Wednesday, June 17, 2020

కర్మల ఫలితాన్ని కర్మ వదలివేయడం అజ్ఞానం అదే కర్మ ఫలితాన్ని సరిదిద్దుకోనేప్రయత్నం చేయడమే విజ్ఞానం.

తీసుకోలేం కానీ - తీర్చిదిద్దుకుందాం.

కర్మల ఫలితాన్ని కర్మ వదలివేయడం అజ్ఞానం అదే కర్మ ఫలితాన్ని సరిదిద్దుకోనేప్రయత్నం చేయడమే విజ్ఞానం. అదే ఈ రోజు కధ లోని ఇతివృత్తం
దీనిని రెండు చిన్న కథల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నచ్చితే ఆచరించండి నచ్చకపోతే వదిలేయండి.నిర్ణయం మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.

ప్రారబ్ద కర్మల ఫలితాన్ని కచ్చితంగా అనుభవించాల్సిందే. ఇవి దాచేవి కావు పంచేవి కావు. అనుభవించి ఖర్చు చేసుకోవాల్సిందే. ఉదాహరణకు రాముకు లేక లేక పుట్టిన కొడుకు శ్రీకాంత్. అతడంటే పంచప్రాణాలు.

ఒకరోజు ఇంటిముందు ఆడుకుంటూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చి యాక్సిడెంట్ అయితే ఆస్పత్రిలో చేర్చారు. రాము పనిమీద బయటికి వెళ్లాడు. ఆ ఆస్పత్రిలో ఆ బిడ్డ బాధలు భరించలేక నాన్న నాన్న అంటూ ఎంతగానో విలపిస్తున్నాడు.

అంతలో రాముకు ఈ విషయం తెలిసి పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చాడు. తండ్రిని చూడగానే ఆ బిడ్డ మరింత బిగ్గరగా ఏడుస్తూ నాన్న నేను ఈ బాధను భరించలేను తట్టుకోలేను. వెంటనే ఈ బాధను తీసేయండి అంటూ విలపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి రాము చలించిపోయాడు.

వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి నా బిడ్డంటే నాకు పంచప్రాణాలు. వాడు లేనిదే నా జీవితం లేదు. వాడి కోసం నా ప్రాణమైనా ఇస్తా. అవసరమైతే వాడి బాధను భరించే శక్తి నాకుంది. దయచేసి వాడి బాధను తీసి నాకు ఇవ్వండి. ఎన్ని లక్షలు ఖర్చయినా పర్వాలేదు. వాడు మాత్రం బాధతో ఉండకూడదు అంటూ ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు .

అప్పుడు డాక్టర్ గారు ఇది ఎలా సాధ్యమవుతుంది. అతను కారు క్రింద పడినప్పుడు గాయాలు అయ్యాయి. ఆ గాయాలకు వచ్చిన నొప్పులు అతనే అనుభవించక తప్పదు. ఆ బాధను తీసి మీకు ఇవ్వటం అసాధ్యం అంటాడు.

ఇలా మన అందరి జీవితాలలో మనం చేసుకున్న ప్రారబ్ద కర్మలు ద్వారా ఎన్నో కష్టాలు దుఖాలు వస్తాయి. వాటిని అనుభవించాల్సిందే, వేరే మార్గం లేదు.

అయితే ప్రతి సమస్యకు ఏదో ఓక్క పరిష్కార మార్గం ఉంటుంది అనేది వాస్తవం అదే ప్రకృతి దర్మం. అలాగే ప్రారబ్ద కర్మ కి కూడా ఒక పరిష్కారం ఉంది. కానీ దాన్ని అనుభవించే తీరాలి అయితే దైవ నామ స్మరణ తో కొంత ఉపశమనం దొరుకుతుంది. దాన్ని ప్రభావితం తగ్గించుకునే ప్రయత్నం చేయడానికి వీలు ఉంది. అది ఎలాగో అంటారా ఈ క్రింది కథను చదవండి.

అవంతీ నగరంలో ఒక వేదపండితుడు ఉండేవాడు ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయలుకున్నా ఇతడి చేత చేయించేవారు.. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వలన యజ్ఞాలు చేశాడు. యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లాడి జాతకచక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది.. గుండెఝల్లుమంది. అయినా మళ్ళి మళ్ళి వేశాడు. ఎన్నిసార్లు చుసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు ''బాబోయ్! నేను పండితుడిని. వీడు గజదొంగ. పండితపుత్రుడు పరమ శుంఠ'' అనేమాట నిజమౌతుందేమో!''అని భయపడ్డాడు. ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కాని మనస్సుని అదుపు చేయాలి. ఎలా? ఎలా? ఎలా? అని అలోచించి ఆరోజు నుండి పిల్లాడికి రామాయణ భారత, భాగవతాలు, గరుడపురాణం లాంటి పురాణాలు బాగా పిల్లాడికి చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడపురాణం మరీమరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది.. ఈ తప్పు చేస్తే ఈశిక్ష పడుతుంది. ఆ తప్పుచేస్తే మరో శిక్ష పడుతుంది.. బంగారం దొంగతనం చేస్తే కుష్ఠు వ్యాది వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాది వస్తుంది. ఎవరినైనా దూషించడం, పరులమీద నిందలు వేయడం, గురువులని వేదాలని నిందించడం, దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే తీసుకుతీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈకుర్రాడు కూడా పండితుడు అయ్యాడు.. ఇతడి పేరు కూడా క్రమంగా ఆనోటా ఈనోటా పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది..

రాజుగారు ఆపండితుడి తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ! భూసురోత్తమా! నీ కుమారుడి గుణగణాలు విన్నాను. ఇక నుండి నాదగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వేళ్ళాడే కాని మనస్సంతా ఆందోళన.. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నాదగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరబాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది.

తీసుకోలేం కానీ - తీర్చిదిద్దుకుందాం.

కర్మల ఫలితాన్ని కర్మ వదలివేయడం అజ్ఞానం అదే కర్మ ఫలితాన్ని సరిదిద్దుకోనేప్రయత్నం చేయడమే విజ్ఞానం. అదే ఈ రోజు కధ లోని ఇతివృత్తం
దీనిని రెండు చిన్న కథల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నచ్చితే ఆచరించండి నచ్చకపోతే వదిలేయండి.నిర్ణయం మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.

ప్రారబ్ద కర్మల ఫలితాన్ని కచ్చితంగా అనుభవించాల్సిందే. ఇవి దాచేవి కావు పంచేవి కావు. అనుభవించి ఖర్చు చేసుకోవాల్సిందే. ఉదాహరణకు రాముకు లేక లేక పుట్టిన కొడుకు శ్రీకాంత్. అతడంటే పంచప్రాణాలు.

ఒకరోజు ఇంటిముందు ఆడుకుంటూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చి యాక్సిడెంట్ అయితే ఆస్పత్రిలో చేర్చారు. రాము పనిమీద బయటికి వెళ్లాడు. ఆ ఆస్పత్రిలో ఆ బిడ్డ బాధలు భరించలేక నాన్న నాన్న అంటూ ఎంతగానో విలపిస్తున్నాడు.

అంతలో రాముకు ఈ విషయం తెలిసి పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చాడు. తండ్రిని చూడగానే ఆ బిడ్డ మరింత బిగ్గరగా ఏడుస్తూ నాన్న నేను ఈ బాధను భరించలేను తట్టుకోలేను. వెంటనే ఈ బాధను తీసేయండి అంటూ విలపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి రాము చలించిపోయాడు.

వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి నా బిడ్డంటే నాకు పంచప్రాణాలు. వాడు లేనిదే నా జీవితం లేదు. వాడి కోసం నా ప్రాణమైనా ఇస్తా. అవసరమైతే వాడి బాధను భరించే శక్తి నాకుంది. దయచేసి వాడి బాధను తీసి నాకు ఇవ్వండి. ఎన్ని లక్షలు ఖర్చయినా పర్వాలేదు. వాడు మాత్రం బాధతో ఉండకూడదు అంటూ ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు .

అప్పుడు డాక్టర్ గారు ఇది ఎలా సాధ్యమవుతుంది. అతను కారు క్రింద పడినప్పుడు గాయాలు అయ్యాయి. ఆ గాయాలకు వచ్చిన నొప్పులు అతనే అనుభవించక తప్పదు. ఆ బాధను తీసి మీకు ఇవ్వటం అసాధ్యం అంటాడు.

ఇలా మన అందరి జీవితాలలో మనం చేసుకున్న ప్రారబ్ద కర్మలు ద్వారా ఎన్నో కష్టాలు దుఖాలు వస్తాయి. వాటిని అనుభవించాల్సిందే, వేరే మార్గం లేదు.

అయితే ప్రతి సమస్యకు ఏదో ఓక్క పరిష్కార మార్గం ఉంటుంది అనేది వాస్తవం అదే ప్రకృతి దర్మం. అలాగే ప్రారబ్ద కర్మ కి కూడా ఒక పరిష్కారం ఉంది. కానీ దాన్ని అనుభవించే తీరాలి అయితే దైవ నామ స్మరణ తో కొంత ఉపశమనం దొరుకుతుంది. దాన్ని ప్రభావితం తగ్గించుకునే ప్రయత్నం చేయడానికి వీలు ఉంది. అది ఎలాగో అంటారా ఈ క్రింది కథను చదవండి.

అవంతీ నగరంలో ఒక వేదపండితుడు ఉండేవాడు ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయలుకున్నా ఇతడి చేత చేయించేవారు.. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వలన యజ్ఞాలు చేశాడు. యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లాడి జాతకచక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది.. గుండెఝల్లుమంది. అయినా మళ్ళి మళ్ళి వేశాడు. ఎన్నిసార్లు చుసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు ''బాబోయ్! నేను పండితుడిని. వీడు గజదొంగ. పండితపుత్రుడు పరమ శుంఠ'' అనేమాట నిజమౌతుందేమో!''అని భయపడ్డాడు. ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కాని మనస్సుని అదుపు చేయాలి. ఎలా? ఎలా? ఎలా? అని అలోచించి ఆరోజు నుండి పిల్లాడికి రామాయణ భారత, భాగవతాలు, గరుడపురాణం లాంటి పురాణాలు బాగా పిల్లాడికి చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడపురాణం మరీమరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది.. ఈ తప్పు చేస్తే ఈశిక్ష పడుతుంది. ఆ తప్పుచేస్తే మరో శిక్ష పడుతుంది.. బంగారం దొంగతనం చేస్తే కుష్ఠు వ్యాది వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాది వస్తుంది. ఎవరినైనా దూషించడం, పరులమీద నిందలు వేయడం, గురువులని వేదాలని నిందించడం, దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే తీసుకుతీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈకుర్రాడు కూడా పండితుడు అయ్యాడు.. ఇతడి పేరు కూడా క్రమంగా ఆనోటా ఈనోటా పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది..

రాజుగారు ఆపండితుడి తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ! భూసురోత్తమా! నీ కుమారుడి గుణగణాలు విన్నాను. ఇక నుండి నాదగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వేళ్ళాడే కాని మనస్సంతా ఆందోళన.. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నాదగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరబాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది.

Source - whatsapp sandesam

No comments:

Post a Comment