మిక సాధనల్లో తేడాలుంటాయిగాని 'ఆత్మానుభవం' లో తేడాలుండవు.
 246వ భాగం 
🕉️అష్టావక్ర గీత🕉️ 
అధ్యాయము 18 
శ్లోకము 34

శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం|
ఆత్మానం తం న జానన్తి 
తత్రాభ్యాసపరా జనాః||

అనేక సాధనలకు అభ్యాసాలకు అంకితమైన జనులు శుద్ధము ,జ్ఞాన స్వరూపము ,ప్రియమూ,పూర్ణము, ప్రపంచాతీతం, నిష్కలంకము అయిన ఆత్మ తత్వానుభూతిని పొందజాలరు.

ఈ శ్లోకాలను చూసి సాధన తో అవసరమే లేదని పొరపడకూడదు. సాధన చెయ్యకుండా సంసిద్ధత లేకుండా ఉన్న వారిని గూర్చే మహర్షి "మూఢ" అన్న పదాన్ని ప్రయోగించారు. అయితే సాధన మార్గమని ,ఆత్మా అనుభవం గమ్మమని సాధకుడు స్పష్టంగా తెలుసుకోవాలి .తరచుగా చాలామంది మార్గాన్నే లక్ష్యంగా పొరపడుతూ ఉంటారు .సామాన్య జీవితంలో ఇది సహజంగా సంభవిస్తుంది .సంపద సంతోషమయమైన జీవితానికి అవసరమైనదే ,అయితే బుద్ధిహీనులు మార్గాన్నే లక్ష్యంగా భావించే సంపదను సంపాదించడంలోనే నిత్యము ఆసక్తులై వారి లోబత్వముతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

ఆధ్యాత్మిక జీవితము పేరుతో మూఢత్వముతో అట్టి దుర్భరమైన జీవితాన్ని జీవించకు .భగవత్ భక్తి, సమాజ సేవ,శాస్త్ర అధ్యయనము,శ్రవనము, ధ్యానము నిధిథ్యాసన కూడా అన్ని మార్గాలే .అహంకారం చూపించే జాగ్రత్ప్రపంచ స్వప్నాన్ని దూరము చేసి మన సహజ స్వరూపాన్ని చేరుకోవటానికి ఇవన్నీ ప్రయోజన కారులే. ధ్యానములో ఏకాగ్రతను ప్రగతి సాధించిన సాధకులు అందరికీ ఈ హెచ్చరిక సముచితమైనది .మరి ఎంతో అవసరమైనది కూడా .ఒక మహా ఋషికి అంతటి మహనీయుడైన శిష్యుడు జనకునికి మధ్య జరిగిన సంవాదమే అష్టావక్ర గీత.కాబట్టే ఇందులోని వాదం అంతా ఇంతటి ఉన్నత స్థాయిలో ఉంటుంది .సాధన ప్రధమ దశలో ఉన్న సాధకులు ఇక్కడ పొరబడరాదు.🙏🙏🙏  
 🙏🕉️ హరిఃఓం  🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(241వ రోజు):--
       ఈ ప్రపంచపర్యటనలో 11 విశ్వ విద్యాలయాలు దర్శించాను ; 8 దేశాల యువవిద్యార్థులతో సంభా షించాను. 21 ఉపన్యాసపరంపరలు చేశాను. వాటిలో భగవద్గీత సందేశా న్ని వివరించటం, కొన్ని కేంద్రాల్లో ఒక ఉపనిషత్తును తీసుకొని పూర్తిగా అధ్యయనంచేయటం జరిగింది..
       ప్రపంచమంతటా జరిపిన ఈ సేవాకార్యక్రమం ఇంతగాజయప్రదo కావటానికి నిజాయితీతోనూ, దీక్ష తోనూ పనిచేసిన వందలాది స్వచ్చం ద సేవకులూ, పోషకులూ, దయామ యులూ, విశ్వవిద్యాలయ అధికారు లూ, ఆయావిభాగాల ఆచార్యులూ కారణమని చెప్పాలి. వారందరికీ నేను కృతజ్ఞుడిని. మనకు ఈనాడు ప్రపంచమంతటా ఉన్న ఆలోచనా పరులనుంచి ఆలంబన లభిస్తోంద ని మన చిన్మయకుటుంబం గ్రహిం చాలి. దీనంతటికీ మనం సర్వేశ్వరు నికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ; ఆయన చూపినమార్గంలో దీక్షాబద్దు లమై పయనించడంకంటే కృతజ్ఞత తెలియజేయడానికి మరొక ఉత్తమ సాధనం లేదు. ఆయన నెరవేర్చాల్సి న కార్యాలకు ఇంకాఇంకా సమర్థ వంతంగా ఉపయోగపడేలా మనను మంచి పనిముట్లుగా తీర్చిదిద్దాలని ఆయనను ప్రార్థిద్దాం. 
         భారతదేశానికి బయట నిర్వ హించిన మొదటి ఆధ్యాత్మికశిబిరం 1973లో కాలిఫోర్నియా రాష్ట్ర కళా శాల, సోనోమాలో జరిగింది. భారత దేశంలో జరిపిన అటువంటి శిబిరా ల గురించి తెలిసిన అమెరికన్లు "ఇక్కడ కూడా ఎందుకు చేయకూడ దు?" అని అడిగారు. ఒక గురువుతో నిజమైన ఆశ్రమవాతావరణంలో కొద్దికాలంపాటైనా జీవించగలిగితే చాలా బాగుంటుందని వారికనిపిం చింది. వారి ఉద్దేశం ఈ శిబిరం ద్వారా నిజమైంది. శిబిరం సమాప్త మయ్యాక స్వామీజీ నిర్వాహకులకు వ్రాసిన జాబులో "ఈకార్యక్రమపు అంతరార్థం మీకుభవిష్యత్తులో బోధ పడుతుంది" అని వ్రాశారు. 
        1975లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగి న సర్వమత సమ్మేళనానికి స్వామీజీ సరిగ్గా కార్యక్రమం మొదలయ్యే సమ యానికి నేరుగా విమానాశ్రయం నుంచి వెళ్లగలిగారు. ఈ సమ్మేళ నాన్ని సూఫీ మతపు మహాత్ముడైన పీర్ విలాయత్ ఖాన్ నిర్వహించారు. సదస్సులో అడిగిన ప్రశ్నలన్నిటికీ, లైంగికవిషయాలతో సహా, స్వామీజీ ఇచ్చిన తెలివైన సమాధానాలు చాలామంది యువశ్రోతలను కూడా మెప్పించాయి. వారిలో 'గురువు' కోసం వెతికే ఒకగుంపు దక్షిణదిశలో 40 మైళ్ళ దూరంలోఉన్న పాలోఆల్టో లోని స్టాన్ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో ఆనాటి సాయంకాలం స్వామీజీ ప్రారంభించనున్న ఉపన్యాస పరం పర ప్రారంభోపన్యాసానికి కూడా హాజరయ్యారు. 
    ఉపన్యాసం పూర్తయ్యాక, ఆయన పద్దతిని వివరించమని వారడిగిన పుడు, తన గంభీరమైన వైఖరిని ఆయన స్పష్టంచేశారు. "నాపద్ధతి ఏదో చెప్పమంటారా? ముక్కుమీద నిలబడి ధ్యానంచేయటమే నా పద్ధతి. కాని, దీన్ని ఒంటరిగా ఉన్న పుడే అభ్యసిస్తాన్నేను." చిలిపిగా నవ్వి, వెంటనే గంభీరస్వరంతో అన్నారాయన, "ఆధ్యాత్మికతకు దగ్గరిదారి కోసమో, క్షణికమైన మాన సికోల్లాసానికో మీరు ప్రయత్నిస్తుంటే ఇక్కడికి రావడంలో తప్పుచేశారు. ఈ తప్పు మళ్లీ చేయవద్దు : రేపు రావద్దు" ఈ సందేశం వారందరికీ అర్థమైంది. వారంరోజులపాటు సాయంకాలాల్లో భగవద్గీత 12 వ అధ్యాయం, ఉదయం కేనోపనిషత్తు పై ఆయన చేసిన ఉపన్యాసాలన్నిటి కీ వారంతా నియమం తప్పకుండా హాజరయ్యారు. 
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺