Tuesday, December 15, 2020

మన జాతీయగీతం కథ మన బానిస బ్రతుకులకు నిదర్శనం.

మన జాతీయగీతం కథ
మన బానిస బ్రతుకులకు నిదర్శనం.

స్వాతంత్రానికి ముందు బంకించంద్ర చటర్జీ తన నవల ఆనందమఠ్ లోనిది వందే మాతర గీతం. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన నవల ఇది. బంకించంద్ర చటర్జీ ఈ నవల వ్రాసిన 12 సంవత్సరాల తరువాత, ఆయన చనిపోయిన తరువాత ముద్రించ బడింది. బ్రిటీష్ వారి చేత ఈ నవల ఎన్నోసార్లు నిషేధించ బడింది. ఈ నవలోని వందేమాతర గీతం బహుళ ప్రచారం పొంది ప్రతి యువకుడి నోట, ప్రతి విప్లవ వీరుడి నోట ఈ గీతం పాడడం మొదలైంది. భారత యువతకు, స్వాతంత్రసమర యోధులకు ఈ గీతం ప్రణవనాదంగా మారింది. ఖుదీరాంబోస్ ను ఉరి వేసే సమయంలో ఆ మహావీరుడు ఉరి త్రాటిని మెడకు తగిలించుకుని ఈ గీతాలాపనతోనే ప్రాణాన్ని విడిచాడు. నాటినుండి విప్లవ వీరులకు వందేమాతర గీతం ఉత్తేజ గీతంగా కొనసాగింది.

ఈ గీతాన్ని విన్నప్పుడల్లా ఆంగ్లేయుల హృదయాలు అగ్ని కీలలయ్యేవి. దీని ప్రతిగా ఇంకొక గీతం తయారు చేయాలనుకున్నారు. 1912 లో జార్జి 5 భారతదేశ సందర్శన సందర్బంగా ఒక మంచి అవకాశం వారికి చిక్కింది. రవీంద్రనాథ్ ఠాగూర్ల కుటుంబం ఆంగ్లేయులకు విధేయులు. రవీంద్రనాథ్ ఠాగుర్ అన్న అవనీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ఈస్టిండియా కంపెనీ డైరక్టరుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. జార్జి 5 భారతదేశ సందర్శన సందర్బంగా రవీంద్రనాథ్ ఠాగూర్ చేత జార్జి5 ను పొగుడుతూ ఒక గీతం వ్రాయించారు. అదే నేడు మనం మన జాతీయ గీతంగా పాడుకుంటున్నది. మన బానిస బుద్దికి ఇది మంచి నిదర్శనం. రవీంద్రనాథ్ ఠాగూర్ కు నోబల్ బహుమతి రావడానికి వెనుకఉన్న కారణం కూడా ఇదే.

జన గన మన అధినాయక జయహే భారత భాగ్య విధాతా – భారత జన హృదయాధినేత, భారత భాగ్య విధాతా నీకు జయమగుగాక.

పంజాబ, సింధు, గుజరాత, మరాఠా, ద్రవిడ ఉత్కళ, వంగా తవ శుభ నామే జాగే, తవశుభ ఆశిష మాహే – పంజాబ్, సిందు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ రాజ్యాలు ఓ జార్జి 5 నీ నామజపం తోటే నిద్ర లేస్తాయి, నీ శుభ ఆశిస్సులనే ఆకాంక్షిస్తాయి.

గాహే తవ జయ గాధా – నీ విజయ గాథను కీర్తిస్తాయి.

జన గన మంగళ దాయక జయహే భారత భాగ్యవిధాతా – ప్రజలకు శుభములను చేకూర్చు ఓ భారత భాగ్యవిథాతా నీకు జయమగుగాక.
జయ జయ జయహే – నీకు జయమగు గాక, నీకు జయమగు గాక, నీకు జయమగు గాక
ఇదీ దీని అర్థం..... ఇక మీరు ఊహించుకోవచ్చు.

ఆంగ్లేయ అధికారులు నాపై వత్తిడి తెచ్చి ఈగీతాన్ని రాయించారని రవీంద్రనాథ్ ఠాగూర్ తన బావగారికి వ్రాసిన లేఖలో చెప్పారు. ఈలేఖను నేను చనిపోయిన తరువాత వెల్లడించమనికూడా తెలిపాడు.

భారత నేషనల్ కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉండేవి ఒకరు అతి వాదులు, రెండు మిత్ వాదులు. అతివాదుల నాయకులు – లాలా లజపతిరాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాల్ కాగా మిత వాదుల నాయకులు గాంధీ, నెహ్రూ, మొదలైనవారు. మిత వాదులు బ్రిటీషు వారితో కలిసి రాజ్యంచేయాలని కోరుకుంటే, అతివాదులు సంపూర్ణ స్వరాజ్యం కావాలని కాంక్షించేవారు. కాంగ్రెసు సభలు జరిగినప్పుడల్లా అతివాదులు వందేమాతరగీతం పాడితే, మిత వాదులు కావాలని జనగనమన పాడేవారు. ఏ గీతాన్ని జాతీయ గీతంగా పరిగణిచాలనే చర్చ వచ్చినప్పుడు అతివాదులు వందేమాతరాన్ని సూచిస్తే మితవాదులు జనగనమన సూచించేవారు. మద్యేమార్గంగా గాంధీజీ విజఈ ఈశ్వతి రంగా ప్యారాను సూచించారు.

8మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత పార్లమెంటు సమావేశంలో ఉన్న 337 మంది సభ్యులు వందేమాతర గీతాన్ని జాతీయగీతంగా ప్రకటించమని అడిగితే ---- ఒకే ఒక్కరు జనగనమన గీతాన్ని సూచించారు. వారే మన దేశ ఉద్ధారకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ.... నెహ్రూ గారి సమాధానం వింటే జాతి మొత్తం ఆశ్చర్యపోతుంది. తక్కిన గీతాలు ఆర్కెస్ట్రాకు పనికిరావని నెహ్రూ అనే సంగీత సామ్రాట్టు గారు సభకు తెలియజేశారు.

జాతిని బానిసలుగానే ఉంచాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి. ఆ గీతం విన్నప్పుడల్లా నాకు జార్జి 5 ను స్వాగతిస్తున్న భారతదేశమే గుర్తుకు వస్తుంది. ఈ జాతికి విముక్తి ఎన్నడో....ఈజాతి స్వాభిమానంతో బ్రతికేది ఎన్నడో....

Source - Whatsapp Message

No comments:

Post a Comment