Wednesday, April 29, 2020

మధుర కృష్ణ దేవాలయం

🕉🚩🕉🚩🕉🚩🕉🚩

🕉🚩 మధుర కృష్ణ దేవాలయం🕉🚩
మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలోఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం. ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణిని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.
మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి. రెండవ నగరం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధారం. రెండు నగరాలలో ఒకటిగానే క్రీ.శ మొదటి శతాబ్దంలో బుద్ధిని శిలలు చెక్కడం ఆరంభించినట్లు అంచనా. గాంధారం తయారైన శిలలు ఇండో గ్రీకు సిల్ప శైలిలోనూ మధురలో తయారైన సిలలు హిందూ దేవతల శిల్ప శైలిలోనూ ఉన్నాయి.
షెర్లాక్ హోమ్స్ రచించిన 'ది సైన్ ఆఫ్ ఫోర్' నవలలో మథురా నగర వర్ణన ఉంది.

చరిత్ర
మథురకు పురాణ కాలంనుండి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడూ దశరథ చక్రవర్తి కుమారుడూ రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కథనం. తరువాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనంగానూ మథుపురంగానూ మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం. నిశిత పరిశోధనలు లవణాసురుడు శివభక్తుడూ శివునినుండి త్రిసూలాన్ని వరంగా పొందిన మధువు సంతతివాడనీ ఆకారణంగా ఈ నగరానికి మథుర అనే పేరు వచ్చినట్లు చెప్తున్నాయి. యాదవరాజైన మథు పేరుమీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లూ పురాణాల కథనం. ఇలా ఈ నగర పేరుకి సంబంధించి పలు కారణాలు పురాణాలలో ప్రస్తావించబడినాయి.
క్రీ.పూ 6 వశతాబ్దంలో సూరశేనుని సామ్రాజ్యానికి మథుర రాజధానిగా ఉండేది.క్రీ .పూ 4నుండి 2 వ శతాబ్దం వరకు ఈ నగరం మౌర్యుల పాలనలో ఉంది.క్రీ.పూ 2వ శతాబ్దంలో సుంగ సామ్రాజ్యంలో ఈ నగరం భాగమైంది.క్రీ.పూ 180నుండి 100 మధ్య ఈ నగరం ఇండో-గ్రీక్ స్వాధీనంలో ఉన్నట్లు అంచనా. ఆర్కియాలజిస్టులు ఆధారాలను అనుసరించి రచయిత బౌకర్ రచనల ఆధారంగా క్రీ.పూ 100 నుండి ఇక్కడ అధికంగా జైన మతస్థులు నివసించినట్లు విశ్వసిస్తున్నారు. మథుర కళా శైలి, సంస్కృతి కుషాలుల పరిపాలనలో బౌద్ధమతంతో ప్రభావితమైయ్యాయి.మథుర వారి రాజధానులలో ఒకటి. రెండవది పెషావర్ (పురుషపుర్). వాసుదేవ్ మనహాయించి కుషాలుల రాజులు కడ్ఫిసెస్, హువిష్క, వాసుదేవ్. కషాలులందరూ బౌద్ధ మతావలంబీకులు .
క్రీ .పూ 3 వశతాబధంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు మెగస్తనీస్ రచనలలో మథురానగర ప్రస్తావన ఉంది. ఆయన మథురా నగరాన్ని మెథొరాగా పేర్కొన్నాడు.
క్రీ.పూ. 1నుండి 3 వ శతాబ్దం వరకు మథుర కుషాల సామ్రాజ్య రాజధానులలో ఒకటిగా ఉంది.మథుర మ్యూజియం (పురాతన వస్తు ప్రదర్శనశాల) లో ఆసియాలోనే అధికంగా ఎర్రరాతి శిల్పాలు ఉన్నాయి. వీటిలో అధికంగా బుద్ధిని శిలారూపాలు చోటు చేసుకున్నాయి.
గజనీ మహమ్మద్ మథురా నగరాన్ని స్వాధీనపరచుకున్న తరువాత నగరంలోని అనేక ఆలయాలు పడగొట్టబడ్డాయి. 1018లో ఈ నగరంలోని ఆలయాలు సికిందర్ పరిపాలనలో మరికొంత విధ్వంసాన్ని చవిచూసాయి. ఔరంగజేబు పరిపాలనలో కేశవ్‌దేవ్ ఆలయంలోని కొంతభాగం విధ్వంసం అయింది. ఔరంగజేబు చక్రవర్తి అదే ప్రదేశంలో జామీ మసీద్ (శుక్రవార మసీదు) నిర్మించాడు. ఆలయంలోని అనేక రాళ్ళను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు అంచనా. ముఘల్ చక్రవర్తుల నుండి భరత్‌పూర్ రాజుల వశమై చివరకు మరాఠీయుల స్వంతమైంది. ప్రస్తుత కృష్ణుని ఆలయం 1815 లో గోకుల్దాస్ పరీఖ్ చే నిర్మించబడింది దీనిని ఇప్పుడు ద్వారకేశ్ ఆలయంగా పిలుస్తున్నారు.

సాహిత్యంలో మధుర

మధుడు అనే రాక్షసుడు మధురను పరిపాలించాడు. అతను గొప్ప శివభక్తుడు, శివుణ్ణి ప్రార్థించి భయంకరమైన అజేయమైన త్రిశూలాన్ని పొందాడు. మధువుకు రావణుడు స్వయానా బావమరిది అవుతాడు. ఈ ప్రాంతానికి అతని వల్లనే మధువనము, మధుపురి, మధుర, మథుర అనే పేర్లు వచ్చాయి. మధుని మరణానంతరం శూలం పారంపర్యంగా లవణుడు పొందాడు. దానితో మునులను, ప్రజలను హింసించడం ప్రారంభించగా, ప్రజలు చ్యవనమహర్షికి, ఆయన రామచంద్రునికి మొరపెట్టుకున్నారు. రాముడు అప్పటికే రావణాసుర సంహారం, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్నాడు. రాముడు లవణాసురునిపై యుద్ధానికి తమ్ముడు శత్రుఘ్నుని పంపుతాడు. శూలం లేనప్పుడు లవణాసురుని చంపి మధురను శత్రుఘ్నుడు వశం చేసుకున్నాడు. శత్రుఘ్నుని అనంతరం ఆయన కొడుకు శూరసేనుడు, పరంపరాగతంగా వారి వారసులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు.శత్రుఘ్నుని కొడుకు శూరసేనుని పేరుమీదుగానే ఈ ప్రాంతానికి శూరసేన దేశమనే పేరు వచ్చిందని డా.వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్యశాస్త్రి భావించారు.

పురాణాల్లో మధుర సవరించు
పురాణాల ప్రకారం చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు, అప్సరస ఊర్వశిల పుత్రుడైన ఆయువు యమునాతీరంలో మథురానగరాన్ని నిర్మించాడని కథ ఉంది.

భారత భాగవతాల్లో మధుర

మహాభారత, భాగవతాల్లో శూరసేన దేశం ప్రసక్తి పలుమార్లు కనిపిస్తుంది. ఆ శూరసేన దేశానికి మథుర రాజధాని. మహాభారతగాథకు కేంద్రబిందువైన కురుభూములకు ఈ శూరసేన దేశం దక్షిణంగా ఉంటుంది. శత్రుఘ్నుని వంశీకుల తర్వాత యదువంశీకుల అధీనంలోకి వచ్చింది. మధురను నిర్మించినట్టుగా పురాణాల్లో చెప్పబడిన ఆయువు కుమారుడు నహుషుడు. ఆయన కొడుకు యయాతికి, ఆయన భార్య దేవయానికి జన్మించిన వాడు యదువు. ఆ యదువు వారసులైన యదువంశీకుల అధీనంలోకి భారత భాగవతాల కాలంలో మధుర అధీనంలోకి వచ్చింది. యయాతి కొడుకు యదువు, అతని కుమారుడు క్రోష్ఠుడు. వారికి 42 తరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. అతని కుమారుడు శ్రీకృష్ణుడు. ఆయన ఉగ్రసేనుడి కుమారుడు, తనకు మేనమామ అయిన కంసుని సంహరించాడు. కృష్ణుని అన్న బలరాముడు మధుర పరిపాలకుడయ్యాడు. కృష్ణుడు పశ్చిమదిక్కుకు వెళ్ళి ద్వారకను నిర్మించేంతవరకూ యదువంశీకులకు మధురే కేంద్రంగా ఉండేది. జరాసంధుని దాడుల్లో దెబ్బతిన్న మధురను తిరిగి కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుని కాలంలో పునర్నించబడింది.
🕉🚩🕉🚩🕉🕉🕉🚩🕉🚩

No comments:

Post a Comment