Sunday, April 26, 2020

కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు.......!!

🕉️🧜‍♀️🧜‍♂️🔱🔔🧚‍♂️🧚‍♀️🕉️

కర్ణుడుకవచకుండలాలతోఎందుకుపుట్టాడు.......!!

కర్ణుడు..
కుంతీదేవికి పుట్టలేదు.

కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు.

కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు...

అంతే.
కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’.
ఆ మంత్రంతో
ఏ దేవతను ఆవాహన చేస్తే,
ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లి పోతారు తప్ప
మరే వరాలు అనుగ్ర హించరు.

ఆ మంత్ర ప్రభావం అలాంటిది.

ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థం చేసుకుంటే..

కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వ బడ్డాడో బాగా అర్థం అవుతుంది.

ఇక విషయం లోకి వెడితే...

పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు.

వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు.

అప్పటి నుంచి వాడికి ‘సహస్రకవచుడు’
అనే పేరు స్థిరపడి పోయింది.

ఆ వర గర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండే వాడు.

వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి
శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..

నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను.

వాడికి అంత్య కాలం సమీపించి నప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు.

అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’
అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్య కశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండు రూపాలుగా విడి పోయాడు.

నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు.

వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుక తోనే
పరాక్రమ వంతులు, విరాగులు.

అందుకే వారిరువురూ ఆయుధ ధారులై బదరికా వనంలో ఏకాగ్ర చిత్తులై తపోదీక్ష వహించారు.

ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగు తోంది.

ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ..

నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..

‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి?

వీరెవరో కపట తాపసులై యుండవచ్చు’ అని భావించి వారికి
తపో భంగం గావించి,
వారిని యుద్ధానికి ఆహ్వానించాడు.

వారి మద్య భీకరయుద్ధం జరిగింది.

ఎంతకాల మైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేక పోవడం చూసి,
ఆశ్చర్య పడి
శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు.

శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా..
నర నారాయణులు
నా అంశతో జన్మించిన వారు.

వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు.

ప్రహ్లాదుడు తన తప్పు తెలుపు కుని

నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగు తోంది.

వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరసలను పంపాడు.

వారు తమ
రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు..

కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి,

‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు.

ఇంద్రపదవి ఆశించి మేము
ఈ తపస్సు చేయడం లేదు
అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు.

ఆ శబ్దం నుంచి
ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది.

తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన
ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను
ఆ అప్సరసలకు ఇస్తూ,

‘ఈమెను
మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు.

మహేంద్రుడు తన తప్పు తెలుసు కుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగు తోంది.

ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారి దగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు.

అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..

నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది.

కానీ,
మేమిద్దరం కలిసి
నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు.

కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే
మరొకడు తపస్సు చేసు కుంటాడు.

అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగ కూడదు.

ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు
ఈ ఒప్పందానికి సమ్మతించాడు.

నరుడు తపస్సు చేస్తున్నాడు.

నారాయణుడు యుద్ధానికి దిగాడు.

యుద్ధం భీకరంగా సాగుతోంది.

అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం

నారాయణుడు సహస్రకవచుని
వేయి కవచాలలో
ఒక కవచాన్ని భేదించ గలిగాడు.

అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు.

మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు
సహస్రక వచుని మరో కవచాన్ని భేదించాడు.

ఇలా నర,నారాయణు
లిరువురూ కలిసి
ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు.

ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం.

అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడు కున్నాడు.

అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను.,

నర,నారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండి పోయాడు.

కుంతి మంత్ర బలానికి కట్టు బడి వచ్చిన సూర్యుడు.

ఆ సహస్ర కవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు.

అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు.

ఆ కర్ణుని సంహరించ డానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి,

కురుక్షేత్ర రణభూమి లో కర్ణుని సంహరించారు.

🦚🐉🐲🦃🦜🐍🦎🐛

ప్రకృతి ని పరి రక్షిధ్ధాం

పర్యావరణమును కాపాడు కుందాం

ధ్యానం శరణం గఛ్ఛామి

🌴🌾🌲🌱🌳🌵🎋🎄

వృక్షో రక్షతి రక్షితః

🐏🐄🐬🐟🐪🐓🐐🕊️

శాకాహారమే -- అమృతాహారం

అహింసా పరమో ధర్మః

జీవా సమస్తా స్సుఖినో భవంత్

శాకాహారం శరణం గఛ్ఛామి

ధ్యానం శరణం గఛ్ఛామి

🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️

ఆనందో బ్రహ్మ ధ్యానం గ్రూప్స్
లో జాయిన్ కావాలను కుంటున్నారా మాష్టర్స్ & ఫ్రెండ్స్

ఈ క్రింద వాట్సాప్ నెంబర్ కి...
9032555166
మీ పేరు
మీ వూరు
మీ జిల్లా తెలియ జేయగలరు

శాకాహారం,ధ్యానం,జ్ఞానం

ఆధ్యాత్మిక విజ్ఞాన వాట్సాప్ గ్రూప్స్

హైదరాబాద్

🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️

No comments:

Post a Comment