Monday, December 21, 2020

నిత్యజీవితంలో ఆందోళన మన దరి చేరకుండా ఉండాలంటే ఎలా ఉండాలి???

🍁 నిత్యజీవితంలో ఆందోళన మన దరి చేరకుండా ఉండాలంటే ఎలా ఉండాలి???🍁

✍️ మురళీ మోహన్

👌చేస్తున్న ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, సంసారాల గురించి...
ఇలా ఏ పని గురించైనా ఆందోళన లేకుండా ఉండాలంటే....
ఒకసారి ఈ శ్లోకం భావాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి.
భగవద్గీత లో నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా చెప్పాడు...

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమః సిద్ధా వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే

‘‘యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా జరిగే వాటిని పట్టించుకోవద్దు, యోగ మార్గంలో ఉన్న వారైతే అన్నీ యాదృచ్ఛికంగానే జరగుతుంటాయి, పని కట్టుకుని ఏదీ చేయకుండా వుంటారు’’ అని చెప్పాడు కృష్ణుడు.
ఇది గొప్ప యోగం... ‘‘ యదృచ్ఛాలాభసంతుష్టో’...
అనుకోకుండా ఏదో వస్తువు వచ్చింది అనుకుందాం, దాన్ని ఉపయోగించుకోవచ్చు ! పదార్థం అయితే తినవచ్చు, తిన్నతరువాత దాని గురించి ఆలోచించవద్దు వదిలేయాలి!
ఇంకా ఎక్కువ కావాలని అనుకోకూడదు, దొరికిన దానితో సంతృప్తి పడాలి,
జయానికి - అపజయానికి, రాగానికి - ద్వేషానికి, లాభానికి - నష్టానికి, దుఃఖానికి - సుఖానికి అతీతంగా ఉండాలి,
యాదృచ్ఛికంగా దొరికిన దానికి సంతోషించు, అదనంగా ఆశించకు. ద్వేషానికీ, దుఃఖానికీ కారణం అసూయ మాత్రమే..
మనం నోబెల్‌ బహుమతి పొందినా, ఆ సన్మానం జరిగేది ఐదు నిమిషాలే!
కానీ ఆ స్థాయికి చేరడానికి మనం చేసిన కృషిలో పొందే ఆనందమే ఎక్కువ...
బహుమతి పొందేముందు ఎలా ఉన్నామో - పొందాక కూడా అలానే వున్నప్పుడు, స్థితప్రజ్ఞ అంటారు, అది శాశ్వతం, అలా ఉండగలిగితే ఎలాంటి ఆందోళన మన దరిచేరదు...🤘

Source - Whatsapp Message

No comments:

Post a Comment