Sunday, July 26, 2020

ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.

👌 ఒక చిన్న బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బాలుడు అన్ని విషయాలలో చాలా చురుకుగా, తెలివిగా మరియు చూడడానికి అందంగా ఉండేవాడు. ఆ బాలుని తల్లి ఎప్పుడూ విచారంగా ఉండేది.

ఒకరోజు ఆ బాలుడు తల్లిని , ఎందుకమ్మా ఎప్పుడూ విచారంగా ఉంటావు? అని అడిగాడు. దానికి ఆమె ” ఒక జ్యోతిష్కుడు నీకు ఉన్న ప్రత్యేకమైన పలువరుస (పళ్ళు) కారణంగా నీకు చాలా కీర్తి, ప్రతిష్టలు వస్తాయి అని చెప్పాడు” అని చెప్పింది. దానికి ఆ బాలుడు అందులో విచారించవలసినది ఏముంది? నాకు కీర్తి రావడం నీకు ఇష్టం లేదా? అని అడిగాడు. బాబూ; ఏ తల్లి తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకోదు? నాకు ఇష్టమే, కాని నీకు వచ్చే కీర్తి,ప్రతిష్టల కారణంగా నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమో అని భయంగా ఉంది,అని చెప్పింది.

అదివిన్న బాలుడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకుని తన పలువరుస(పళ్ళు) ఊడిపోయేలా కొట్టుకోసాగాడు. అతని నోటి నుండి రక్తం కారసాగింది.

ఇంటినుండి బయటకు వచ్చిన ఆ తల్లి అది చూసి ఆశ్చర్యంతో, బాధతో ఎందుకలా కొట్టుకుంటున్నావని ఆ బాలుని అడిగింది. అప్పుడు ఆ బాలుడు ఈ పలువరుస(పళ్ళు) కారణంగా నేను నీకు దూరమౌతానంటే, అలాంటి పలువరుస(పళ్ళు) నాకు వద్దమ్మా, నేను నీకు సేవ చేస్తూ నీ ఆశీస్సుల వల్ల మాత్రమే జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.🙏



Source - Whatsapp Message

No comments:

Post a Comment