🏼 నేటి చిట్టి కథ ✍🏼
ఈరోజు మంచిమాట. రామాపురం లో ఉండే వెంకయ్యకు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని తాపం వుండేది..
ఎలాగయినా సాధన చేసి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.
ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.
గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది.
ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.
ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.
మీ అనుగ్రహం కోసం వచ్చాను అని వెంకయ్య చెప్పేడు.
ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు.
ఇతనిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు.
వెంకయ్య ఎంత ప్రయత్నించినా దీపం వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని గురువుగారితో చెప్పాడు.
అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి ఇప్పుడు వెలిగించమని చెప్పారు...
వెంకయ్యకు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు. ...
అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు.
సరే అని ఆ విధం గానే చేసి దీపం వెలిగించగలిగాడు...వెంకయ్య.
ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు.
గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు.
అప్పుడు వెంకయ్య తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు.
గురువుగారు ఈ విధమగా వివరించారు.
నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది.
అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.
అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించ లేకపోతున్నావు.
అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని ప్రేమ,కరుణలతో నింపు.
ఆత్మని విచక్షణతో సాధన అనే ఎండలో ఆరబెట్టు.
హృదయాన్ని సాధన నమ్మకం అనే నూనెతో నింపు.
అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది.” అని జ్ఞాన బోధ చేసారు గురువుగారు
🌸🌸🌸🌸🌸🌸🌸
మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.
కాని చీకటి అనే అజ్ఞానం తో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించ లేకపోతున్నాము.
ఈ స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.
🌸🌸🌸🌸🌸
అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.
సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు.
గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు👏
Source - Whatsapp Message
ఈరోజు మంచిమాట. రామాపురం లో ఉండే వెంకయ్యకు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని తాపం వుండేది..
ఎలాగయినా సాధన చేసి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.
ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.
గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది.
ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.
ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.
మీ అనుగ్రహం కోసం వచ్చాను అని వెంకయ్య చెప్పేడు.
ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు.
ఇతనిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు.
వెంకయ్య ఎంత ప్రయత్నించినా దీపం వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని గురువుగారితో చెప్పాడు.
అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి ఇప్పుడు వెలిగించమని చెప్పారు...
వెంకయ్యకు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు. ...
అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు.
సరే అని ఆ విధం గానే చేసి దీపం వెలిగించగలిగాడు...వెంకయ్య.
ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు.
గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు.
అప్పుడు వెంకయ్య తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు.
గురువుగారు ఈ విధమగా వివరించారు.
నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది.
అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.
అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించ లేకపోతున్నావు.
అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని ప్రేమ,కరుణలతో నింపు.
ఆత్మని విచక్షణతో సాధన అనే ఎండలో ఆరబెట్టు.
హృదయాన్ని సాధన నమ్మకం అనే నూనెతో నింపు.
అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది.” అని జ్ఞాన బోధ చేసారు గురువుగారు
🌸🌸🌸🌸🌸🌸🌸
మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.
కాని చీకటి అనే అజ్ఞానం తో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించ లేకపోతున్నాము.
ఈ స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.
🌸🌸🌸🌸🌸
అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.
సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు.
గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు👏
Source - Whatsapp Message
No comments:
Post a Comment