Tuesday, October 15, 2024

 *మనది కానిది మనకెందుకు* (సంయుక్త అక్షరాలు లేని కథ)
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు . వాడు రోజూ అడవికి పోయి ఆ రోజుకు సరిపడా కట్టెలు కొట్టుకోని అమ్మేవాడు. ఎక్కువగా ఆశ పడేవాడు గాదు. ఉన్న దానిలో తిని, హాయిగా కాలం గడిపేవాడు.

ఒక రోజు వాడు అడవిలో పోతావుంటే, దారిలో ఒక చోట ఒక బంగారు వరహా కనబడింది. దానిని తీసుకొని చుట్టూ చూసినాడు.. ఎవరూ కనబళ్ళేదు.

కొంచెం దూరం పోయేసరికి మరో వరహా కనబడింది వాడికి! ఇంకొంచెం దూరం పోయేసరికి ఇంకో వరహా! అలా ఒకదాని తరువాత ఇంకొకటి!!

కాసేపటికి వాడి చేతులు రెండూ వరహాలతో నిండిపోయినాయి. కానీ వరహాలు మటుకు ఇంకా కనబడతానే ఉన్నాయి.

"పాపం! ఎవరో పారేసుకున్నట్టున్నారు. వీటిని తీసుకు పోయి రాజభటులకు చూపిద్దాం. వాళ్ళొచ్చి, మిగతావి కూడా వెతికి పట్టుకొని, సొంతదారులు ఎవరో కనుక్కొని అప్పజెబుతారు" అనుకుంటా తిరిగి వెనక్కు బైలుదేరినాడు రాజయ్య.

రాజయ్య ఇంటి పక్కనే ధనయ్య అని ఒకడు వున్నాడు. ఊరిలో వానంత ధనవంతుడు ఎవడూ వుండడు. వాడు పెద్ద ఆశపోతు. ఎంత సంపాదించినా "ఇంకా కావాల,ఇంకా" అని అల్లాడి పోతా వుంటాడు.

ఆరోజున వాడు ఇంటి బైట కూచోని, ఎప్పుడూ గాడిద మీద కట్టెలు వేసుకోని వచ్చే రాజయ్య వుత్త చేతులు వూపుకుంటా రావడం చూసినాడు. "పాపం.. ఈ రోజు కట్టెలు దొరకలేదేమో" అనుకున్నాడు- గాని రాజయ్య మొగం ఏదో గాబరాగా వుంది.

అది చూసి, 'ఏదో జరిగింది' అనుకోని, దగ్గరికి పోయి "ఏం రాజయ్యా, కట్టెలు దొరకలేదా, ఎందుకలా కంగారు పడతా వున్నావు?" అన్నాడు.

రాజయ్య వానికి జరిగిందంతా చెప్పినాడు.

"నిజమా... ఇంకా వరహాలు వున్నాయా, అక్కడ?" అన్నాడు ధనయ్య అశగా.

'వున్నాయం'టూ తలూపినాడు రాజయ్య.

"సరే ఒక పని చెయ్యి. మన పల్లెలో రాజభటులు ఎక్కడ వుంటారు?! నేనే సొయంగా అవన్నీ ఏరుకోని పోయి, మన నగరాన్ని పాలించే రాజుకు అప్పజెబుతాలే. నువ్వు హాయిగా నీపని చూసుకో!"అని నమ్మకంగా చెప్పేసినాడు ధనయ్య.

రాజయ్య చానా అమాయకుడు. ఎవురిని పడితే వాళ్లని నమ్ముతాడంతే. అందుకని ఆ ధనయ్య మాటలు నమ్మేసి, తన చేతిలోని వరహాలు గూడా వానికే ఇచ్చి, "ఇవి గూడా తీసుకోని పోయి రాజుకు అప్పజెప్పు ధనయ్యా, ఒకని సొమ్ము మనకెందుకు?!" అనేసినాడు.

ధనయ్య లోపల్లోపల సంబరంగా నవ్వుకుంటా అవి తీసుకున్నాడు. వెంటనే బిరబిరా ఇంటిలోనికి పోయి, రెండు గోనె సంచులు గాడిదమీద వేసుకోని, రాజయ్య చెప్పిన వైపు వురుకులు పరుగులు మీద పోయినాడు. రాజయ్య చెప్పిన చోటుకి చేరుకునే సరికి బంగారు వరహాలు కనబన్నాయి. సంబరంతో ఎగిరి గంతులు వేసినాడు. గాడిదను వేగంగా తోలుకుంటా పోతా ఒక్కొక్క వరహా ఏరుకో సాగినాడు.

నెమ్మదిగా ఒక గోనెసంచీ నిండిపోయింది. వరహాలు చానా బరువు వుంటాయి గదా, దాంతో గాడిద మోయలేకపోతోంది. ఐనా ధనయ్య ఆశ అగడం లేదు. ఇంకా దారి వెంబడి వరహాలు కనబతానే వున్నాయి. సాయంకాలానికి రెండు సంచులూ నిండిపోయినాయి.

ఇంక చీకటి పడతా వుంది. ఆ అడవిలో దొంగలు చానా ఎక్కువ. వాళ్ల చేతికి చిక్కితే కష్టమే. అందుకని ధనయ్య మెల్లగా వెనక్కి తిరిగి ఇంటికి బైలుదేరినాడు. గాడిద ఆ బరువును మోయలేక, అడుగు తీసి అడుగు వేయసాగింది. ఇలాగే నత్తలాగా నెమ్మదిగా పోయారంటే చీకటి పడి, దొంగలకు దొరికిపోవడం ఖాయం!

దాంతో ఎదారిపడిన ధనయ్య ఒక మూటని తనే ఎత్తుకుని పోదామని చూసినాడు. కానీ పని చేయక చానా రోజులైంది కదా, అందుకని నాలుగు అడుగులు వేసేసరికే చుక్కలు కనబన్నాయి. దాంతో తిరిగి మూటలు రెండూ గాడిద వీపుమీదే వేసినాడు. "ఏం చేద్దామా?" అని ఆలోచించ సాగినాడు.

ఊరికి తొందరగా చేరుకొనేకి ఒక అడ్డదారి వుంది. ఆ దారిన పోతే సగం దూరం తగ్గుతుంది. కానీ ఆ తోవలో చిన్న వాగు ఒకటి అడ్డం వుంది. వాగులో ఎక్కడ ఏ గుంత వుంటాదో, ఎక్కడ ఏ పెద్ద రాయి తగులుతాదో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరూ అటువైపు రారు.

కానీ ఆశపోతు ధనయ్య ఆ వాగువైపే బైలు దేరినాడు. కాసేపటికి అక్కడికి చేరుకోని నెమ్మదిగా గాడిదతో సహా వాగులోకి దిగినాడు. నీళ్ళు వేగంగా పారతా వున్నాయి. గాడిద అప్పటికే బాగా అలసి పోయివుంది. దానికి చేతగావడం లేదు. అడుగులు తడబడతా వున్నాయి. అంతలో దాని కాలు చిన్న గోతిలో పడింది. అంతే! దభీమని కింద పడిపోయింది. దాని వీపు మీదున్న రెండు మూటలూ జారి పోయినాయి. వాటిలోని నాణాలన్నీ నీళ్ళలో పడి చెల్లాచెదురై పోయినాయి. ధనయ్య అదిరిపన్నాడు. నీళ్ళల్లో కిందా మీదా పడతా వెదకసాగినాడు.

కొట్టుకు పోయినవి కొట్టుకు పోగా అక్కడొకటి ఇక్కడొకటి దొరకసాగినాయి వరహాలు. వాటిని ఏరుకుంటా వుండగానే వెనుక చప్పుడయింది. తిరిగి చూసినాడు: పెద్ద దొంగలగుంపు- చేతుల్లో కత్తులతో. అదిరిపన్నాడు. "దొరికితే ఇంగేమన్నా వుందా, అంతే సంగతులు!" అనుకొని, ఆ నీళ్ళల్లోనే వేగంగా ముందుకు వురకసాగినాడు. అలా వురుకుతా వుంటే నడుమ ఒక పెద్ద గొయ్యి అడ్డం వచ్చింది. చూసుకోక అందులో కాలు పెట్టినాడు. అంతే కాలు కలుక్కుమనింది. దభీమని పడిపోయినాడు. "అబ్బా!" అంటూ ముక్కుతా మూలుగుతా పైకి లేచినాడు. అంతలో దొంగలు వచ్చి వాన్ని చుట్టుకున్నారు-

"ఏరా మానుంచే తప్పించుకోని పారిపోదామని అనుకుంటున్నావా" అంటా తలా నాలుగు పీకినారు. చేతిలోని బంగారు వరహాలన్నీ గుంజుకున్నారు. వాటితో పాటు ధనయ్య మెడలో గొలుసు, వేళ్ళ వుంగరాలు, చేతి కంకణం, బంగారు మొలతాడు- అన్నీ ఒలుచుకోని పోయినారు.

"అయ్యో! చేతికి చిక్కిన వరహాలూ పాయ, ఒంటిమీదున్న బంగారమూ పాయ!" అని బాధతో లబోదిబోమన్నాడు ధనయ్య.

అయినా వానికి ఆశ చావలా. బుధ్దిరాలా. వుత్త చేతులతో ఇంటికి పోవాలనిపించలా. అక్కడే ఒక చెట్టుచాటున పడుకోని నిదురపోయినాడు.

తరువాతి రోజు పొద్దున్నే- ఇంకా తెలవారక ముందే లేచి, కుంటుకుంటా కుంటుకుంటా మళ్ళీ వరహాలు దొరికిన చోటికి పోయినాడు. ఇంకా అక్కడ దారంతా వరహాలు పడున్నాయి.

"హమ్మయ్య! ఆ పాతవన్నీ పోతే పోయినాయిలే. ఇక్కడ ఇంకా చాలా వున్నాయి. ఈసారి తొందరగా ఏరుకోని పోతాను. చీకటి పడేలోగా ఇంటికి చేరుకుంటాను" అనుకుంటా బిరబిరా ఏరుకోసాగినాడు. నిజానికి ఆ వరహాలన్నీ ఆ వూరి రాజుగారివే. ఆ ముందురోజు వరకూ చుట్టు పక్కల దేశాలనుంచి, సామంతుల నుంచి వసూలు చేసుకున్న కప్పమంతా ఒక పెద్ద గుర్రంబండిలో వేసుకోని రాజుగారి ఖజానాకు తీసుకోని పోతా ఉండినారు సైనికులు . అయితే ఆ బండికింద చిన్న బొక్క పడింది. దారి వెంబడంతా ఒక్కొక్కటే వరహా జారి పడిపోయింది. సైనికులు దాన్ని గమనించుకోలేదు. తీరా పోయినాక తెరిచి చూస్తే ఇంకేముంది?! లోపల సగానికి సగం ఖాళీ అయిపోయింది.

దాంతో సైనికులు అదిరిపడి వెదుకుతా పోతే, దారి వెంబడి మొత్తం బంగారు వరహాలు కనబన్నాయి. దాంతో వాళ్ళు అటు వైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా రాసాగినారు. ధనయ్యకు ఇది తెలీదు గదా, అందుకని వీడు ఇటువైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా పోసాగినాడు. కొంతసేపు అయ్యేసరికి వాళ్ళు, వీడు ఒకరికొకరు ఎదురు పడినారు!

సైనికులు అదిరిపడి "ఏరా, దొంగ వెధవా! రాజుగారి వరహలే కాజేసి పోదామని అనుకుంటా వున్నావా?" అంటూ వాన్ని పట్టేసుకున్నారు.

వాడు నాకేమీ తెలీదంటూ లబోదిబోమని మొత్తుకోసాగినాడు. "మిగిలిన వరహాలు ఎక్కడున్నాయో చెప్పు!" అంటూ వాళ్ళు వాన్ని నున్నగా, తన్నిన చోట తన్నకుండా తన్నినారు. దాంతో వాడు వాళ్లకు జరిగిందంతా చెప్పేసినాడు.

సైనికులు కోపంగా "పోగొట్టుకుని పోయింది ఏదైనా దొరికితే దాన్ని రాజుకి అప్పజెప్పాల గానీ, ఇలా మట్టసంగా మూడో కంటికి తెలీకుండా నున్నగా నొక్కేయడమేనా. ఇంక నీకూ, ఆ దొంగలకూ తేడా ఏముంది? నీవల్ల రాజు సంపద అంతా దొంగల పాలు అయింది. మరియాదగా తిరిగి ఆ రెండు మూటల బంగారు ఖజానాకు కడతావా, లేక జీవితాంతం కారాగారంలో వేసి బంధించమంటావా?!" అన్నారు.

ఆ మాటలకు వాడు అదిరిపన్నాడు. కాళ్ళా వేళ్ళా పన్నాడు. అయినా వాళ్ళు వాన్ని వదలలేదు. దాంతో ఇంటికొచ్చి, ఎప్పుటినుంచో తినీ-తినక దాచి పెట్టుకున్న సొమ్మంతా తీసి వాళ్ళ చేతిలో పెట్టినాడు ధనయ్య. దాంతో ఆ సైనికులు అవన్నీ తీసుకోని వాన్ని వదిలేసినారు. "ఆశకు పోతే ఆఖరికి వున్నవి గూడా పోయినాయే!" అని ధనయ్య లబలబలాన్నాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

Before & after damage of Hindu god on temple

 


****_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం.

 *_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం. ఈ చరిత్రలో ఎవరిని తీసుకున్నా కష్టాలు లేని వారెవ్వరూ లేరు.!_*

*_సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు, ఐన్ స్టీన్ నుండి అబ్దుల్ కలాం వరకు అందరూ ఎన్నో కష్టాలు పడ్డవారే.! మరి వారందరికీ కష్టాలు వుండి వుంటే వారు ఎప్పుడూ బాధలో ఉన్నట్లు కనబడరెందుకు.?!_*

*_కష్టాలు వేరు, బాధలు వేరా.? కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఎంటి.? కష్టాలు ఉన్నా బాధ లేకుండా ఉండవచ్చా.?_*

*_జీవితంలో ఊహించనిది, అనుకోనిది జరిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని కష్టంగా భావిస్తూ వుంటాం.!_*

*_ఈ కష్టాలకు అనేక కారణాలు ఉండవచ్చు.! వాటిలో ఎన్నో మన చేతుల్లో ఉండవచ్చు, వుండకపోవచ్చు.! అది అత్యంత సహజం... అన్నీ మన చేతుల్లో లేకపోవడం.!_*

*_కానీ బాగా గమనిస్తే ఒకే కష్టం ఒక వ్యక్తికి వస్తే చాలా బాధపడుతూ కనబడితే, అదే కష్టం ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు మామూలుగా ఏ బాధ లేనట్లు కనబడుతూ వుంటాడు.!_* 

*_అంటే మనకు ఇక్కడ అర్థం అయ్యే విషయం ఏమిటంటే బాధ అన్నది కష్టాలనుంచి కాకుండా ఇంకెక్కడినుంచో వస్తోంది.! అదే మన మనస్సు.! అంటే బాధ అన్నది మనస్సు వల్ల, మనస్సు నుంచి సృష్టించబడినదే కానీ నిజంగా బాధ అన్నది లేదు.!_* 

*_అంటే మనం అనుకుంటే బాధ లేకుండా కూడా ఉండవచ్చు.! కాబట్టి కష్టాలు అన్నవి మన చేతుల్లో లేని సహజ ప్రక్రియ అయితే బాధ అన్నది మన చేతుల్లోనే వున్న అసహజ ప్రక్రియ.!_* 

*_మనం అనుకుంటే సర్వ వేళలా బాధలులేకుండా ఉండవచ్చు కూడా.!_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🫐🏵️🫐 🪷🙇‍♂️🪷 🫐🏵️🫐

పాదాభివందనం ఎందుకు చేయాలి....!! 🙏పాదాభివందనం వలన… ప్రయోజనం ఏమిటి🪷

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

🙏 పాదాభివందనం ఎందుకు చేయాలి....!!

🙏పాదాభివందనం వలన…
             ప్రయోజనం ఏమిటి🪷
🌺🌺☘☘🌺🌺☘☘🌺🌺☘☘   

🌺శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 

🌺అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷

☘భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 

🌺అయితే కొందరు, 
అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.

☘పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.

🌺పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 
అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.

☘సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!

🌺పెద్దవారి పాదాలను తాకడానికి 
మన నడుము వంచి,  
మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  

☘అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 
అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 

☘ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 
ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.

🌺ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.

☘పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 

🌺"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 
అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 
చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,
ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి
పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

🌺అలాగే  ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,
వారికి పాదాభివందనం  చేసి,
పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

☘🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹

🌺పెళ్లయిన జంటని :
అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.

☘పెళ్లి అయిన ఆడవారిని :
దీర్ఘసుమంగళీభవ

🌺చిన్న పిల్లల్ని :
🙌చిరంజీవ - చిరంజీవ

☘చదువుకుంటున్నవారిని :
🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.

🌺పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :
🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.

☘పెళ్లికావసలసిన వాళ్ళని :
🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.

🌺ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :
🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.

☘ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు 
ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే 

🌺🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌

☘(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)
ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!

🌺(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)
మన సంస్కృతిని మర్చిపోకూడదు...

🙏 సర్వేజనాః సుఖినో భవంతు🙏

****హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

 తెలుగు రాష్ట్రాల్లో  73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.

భారత్ టుడే సర్వేలో వెల్లడి

అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు :-

1. అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.

2. అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో  వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.

3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని  బోధనలు చేస్తారు...  వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.

4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద  వేదాంతుల్లాగా. 

5. వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.

6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు. మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.

7. క్రైస్తవుల ఇంటికి ప్రార్దనకు వెళ్లి కేకులు, బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.

8. హిందువులను, హిందు గ్రంధాలను, హిందూ దేవుళ్లను దూషించేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.

9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.

10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా: కృష్టుడికి 16 వేలమంది భార్యలు).

11. స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.

13). ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

ఈ సెక్యులర్ హిందువులు 
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి 

గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో. మేలుకోండి హిందువులారా! లేకపోతే కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే దుస్థితి వస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ తమ పిల్లలను సైతం హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించేలా పెంచాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు 🙏

****ప్రస్తుత పరిస్థితి* ------------------------------------------------ *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...

 *ప్రస్తుత  పరిస్థితి*
------------------------------------------------
 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!! కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగ బెడుతుండంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి *పెళ్లి కాని ప్రసాదు* లు తాళి బొట్టు పట్టుకొని అమ్మాయి కోసం వెంపర్లాడం తో  ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి  ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవోగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సంప్రదాయ వాదులు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్టు కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో  ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి  చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెద్దవాడ* అని  తెలుసుకోవడానికి ఆర్నెళ్ళు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టీ, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే  పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కా రణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *పోరన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో  తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తలా ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరాళ్ళు ఎక్కువవుతున్నాయి...   పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టీ, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్    పేరంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లి దండ్రులు కూడా అటు అల్లున్ని పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి  పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటు దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదిరి చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాకా తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి  కళ్ళ   వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ -  ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం అవుతుంది..
మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!
భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...
అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.
ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే  మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు!  అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కొల్పోతున్నాననే అభద్రత భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె  తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!
  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి!  ఇది వివాహా వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది!  తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళమే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!!  అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏
ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..
 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ  ఆనాటి అత్తలు వేరు ఈ  నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు  బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు!   ఇప్పుడు కట్నా కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకొనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవలు ఆత్మీయత మసి బారి పోయింది!
కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి,  లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్పా అత్తా మామలను ఆదరించాలని అనుకోక  పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే   ఆలస్యంగా నిద్ర లేచిన  కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు  లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తె *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కొడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...
పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 
అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  
వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం కోడళ్ళ లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది...
 *పెళ్ళిళ్లలో వింత పోకడలు*
1. *కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్లామని కూడా గుర్తుండదు)*
2. *ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని, చెమట కంపుతో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థరాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం... రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే.* 
3. *ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు  అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం)*
4. *పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి. ఈ మధ్య చిన్న పిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా  భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.*
5. *పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.*
6. *Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి  ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది. (photographer bill కూడా లక్షల రూపాయలు)*
7. *పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధా చేయడం*.
8. *భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్ (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)*
9. *పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం ఆ (photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.*
10. *పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామాన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.*
11. *DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు.*
12. *కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).*
13. *ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని , పనికిమాలిన ఈవెంట్స్.*
14. *మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు)*
15. *ఒక పెగ్గు కెపాసిటీ  వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.*
16. *తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం రిపీట్.*
17. *ఇంకా హనీమూన్ అనే  కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ (ఇది కూడా లక్షల్లో)*
18. *ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.*
19. *అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.*
*పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు*.
*ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని, ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి. అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరిని ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం.*
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
*🧘🏻‍♂️ఈ పోస్ట్ చదివి కొంతమందన్నా మారుతారని ఆశిద్దాం🧘🏻*
😞🥺😞 😱🙇‍♂️😱 😞🥺😞
సేకరణ
 *నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు*✊✊

*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*

రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ
నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.

రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,
దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.
కానీ,
ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి? 

నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.
కానీ,
భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.
కాని,
మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
*రైతు తినేది దొంగ సొమ్మా?*
 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.

*విద్యలో రాజకీయం 100%*
*రాజకీయంలో విద్య 00%*
ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.
ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.

దేశంలోని ప్రతిభావంతులేమో
వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని  ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు 
వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*
అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు.

దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
 తండ్రి ఆలోచన ☘☘  ప్రగతికి పునాది ☘☘

☘☘ "ఓయ్..రూమ్ లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా..?" కరకుగా ఉన్న నాన్న గొంతు విని..స్విచ్చాఫ్ చేసి వచ్చా.☘☘

☘"డ్రాయింగ్ రూమ్ లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి..అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా..?" మళ్ళీ అదే గొంతు.☘

☘☘ విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పై ఉన్న ఫైల్ తీసుకుని..బైటకి నడిచా..☘☘

☘☘ఎందుకిలా అవుతున్నాడు నాన్న..ప్రతిదానికి కోప్పడటం,చిరాకు.,అసహనం..ఇంత చిన్న విషయాలక్కూడా పెద్దగా అరవడం.తానే ఫ్యాన్,టీవీ స్విచ్చాఫ్ చేయొచ్చుగా..నన్నే పురామయించడం దేనికి..చాదస్తం ఎక్కువౌతుంది ఈమధ్య.☘☘

☘☘ఇక నా వల్ల కాదు..ఈ అసహనం భరించడం..ఎలా అయినా ఇల్లు వదిలి పోవాల్సిందే..ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే.☘☘

☘☘ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది..లేటౌతున్నా అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా తిట్టి పోస్తున్నాడు..☘☘

☘☘దేవుడా..ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు..ఎలాగోలా ఇంటి నుండి బైటపడాలి.లేపోతే ఇంకా నాన్న విసుగు,కోపం,చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే..పిచ్చెక్కక తప్పదు..మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు.☘☘

☘☘అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న.సంపాదన లేదు.,ఇల్లు వదిలి బైటకు పోలేనని అలుసు.
ఎదడిగినా..ఇప్పుడొద్దు,తర్వాత చూద్దాం..నాన్చడం తప్ప ఇంకేం తెలీదు.ఏదో ఈరోజు ఓ 500 ఇచ్చాడు ఇంటర్వ్యూ అని.☘☘

☘☘బస్ కోసం వెయిట్ చేశా..రావట్లే..ఇక లాభం లేదని ఆటోలో బయల్దేరి..సరైన సమయానికే చేరుకున్నా.☘☘

☘☘పెద్ద భవనం..గేట్ దగ్గర ఎవరూ లేరు అడ్డదిడ్డంగా ఉన్న గేట్ ను దాటి పొందిగ్గా మళ్ళీ చేరవేసా..లోన భవనం వరకు మంచి రహదారి..దారి చుట్టూ పూల మొక్కలు..డీసెంట్ గా ఉంది..మొక్కలకు నీళ్లుపోసే పైపు రహదారిపై పడి నీళ్ళన్ని పోతున్నాయి..మాలి ఎక్కడ చచ్చాడో..చుట్టుపక్కల లేదు..చిరాగ్గా పైపుని తీసి మొక్కల పక్క పెట్టి ముందుకి నడిచా..☘☘

☘☘రిసెప్షన్ లో ఎవరూ లేరు..ఒక బోర్డ్ తప్ప.అందులో 3వ అంతస్తులో ఇంటర్వ్యూ అని రాసుంది.తడిగా ఉన్న బూటుకాళ్ల ప్రింట్స్ చూస్తూ మీదకి వెళ్లబోయి ఆగా..డోర్ మేట్ పక్కనే తిరగేసి పడుంది..ఆప్రయత్నం గా దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడిచి..పై అంతస్థులకి వెళ్ళా.☘☘

☘☘ఇంటర్వ్యూ రూమ్ హడావిడిగా ఉంది.చాలా మంది వచ్చారు..రెండు సెక్షన్లలో కూచున్నారు..ఒక సెక్షన్ ఖాళీ అయింది..రెండో సెక్షన్లో కూర్చున్న నాకు..ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి..చెవిలో జోరీగలా..నాన్న సౌండ్..☘☘

☘☘చిరాగ్గా ఫ్యాన్ల స్విచ్ఛాఫ్ చేసి కూర్చున్నా.☘☘

☘☘ఒక్కొక్కరే బాస్ రూమ్ లోనికెళ్లి అటునుంచి ఆటే వెళ్తున్నారు..ఇంటమందిలో నేను సెలెక్ట్ కావడం కల్ల అని ముందే డిసైడ్ అయిపోయానేమో..టెన్షన్ లేదు..చిరాకు తప్ప.☘☘

☘☘ఇంతలో నా టర్న్ రానే వచ్చింది..లోపల సూట్లలో నలుగురు కూర్చుని లాప్టాప్ లో ఏదో సీరియస్ గా చూసుకుంటున్నారు..☘☘

☘☘నన్ను కూర్చోమని కూడా అసలే..సర్టిఫికెట్స్ ఫైల్ అందించినా తీస్కోలే..ఒకాయన పేరడిగాడు అంతే..ముక్తసరిగా చెప్పా..రెండో ఆయన చెప్పాడు.."యువర్ ఇంటర్వ్యూ ఈస్ ఓవర్..యూ కెన్ గో"☘☘

☘☘కోపం నషాలానికి అంటుతున్న వేళ..మూడోవ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు.."కంగ్రాట్స్..యూ ఆర్ ఇన్..ఇది మీ అపోయింట్మెంట్ ఆర్డర్."
నిష్చేస్తుడైన నేను.. ఆప్రయత్నం గా ఆడిగేసా.."కానీ..మీరు నన్నేమీ అడగలేదు.."☘☘

☘☘నాలుగో వ్యక్తి తనముందున్న లాప్టాప్ నావైపు తిప్పి చూడన్నట్లు సైగ చేసాడు..అందులో ఉన్నది..నేనే..గేట్ ను పొందిగ్గా పెట్టడం నుంచి..పైప్.,డోర్ మాట్.,ఫాన్స్ స్విచ్ ఆఫ్ చేయడం..అన్నీ..సీసీకెమెరా రికార్డింగ్..☘☘

☘☘మొదటి వ్యక్తి చెప్తున్నాడు నెమ్మదిగా "మాకు qualifications తో పాటు మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా కావాలి..ఇవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే.అందులో మీరు నెగ్గారు."☘☘

☘☘ఆనందంతో నోట మాట రాలేదు..☘☘
☘☘బైటకొచ్చాక కాస్త తేరుకున్నా.☘☘

☘☘సడెన్ గా చెళ్లున కొట్టినట్టు ...నాన్న.,తన మాటలు గుర్తొచ్చాయి.అంటే ..నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి ఇలా అంటుండేవాడా..ఎంత అపార్ధం చేసుకున్నా నాన్నా నిన్ను..కళ్ళంట నీళ్లు తిరిగాయి.☘☘

☘☘రాయిలాంటి నన్ను..అందమైన శిల్పంగా మార్చడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి..నొప్పి ఫీల్ అయ్యానే తప్ప..నాలో వచ్చిన అందమైన మార్పు గమనించలేకపోయా.☘☘

☘☘అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి అమృత హృదయురాలుగా మదిలో నిలిస్తే..నాన్న తన ప్రేమని గుండెలో దాచుకుని కరకుగా నా భవిష్యత్తుని షేప్ చేస్తూ..తను మాత్రం నా దృష్టిలో గుండేలేని పాషాణంగానే గుర్తించబడుతున్నాడు.☘

☘☘అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాం..నాన్న ప్రేమ వేరెవరో చెప్తే.. గుర్తుచేస్తే గాని గ్రహించలేం.☘☘

☘☘బాల్యం లో నాన్నప్రేమ అనిర్వచనీయంగా..యవ్వనంలో విలన్ గా,శాడిస్ట్ గా..పోయిన తర్వాత గాని..మనల్ని మలచిన ఒక గైడ్ గా భావించగలమే తప్ప...నిజంగా అర్థం చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించం.☘☘

☘☘తండ్రి లేకపోతే కూతురు వద్ద నైనా తల్లి ఉండగలదు..కానీ తల్లి లేకపోతే తండ్రికి కూతురి వద్ద కూడా ఉండడానికి వీల్లేని దుస్థితి.☘☘

☘☘ఒంటరిగానే ఉండి...పో..వా..లి.☘☘

☘☘చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి..నమస్కారం పెట్టే బదులు..బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకుని అతనిని నొప్పించ కుండా ఉండే 
మహానుభావులందరికీ....హృదయ పూర్వక అభినందనలు....☘☘

☘☘ఒక క్షణం అర్థం చేసుకుంటే ఎనో ఎన్నెనో సమస్యలకి పరిస్కారం కనిపిస్తుంది..☘☘

☘☘అందరు బాగుండాలి అని స్కై ఫౌండేషన్ మనస్పార్తి గా కోరుకుంటుంది...☘☘

☘☘సదా అందరి మంచి కోరే మీ ☘☘

డాక్టర్ వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, 
స్కై ఫౌండేషన్.
☘☘ 9493613555☘☘
☘☘ 9393613555☘☘
 

#ప్రదీప్‌_మెహ్రా 2022 మార్చి 
ఇతని గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. 
ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

స్కూల్‌కు ఏసి బస్‌..
అడిగిన వెంటనే షూస్‌..
కోరిన సీట్‌ రాకపోయినా డొనేషన్‌ సీట్‌..
ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌..

పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి?
కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి ?
కష్టాలను ఎదుర్కొనడమూ, ప్రతికూలతను జయించడమూ జీవితమే" అని ఎప్పుడు తెలుసుకోవాలి?
పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా?

నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి.. మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
ముందు ప్రదీప్‌ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం.

మొన్నటి శనివారం రోజు.
 అర్ధరాత్రి.. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్‌ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. 
అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. 
వినోద్‌ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. 
కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్‌ చేశాడు.

👉 *'ఎందుకు పరిగెడుతున్నావ్‌?'*
*'వ్యాయామం కోసం'*
 *'ఈ టైమ్‌లోనే ఎందుకు?'*
 *'నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను'*
 *'నీ రూమ్‌ ఎంతదూరం?'*
 *'10 కిలోమీటర్లు ఉంటుంది'*
 *'అంత దూరమా? కారెక్కు. దింపుతాను'*
 *'వద్దు. నా ప్రాక్టీసు పోతుంది'*
 *ఇంతకీ ఎందుకు వ్యాయామం?'*
 *'ఆర్మీలో చేరడానికి'*

ఆ సమాధానంతో వినోద్‌ కాప్రి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్‌ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్‌ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్‌ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్‌ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. 'కనీసం కలిసి భోం చేద్దాం రా' అని వినోద్‌ కాప్రి అడిగితే ప్రదీప్‌ మెహ్రా చెప్పిన జవాబు 'వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్‌ డ్యూటీ' అన్నాడు.

వినోద్‌ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్‌ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్‌ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్‌ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ పంపించాడు. ఆనంద్‌ మహీంద్ర అయితే 'ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు' అని ట్వీట్‌ చేశాడు. 'ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది.
                 
👉 ప్రదీప్‌ మెహ్రా నుంచి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి...?

🎁 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్‌ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.

🎁 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్‌ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్‌ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్‌ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు.

🎁 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం.

🎁 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్‌ స్టార్‌ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్‌ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని 'నన్ను డిస్ట్రబ్‌ చేయకండి. పని చేసుకోనివ్వండి' అన్నాడు ప్రదీప్‌.

🎁 5. కష్టేఫలీ: 'మిడ్‌నైట్‌ రన్నర్‌'గా కొత్త హోదా పొందాక 'నువ్వు ఇచ్చే సందేశం' అని అడిగితే 'కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది' అని జవాబు చెప్పాడు.

👉 పిల్లలను పూర్తి కంఫర్ట్‌ జోన్‌లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్‌ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు.
 @ ఎంపిక @

Two roads 
diverged in a wood, 

and I—
I took the one 
less traveled by,

And that 
has made all the difference.

అంటాడు రాబిట్ ఫ్రాస్ట్ 

కళ్ళెదుట 
రెండు దారులు 

ఒకటే ....
ఎంచుకోగలను నేను 

గుంపులు పయనించని దారిని ఎంచుకున్నాను 
 
అదిగో ....
అదే మార్చింది జీవితం 

******

ఎంపిక
అతి ప్రధానమైన సమస్య 

ఆర్థిక శాస్త్రం లోనూ... 
జీవ శాస్త్రంలోనూ కూడా 

పరిసరాలలో 
సర్దుబాటు చేసుకోగల జీవులనే 
ఎంపిక చేసుకుంటుంది ప్రకృతి
బలమైనవీ తెలివైనవీ కూడా అంతరించిపోతాయి....

ద్రవ్యం పరిమితం ...
అవసరాలు అపరిమితం ....
అలాంటప్పుడు అత్యవసరమైన వాటినే 
గుర్తించి ఎంపిక చేసుకోవాలంటుంది ఆర్థిక శాస్త్రం 
మిగిలిన వాటిని వృథా ఖర్చుగానే పరిగణించమంటుంది 

*********

ఇప్పుడు ... 
ఈ చర్చ అంతా ఎందుకూ అంటే

విత్తం ... 
పరిమితం.
జ్ఞానం అపరిమితం 
కాలమూ బహు స్వల్పం.
చదవాల్సిందీ తెలుసుకోవాల్సిందీ అనంతం ...

కాబట్టి...
ఎంపిక ఒక కీలకమైన అంశం 
చదువరికీ... 

ఎటువంటి పుస్తకాలు చదవాలి
అసలు ఏ ఏ  పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి
ఒక అవగాహన ఉండాలి 

లేకపోతే ....
ధనమూ... సమయమూ... 
కడకూ జీవితమూ వృథా వృథా ....

*********

ఏంటీ ... 
ఒక పుస్తకం చదివి ఉండక పోతేనే 
జీవితం వృథానా... అంటారా 

అవును ... వృథానే ....
ఒక పుస్తకం... లేదా జీవితంలో సంభవించే ఒకానొక ఘటన.... మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది తెలుసా....

*********

శారీరకంగా దుర్భలుడూ 
మానసికంగా బిడియస్తుడూ 
నలుగురిలో కలవక ఏకాంతాన్ని ఇష్టపడేవాడూ 
అయిన గాంథీ....

ఒక వేళ 
సత్య హరిశ్చంద్ర నాటకాన్ని
చూసి ఉండకపోతే 

ఒక వేళ 
ఓ అర్థ రాత్రి 
ఫస్ట్ క్లాస్ కోచ్ నుండి
అతనిని మెడ బట్టి గెంటి ఉండకపోతే 

ఒక వేళ 
దక్షిణాఫ్రికాలో 
భారతీయుల దుస్థితిని 
అతను కాంచి ఉండకపోతే

ఏమై ఉండేది చెప్పండి... 

************

ప్రపంచాన్నీ 
దాని దృక్పథాన్ని 
మలచినా.... మలుపు తిప్పినా 
కారల్ మార్క్స్.... అంబేద్కర్.....
జ్యోతిబా..... పెరియార్.... లెనిన్....
వంటి మహనీయులందరూ మంచి చదువరులే తెలుసా 

ఒకానొక... 
లేదా కొన్ని పుస్తకాల చేతా 
ఒకానొక ... లేదా కొన్ని సంఘటనల చేతా
వాళ్ళంతా ప్రభావితులైన వాళ్ళే తెలుసా

*********

చివరిగా ఒక మాట 
మనం ఎటు వైపు నిలబడాలి.
మనం ఎవరి పక్షం వహించాలి.
అసలు మనం ఎలా జీవించాలి.
అన్నది కూడా ఒక ఎంపికే 

సత్యం వైపా
లేక అసత్యం వైపా ....

మానవత్వం వైపా 
లేక మతం వైపా ....

మూఢత్వం వైపా 
లేక శాస్త్రీయత వైపా ....

ఉన్మాదుల వైపా 
లేక సంయమనం వైపా ...

కపటం వంచన వైపా 
లేక స్నేహం ప్రేమా సుహృద్భావం వైపా ....

పురోగమనం వైపా 
లేక తిరోగమనం వైపా ....

ఎంపిక ఎటువైపు
అన్నది కూడా ఐచ్చికమే సుమా ....

స్వార్థంతో బతికామన్న వేదనతో కాక
అర్థవంతంగా జీవించామన్న ఆత్మతృప్తితో...
అనంత శూన్యంలోకి లయమైపోవాలి మనం.

- రత్నాజేయ్ (పెద్దాపురం)

*****సానుభూతి ఒక "అనుభూతి" !!

 *సానుభూతి ఒక "అనుభూతి" !!* (బండారు రాం ప్రసాద్ రావు)🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷గాయపడ్డ శునకాన్ని లేదా పక్షుల్ని, పావులరాలిని, జంతువులను దరిచేర్చుకొని నిమిరి కాస్తా మందు పెట్టీ ఉపశమనం కలిగిస్తే అవి ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటాయి...అయితే భౌతిక స్పర్శ వల్ల జంతువులే అంత ఆరాధన భావంతో ఉంటే అస్వస్థత తో లేదా కాలో చెయ్యే విరిగి, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆత్మీయ మిత్రులను పలకరించి ఆయన చేరిన ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని కాసేపు ఆయన చెయ్యి దగ్గరి కి తీసికొని ధైర్యం చెబితే ఆ వ్యక్తికి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఆ చేతిని గుండెల మీద పెట్టుకుంటాడు...అలాగే ఎవరైనా మరణించిన మనిషి తాలూకూ బంధు వుల ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించి కాసేపు ఉపశమనం మాటలు నాలుగు చెబితే వారిలో ఎంతో ఆప్యాయత అనురాగం ఏర్పడుతుంది...ఖర్మ కాలి నేటి పలకరింపులు కూడా ఓటు బ్యాంక్  రాజకీయం కోసమో లేక ఏదో ప్రయోజనం కోసమో చేస్తున్నట్టు అనిపిస్తుంది...సానుభూతి అంటే అదొక భావోద్వేగ సన్నివేశంగా భావించాలి...కపట నాటకం కాకుండా ఉండాలి! ఇటీవల హఠాత్తుగా భార్య చనిపోయి భాధలో ఉన్న వ్యక్తి తన బాధను అంత దిగమింగుకుని  తనను పరామర్శించడానికి వచ్చిన వారిని పలకరిస్తుంటే...ఒక ఆవిడ "చిన్న వయసులో భార్య పోయింది...పిల్లలు చిన్నవాళ్ళు...మీకు ఆడదిక్కు" అవసరం అని వాళ్ళ బందువులు ఆమె అనడం విని అదే టైం లో వెళ్ళన నన్ను పలకరించి నట్టే పలకరించి, తన బెడ్ రూం లోకి వెళ్లి బోరున ఏడుస్తున్నాడు..."ఏమైంది బాబు అంటే "భార్య పోయి నేను దుఃఖం లో ఉంటే పది రోజులు కాక ముందే ఆడదిక్కు కావాలి అని అనడం ఇదీ సానుభూతా బాబాయ్" అని రోదించాడు! సమాజం ఎంత దిగజారింది అంటే ఒకడు ఎలా బ్రతకాలి అన్నది కూడా సమాజమే నిర్ణయిస్తుంది.. అలా ఉంటాయి లోకం మాటలు !! ఇటీవల ఒక వ్యక్తి చనిపోయి ఆ కుటుంబం దుఃఖంలో ఉంది...శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో ఎక్కడ దహనం చేయాలో అనే మీమాంస ఆ కుటుంబంలో ఉంది అదే సమయంలో దగ్గరగా ఉన్న శ్మశాన వాటిక కు వెళ్లి అంత్యక్రియలకు అయ్యే ఏర్పాట్లు చేసి ఇంటి దగ్గర టెంట్ వేయించి ఒక పాతిక కుర్చీలు వేయించి, వచ్చే బంధువులకు తాగడానికి నీళ్ళు, ఇంటి ముందు శవ సంస్కారం చేసే ఏర్పాట్లు,  అనంతరం అంతిమ యాత్ర కు వాహనం సిద్ధం చేయడమే కాకుండా శవ  దహనం అయ్యాకా స్నానాలకు ఏర్పాట్లు, తరువాత ఇంటి కుటుంబ సభ్యులకు బంధువులకు ఇంత ఆన్న పానీయాలు ఇప్పించే వ్యక్తిని ఆ కుటుంబం జీవితాంతం మరవదు!! అది అసలైన ఆత్మీయ పరామర్శ!!🌷🌷🌷🌷🌷🌷🌷 మంచి 
 లేదా చెడు ఆయా  వ్యక్తులపై వారి శ్రేయస్సుపై దృష్టి సారించి వారినీ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భావోద్వేగ దుఃఖంలో ఉన్న వ్యక్తి కి ఉపశమనం కలిగించే విధంగా మాటలు ఉండాలి...పోయినోళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు వారి తీపి గుర్తులు అనే విధంగా బంధువులకు రీసీవ్ చేసుకుంటే కుటుంభానికి గౌరవ మర్యాదలు దక్కుతాయి....అందరూ సమాజంలో స్వార్థ పరులు ఉండరు...ఇంకా మంచి బ్రతికి ఉంది... ఎందుకంటే ప్రజలందరికీ భావోద్వేగాలపై సాధారణ అవగాహన ఉంటుంది. ఆ అవగాహన శ్రుతి మించకుండా ఉండాలి... 
అటువంటి ప్రవర్తన స్వీయ-సంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే మీతో కనెక్ట్ అయిన వ్యక్తికి ఏదో ఒక మార్గంలో (కుటుంబం, సామాజికం,  ఆర్థికంగా) సహాయం చేసిన వాళ్ళు పట్ల ఆ  కుటుంబం మీరు కనబడగానే బోరున విలపిస్తారు. నిస్వార్థత వ్యక్తులకు ఆ ఆప్యాయత లభిస్తుంది. సానుభూతి క్రియాత్మక సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన ఇవ్వడం మరియు తీసుకోవడం యొక్క చక్రాన్ని సులభతరం చేస్తుంది!! అదే అసలైన మానవత్వం! కేవలం ప్రయోజనం ఆశించి ఏ పని చేయకూడదు!!
 *✍🏼 నేటి కథ ✍🏼*


*తగిన శాస్తి*


 పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు. విజయ నగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు, కొనేవాడు. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు. ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతుంది. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారున్నీ, గుర్రాన్నీ చూశాడు. దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి.

     "ఇంత విలివైన గురాన్ని అంత తక్కువకు అడగటం నిజంగా మోసం చెయ్యటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను సరేనా?" అన్నాడు మంత్రి కొడుకు. గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. "ఏమీలేదు. మూడు కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు యిస్తా"నన్నాడు.

    వ్యాపారికి కోపం వచ్చింది. అయినా పేరాశకు లొంగిపోయాడు. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి 'చెళ్' మని కొట్టాడు. "అబ్బా"... అని మూల్గి "ఇంకా రెండు... కానీ..." మళ్ళీ కొరడా 'చెళ్' మంది.
"ఆ! తర్వాత మూడోది కూడా కానీ" అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను మడిచి "మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో" అంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంబరపడ్డారు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

శ్రీ రమణీయం - 41, ఇంద్రియాల నియంత్రణతోనే ఆత్మశాంతి

 🌹 శ్రీ రమణీయం - 41 🌹
👌 ఇంద్రియాల నియంత్రణతోనే ఆత్మశాంతి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

✳️ *కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక.... అనేవి ఐదు బాహ్యేంద్రియాలు. ఇవి మనకు రూపాన్ని, వాసనను, శబ్దాన్ని, స్పర్శను, రుచిని అందించే పరికరాలుగా ఉన్నాయి. మన శరీరానికి కష్టసుఖాలు, మనసుకు సంతోష, దుఃఖాలు కలిగేది ఈ ఇంద్రియాల వల్లనే. మనలోని ఆత్మ పరిపూర్ణ శాంతితోనే ఉంది. కానీ మన మనసు ఆ ఆత్మ శాంతిని పొందలేకపోతుంది. అందుకు కారణం ఇంద్రియాలు అందించే అనుభవాలు. అవే మనసు ఆత్మభావన నుండి దూరం చేసి శరీర భావనను కలిగిస్తున్నాయి. మనం నిద్రించేటప్పుడు ముందుగా బాహ్యేంద్రియాలు సద్దుమణిగి ఇంద్రియాల భావన (అంతరేంద్రి యాలు) మిగిలి ఉంటుంది. అదే కొంతసేపు స్వప్నంగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత గాఢనిద్రలో ఇంద్రియాలు పూర్తిగా అణిగి ఉంటాయి. అక్కడ ఏ భావనా లేని శాంతి స్థితి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవం లోనిదే. ఈ శాంతిని నిత్యజీవితంలో కూడా సాధించడమే ఆధ్యాత్మిక జీవనం.*

✳️ నిద్రలో సద్దుమణిగిన ఇంద్రియాలు నిత్యజీవితంలో తిరిగి విజృంభించటం వల్లనే ఆ శాంతి దూరం అవుతుంది. స్విచ్ ఆపిన టి.వి. అప్పటికి తన కార్యకలాపాలను ఆపినా మళ్లీ స్విచ్ వేస్తే తిరిగి తన పనులన్నింటినీ యధాతథంగా కొనసాగిస్తుంది. మన నిద్రకూడా అలాంటిదే. నిద్రలో ఇంద్రియాలు లేవు కనుక, నేను అనే భావన లేదు. కానీ అక్కడ మనం శాంతిగా ఆత్మస్వరూపంలో ఉన్నాం. మనలో శాంతిగా ఉన్న ఆత్మ భావనే అసలైన ‘నేను'. ఇంద్రియానుభవంతో మనకికలిగే శరీర భావనే దొంగ 'నేను'. మనకి ఆ లోపల ఉన్న అసలు 'నేను' తెలియకపోయినా బయట కనిపించే దొంగ 'నేను' తెలుస్తూనే ఉంది. మనకి తెలిసిన బయటి నేనుతో చేసే ఆధ్యాత్మిక సాధనతోనే తెలియని లోపలి నేను అనుభవంలోకి వస్తుంది.

✳️ మనప్రతి అనుభవానికి ఇంద్రియాలు కారణం. ఇంద్రియాలు లేని సుఖాన్ని, దుఃఖాన్ని మనం ఊహించలేము. శాంతిగా ఉన్న లోపలి నేను గురించి మనకి ఏ దిగులు లేదు. ఆ శాంతిని మనం అనుభవించకుండా చేస్తున్న ఇంద్రియాలే సమస్యగా ఉన్నాయి. కనుక ఇంద్రియాలనే జాగ్రత్తగా వాడుకోవాలి. దుఃఖం కలుగుతుంది బయటి నేనుకే. కనుక, పరిష్కారం కూడా దాని విషయంలోనే అవసరం. ఇంద్రియాలు ఏ అనుభవాన్ని అందించని నిద్రలో అసలు నేను తాలూకూ శాంతిని మనం అనుభవిస్తున్నాం. ఈ శాంతి మనకు నిరంతరం అందాలంటే ఇంద్రియాల పనులను ఆపాలి. 

✳️ జీవనంలో ఇంద్రియాలను పూర్తిగా ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. కనుక, వాటి కార్యకలాపాలను వీలైనంతగా తగ్గిస్తే మనలోని శాంతి క్రమేణా వ్యక్తమౌతుంది. అంటే అనవసర విషయాల్లో ఇంద్రియాల వ్యాపారం, వ్యాపకం తగ్గిస్తే సరిపోతుంది. ఆత్మానుభవం జరగాలన్నా, దైవదర్శనం కావాలన్నా మనం ఇంద్రియాల ద్వారా జరిగే పనులను నియంత్రించాలి. ఆధ్యాత్మికత వైపు ఇష్టం బలపడితే మన మనసు తెలియకుండానే ఇంద్రియ వ్యాపారం తగ్గించు కుంటుంది. ఆ స్థితి కలిగే వరకూ మనమే ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల పనులను నియంత్రించుకోవాలి.

✳️ ఇంద్రియాలను నియంత్రించుకోవాలంటే మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో గుర్తించి, మసలుకునే వివేకం కావాలి. అంటే మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి. నిజానికి ఆత్మానుభవం బుద్ధిస్థాయికి మించిందే అయినా ఆ బుద్ధిని బుద్ధి కుశలతతోనే దాటగలం. కనుక బుద్ధిని బాగుచేసుకోవడం చాలా ముఖ్యం. బుద్ధి అంటే మంచి చెడుల వివేచన. అది కలిగిన రోజు చెడును వదిలి మంచిని మాత్రమే స్వీకరించగలుగుతాము. 

✳️ మనకి ఆత్మ గురించి ఏ జాగ్రత్తలూ అవసరం లేదు. కానీ ఆ ఆత్మ తెలియాలంటే బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన సచ్ఛీలమంతా బుద్ధిపైనే ఆధారపడి ఉంది. ఇంద్రియాల ద్వారా ఏ చెడు జరక్కూడదన్న సూచననే మన పెద్దలు చెడుఅనకు, చెడుకనకు, చెడువినకు, చెడు తినకు, చెడునుఆనకు (అంటుకోకు) అనిచెప్పారు. మనం మనకి అసాధ్యమైన విషయాల్లో దేవుడ్ని, గురువుని ఆశ్రయిస్తాము. అలానే మంచి బుద్ధిని ప్రసాదించమని అడుగుతూ ఉంటాం. గురువైనా సరేనేరుగా మన బుద్ధిని మార్చరు. బుద్ధిని మార్చుకునేందుకు మనం చేసే దుర్గుణాల విషయంలో కూడా అంత దూరంగా ఉండాలి. ఉదయం నిద్రలేచేటప్పుడే మన బలహీనతలు దాటాలన్న దృఢ సంకల్పంతో ఉండాలి. శాంతి జీవనానికైనా, ఆత్మ దర్శనానికైనా సుగుణమే అవసరం. *మితమైన ఆలోచనలు, మంచి తలపులు మనశ్శాంతిని ఇస్తాయి.* మనసుని కలుషితం చేసే క్రియల జోలికి వెళ్లకూడదు. అందుకు తరుణోపాయమే భగవన్నామస్మరణం, నామజపం చేస్తున్నప్పుడు మన వ్యాపకాలు తగ్గటం వల్ల మనకి శాంతి కలుగుతుంది. అదే రకంగా వ్యాపకాలను తగ్గించి నిత్యజీవితంలో శాంతిని కొనసాగించాలి.

✳️ భక్తుని పారవశ్యానికి ప్రతిఫలంగా రూపంతో దర్శనమిచ్చే దైవం ఆత్మాన్వేషికి అణువు అణువులో కనిపిస్తాడు. భగవంతుడ్ని తత్వరూపంలో దర్శించే జ్ఞానాభిలాషికి జరిగే ప్రతి క్రియలోనూ, ఆ క్రియ ఫలంగా జరిగే 'ప్రతిక్రియ’ (ఫలం) లోనూ దైవమే ఉన్నాడని తెలుస్తుంది. దైవం ఈ సృష్టి అంతటా అన్ని పనులుగా, ఆ పనులకు లభించే ఫలం గానూ ఉన్నాడు. అందుకే మనకి అనుకూలమైన 'ఫలాల కోసం దైవాన్ని ప్రార్థిస్తాము.

మన క్రియకు జరిగే ప్రతిక్రియే (రియాక్షన్) అనుభవాన్నిస్తుంది. ప్రతిక్రియ దైవమే కనుక ప్రతీ అనుభవము దైవమే. ఉప్పు తింటే బి.పి. పెరగటం, మందువాడగానే బి.పి. తగ్గటం అనే రెండు ప్రతిక్రియల్లోనూ దాగి ఉన్నది దైవమే. మన గుండె స్పందన మనకి తెలుస్తుంది గానీ మన కాలేయం ఉనికి మనకి తెలియదు. అయినా కాలేయం ద్వారా మనలో ఎంతో పని జరుగుతూనే ఉంది. ఈ విధంగా మనలో తెలిసినవి, తెలియనివి అనేక క్రియలు దైవానికి ప్రతిరూపంగా జరుగుతున్నాయి. ఆ దైవాన్ని దర్శించే సూక్ష్మదృష్టిని సాధించడమే సాధనలో పరమార్థం.

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

****మంచిని పెంచండి!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


         *మంచిని పెంచండి!*
              ➖➖➖✍️

```
ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు.

దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక కండీషన్ పెట్టేవాడు, పుచ్చకాయ తినేటప్పుడు గింజలని కొరకకూడదు, వాటిని తీసి ఆ రైతుకి ఇవ్వాలి. ఎన్ని వాటర్ మెలన్స్ అయినా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా ప్రతి సంవత్సరం పుచ్చకాయల పండగ కోసం ఎదురు చూసేవారు. నిజానికి ఇదొక స్ట్రాటజీ.

వారం రోజుల పుచ్చకాయల పండగ అయ్యాక ఆ గింజలని వచ్చే సంవత్సరం కోసం విత్తనాలుగా దాచేవాడు. ఆ తర్వాత సంవత్సరం మరింత మేలైన పుచ్చకాయలు కాసేవి. వాటిల్లో అత్యంత మేలిరకం వాటిని మళ్ళీ వారం రోజులు వాటర్ మెలన్ తినే ఫెస్టివల్ జరిపి మళ్ళీ మరుసటి సంవత్సరం కోసం దాచేవాడు.

దీనివల్ల ప్రతి ఏటా మేలిమిరకం విత్తనాలు, నాణ్యత కలిగిన కాయలను ఇచ్చే విత్తనాలను డెవలప్ చేసుకుంటూ పోయాడు తను… కాలక్రమంలో ఆ రైతు కాలం చేశాడు. ఆ రైతు కొడుకు పుచ్చకాయలని పండించేవాడు. అయితే మా ఫాదర్ వెర్రిబాగులోడు, మంచి పుచ్చకాయలని తినే ఫెస్టివల్ కోసం ఉంచటం ఏంటి , నాన్సెన్స్ అని మేలు రకం పుచ్చకాయలని ఎక్కువ రేటుకి అమ్మి చిన్న సైజు వాటిని, నాణ్యత లేని వాటిని పుచ్చకాయలు తినే పండగ కోసం ఉంచేవాడు.

దాంతో ఏం జరిగింది..? మేలిమిరకం విత్తనాలు ఎక్కడో పడిపోయేవి… పిల్లలు తిన్న నాసిరకం పుచ్చకాయల విత్తనాలే ఈ రైతుకు మిగిలేవి… తద్వారా ఏటేటా దిగుబడి తగ్గింది, రాబడి తగ్గింది. అన్నింటికీ మించి కాయల క్వాలిటీ తగ్గింది…

ఉన్న వాటిలో మేలురకం వాటిని ఎక్కువ ధరకి అమ్మి, నాణ్యత లేని తక్కువ రకం వాటిని పుచ్చకాయలు తినే ఫెస్టివల్ కి ఉంచటం వలన సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పుచ్చకాయల నాణ్యతతోపాటు సైజు కూడా తగ్గుతూ చివరికి అన్నీ నాణ్యత లేని పుచ్చకాయలే కాసేవి. దీంతో జనాలకి కూడా ఆ రైతు పండించే వాటి మీద ఆసక్తి తగ్గింది, చివరకి ఆ రైతు దగ్గర ఒక్క మంచి విత్తనం కూడా మిగలలేదు

జీవితం చిన్నదే కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు ముఖ్యమో గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రీకర్ గారు చెప్పిన వాటర్ మెలన్ స్టోరీ అటూఇటూగా తర్జుమా చేసి రాసిన పోస్ట్ ఇది.✍️```
      
         -సేకరణ.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀