Wednesday, March 25, 2020

మహాభారతo లో ప్రస్తుత పరిస్థితుల కు సరిపోయే సంఘటన ఒకటి జరిగింది

మహాభారతo లో ప్రస్తుత పరిస్థితుల కు సరిపోయే సంఘటన ఒకటి జరిగింది.

మహాభారత సంగ్రామం లో ద్రోణాచార్య మరణించిన వార్త విన్న ఆయన కుమారుడైన అశ్వత్థామ విపరీతమైన కోపం కలిగి పాండవ సైన్యం మీదకి నారాయణాస్త్రం ప్రయోగించాడు.

ఈ నారాయణాస్త్రం ధాటికి పాండవ సైన్యం అతలాకుతలం అయిపోయిందట. ఎవ్వరూ దాన్ని ఆపలేకపోయారు. ఈ అస్త్రం ప్రత్యేకత ఏమిటంటే....ఎవరి చేతిలో ఆయుధాలు ఉంటాయో వారిని వెంటనే దహించివేస్తుంది. యుధ్ధం చేయాలన్న ఆలోచన మనసు లో కలిగినాసరే దహించివేస్తుంది. ఏంచేయాలో తెలియక వారు శ్రీకృష్ణుని కి మొర పెట్టుకున్నారు.

అప్పుడు శ్రీకృష్ణ..పాండవ సైన్యం తో...మీరందరూ ఆయుధాలను నేల విడిచి, చేతులు జోడించి నిలుచోండి...కనీసం యుద్ధం చేయాలన్న ఆలోచన కూడా రానీయకుండా కొంత సమయం వేచి చూడాలి అని చెప్పారు....కొంత సమయానికి నారాయణాస్త్రం యొక్క ప్రభావం తగ్గి పాండవ సైన్యం ఊపిరి పీల్చుకుంటుంది....

కథలో నీతి యేమిటంటే...

అన్ని చోట్లా యుధ్ధం విజయాన్ని సాధించలేదు. ప్రకృతి యొక్క విలయతాండవం నుండి తప్పించుకోవాలంటే, మనం చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి, చేతులు జోడించి ఒకచోట నిశ్శబ్దం గా కూర్చొవాలి. అపుడే మనం బతకగలుగుతాం....ఇదే భగవద్గీత మనకు చెప్పే జీవనవిధానం.... జై శ్రీకృష్ణ !!!

ఈ కరోనా కూడా అలాంటిదే....ధైర్యం గా ఎదుర్కొందాం....ఈ మహమ్మారిని భారత దేశం నుండి వెళ్లకొడదాం...

No comments:

Post a Comment