Thursday, December 31, 2020

మీరు ఏ పూజా చేయలేకపోయినా రోజూ మనస్పూర్తిగా నవ్వగలిగారంటే ఏ రోగాలూ మీ దరిచేరవు. ఆనందో బ్రహ్మ

దేవుడు అంటే మనిషే అయినపుడు, దేవుడికి కోపం వచ్చింది అంటే మనిషికి కోపం వచ్చింది అని అర్ధం.

దేవుడు అంటే ప్రత్యేకంగా ఎవరూ లేరు.
మనిషి రెండు రాళ్ళతో నిప్పుని పుట్టించి తిండిని కనిపెట్టాక ఉండడానికి ఒక గూడు తయారుచేసుకున్నాడు.

ఆ గూటిని రక్షించుకోడానికి ఒక భయాన్ని సృష్టించాడు.
ఆ భయం పేరే దేవుడు !

మనిషికి ఏదో ఒక భయం అనేది కాస్తో కూస్తో ఉండాలి. ఆ భయం లేనివాళ్ళు ఉగ్రవాదులుగా తయారు అవుతారు.
భయపడే మనిషి ఎపుడూ తప్పు చేయడు. భయం లేనివాళ్ళే తప్పులు చేస్తారు.

భయం ఎందుకు లేదు అంటే దేవుడు లేడు అని నమ్మడమే !

దేవుడు ఎందుకు లేడు అంటే సాటి మనిషిని ఇంకొక మనిషి పట్టించుకోకపోవడమే !
ప్రతి మనిషీ దేవుడే అయినపుడు ఒకరిని ఇంకొకరు పట్టించుకోవాలి.

ఇక పూజలెందుకంటే మనిషి మనుగడకు క్రమశిక్షణ అవసరం.

రోజూ విధిగా చేయవసిన పనులు కొన్నిటిని ఏర్పరిచారు.అందరూ ఒక్కలాగే ఉండలేరు కనుక వివిధ విధి విధానాలు రూపొందించారు.

సూర్య నంస్కారం దగ్గరనుండి ధ్యానం,నమాజ్ ప్రతిదీ పూజే !

ఎవరికి నచ్చినపద్ధతి వారు అవలంబించవచ్చు.క్రమశిక్షణ అవసరం లేదనుకుంటే దేవుడిని నమ్మకుండా ఉండవచ్చు అది మీ ఇష్టం.

ఇక వేదాలు,మంత్రాల వల్ల వాక్కు పవిత్రమవుతుంది.
వేదోచ్చారణ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఖురాన్ చదివినా,
బైబిల్ చదివినా,
భగవద్గీత చదివినా...
అందరూ చెప్పేది ఒకటే,దేవుడొక్కడే !

పూజ చేయడం లేదని భయపడుతున్నాం అంటే క్రమశిక్షణ లేదని భయపడుతున్నట్లే !

భయం అంటే దేవుడు,
దేవుడు అంటే మనిషి.

ఉన్నాడో లేడో తెలియని దేవుడుకోసం బ్రతికేఉన్న మనిషి భయపడుతుంటే లేనిదేవుడేమనుకోవాలి ?

అత్యంత స్వేచ్చకోసం అత్యంత క్రమశిక్షణ అవసరం అని ఒక మహనీయుడి ఉవాచ !

మనిషికి సాంకేతికత పెరిగిపోయి ఈ మంత్రాలు వద్దు అనుకుని ధ్యానం అని మొదలుపెట్టారు.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస !

మీకు దేనిమీద ధ్యాస ఉంటే అదే మీకు దక్కుతుంది.

మహమ్మదీయులు,బ్రిటీషర్లు వ్యాపారం కోసం వచ్చారు.
వాళ్ళకు వ్యాపారం మీదే ధ్యాస ! మనకు ఆనందం మీదే ధ్యాస !

మీకూ ఆ ఆలోచనా శక్తి ఆ దేవుడివ్వాలని(మనిషే) కోరుకుంటున్నాను.

మీ ధ్యాస దేనిమీద ఉంటే అదే మీకు దక్కుతుంది.

మీ ధ్యాస దేవుడిమీద ఉంటే దేవుడు,
కత్రినా కైఫ్ మీద ఉంటే కత్రినా కైఫ్ దక్కుతుంది.

ఎవరు ఎవరిని పూజించాలి ?

వేదాలు అందరూ చదవలేరని తెలిసాక బ్రాహ్మణులే గొప్పవారని వర్ణాలలో ప్రధమ స్థానాన్ని ఇచ్చారు.

మనిషి మనసులో ఏది నాటితే అదే మహావృక్షమవుతుంది.

ఆ మహావృక్షాన్ని పెకిలించాలంటే ఒక్కరితో సాధ్యం కాదు.మనుషులలో సమిష్టి తత్వం లోపించితే వచ్చేది అసహనమే !

ధ్యానం అంటే పూజ,
పూజ అంటే ధ్యాస !

మన మీద మనకు ధ్యాస ఉంటే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం !

మనల్ని మనం ప్రేమించుకున్నకొద్దీ ప్రతిదీ ప్రేమమయం గానే కనిపిస్తుంది.

ప్రేమ ఉన్నచోటే అసూయ ఉంటుంది.
అసూయ చెందుతున్నామని ఎవరికివారికి తెలుస్తూనే ఉంటుంది.

అసూయ ఫక్కున నవ్వితే పోతుంది కానీ నవ్వించేవారెవ్వరు ?

మనకు నచ్చినవారిని నవ్వించగలం కానీ నచ్చనివారిని నవ్వించడమెలా?

నవ్వడం కూడా ఆరోగ్యమే,
నవ్వించేవాడూ దేవుడే !

కాబట్టి మీరు ఏ పూజా చేయలేకపోయినా రోజూ మనస్పూర్తిగా నవ్వగలిగారంటే ఏ రోగాలూ మీ దరిచేరవు.
ఆనందో బ్రహ్మ :

మీ... సూర్య, మోహన్

Source - Whatsapp Message

No comments:

Post a Comment