Wednesday, November 25, 2020

ఓం శాంతి శాంతి శాంతి: అనగా

ఓం శాంతి శాంతి శాంతి:

అనగా

మొదటిసారి శాంతి అనగానే ...
మనకి మనవారికి,
దుఖః బాధలు
తొలగాలని,

రెండవసారి శాంతి అనగానే
మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణి కోటి
సుఖంగా ఉండాలని,

మూడవసారి శాంతి: అనగానే ప్రకృతిపరంగా, గ్రహాల
పరంగా ఏ ఉపద్రవాలూ భూమండలాన్ని తాకవద్దని కోరుకోవటము.



ఏ ప్రార్ధన చివరిలోనయినా మనం ఓం శాంతి శాంతి
శాంతి:

అని 3 సార్లు ఉచ్చరిస్తూవుంటాము.


విధంగా 3 సార్లు ఆనడంద్వార.....

3రకాలయిన తాపాలు (భాధలు)తొలగాలని భగవంతుని ప్రార్ధించడమన్నమాట.

ఓం శాంతి...
(ఆధ్యాత్మిక తాపంచల్లారుగాక)

ఓం శాంతి...
(ఆది బౌతికతాపం చల్లారుగాక)

ఓం శాంతి: (అది దైవిక తాపం చల్లారుగాక)

1. ఆధ్యాత్మిక తాపం అంటే, శరీరానికి సంబంధించిన వివిధరకాలైన రుగ్మతలు (రోగాలు మొదలైనవి)
తొలగాలని.

2. అది బౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే భాధలు, ప్రమాదాలు తొలగాలని.

3. అది దైవిక తాపం అంటే, దైవవశంవల్ల కలిగే భాధలు యక్షులు, రాక్షసులు మొదలైన వారివల్ల కలిగే ఊహకు కూడా అందని భాధలు, ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్ధించడం.

ఓం శాంతి, శ్శాంతి శ్శాంతి:
అని 3 సార్లు చెప్పడంలో

ఇంత అర్ధం దాగివుంది అని పెద్దలు చెపుతారు...!!

Source - Whatsapp Message

No comments:

Post a Comment