Thursday, February 11, 2021

" ఏమి నీ కోరిక ? " ఒక అద్భుత కధనం

" ఏమి నీ కోరిక ? " ఒక అద్భుత కధనం
.
ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు . చాలా ఆకలిగా ఉంది . అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం ?
.
.
సంత ఈ చివరి నుండి ఆ చివరికి
తిరిగాడు . ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది . దాని క్రింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమె అని .
.
.
ఆశ్చర్య పోయాడు పేదవాడు . అంత పెద్ద దీపం ఒక్క రూపాయే ఏమిటి అని ? దగ్గరకు వెళ్లి చూశాడు .
.
. అది అల్లాఉద్దీన్ అద్భుత దీపం లా ఉంది . సుమారు ఒక కిలో బరువు ఉంటుంది . అయినా ఒక్క రూపాయేనా ?
.
అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా ! అదీ అతడి ఆలోచన .
.
షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు . ఎందుకు అథ తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని ..
.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం . ఇందులో భూతం ఉంది . అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది . అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది . అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది . ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి . లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది . అదీ దాని కధ "
.

.
.
పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు . ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని రుద్దాడు . భూతం ప్రత్యక్షం అయ్యింది . " ఏమి నీ కోరిక ? " అడిగింది .
.
. తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు . క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది . భోజనం కాగానే
.
" ఏమి నీ కోరిక ? " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు . వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది . నిద్రపోతూండగా
.
" ఏమి నీ కోరిక ? " అడిగింది
.
ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు .
వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది .
.
" ఏమి నీ కోరిక ? " అడిగింది
.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు . కోరికలు అడుగుతూనే ఉన్నాడు . అవి తీరుతూనే ఉన్నాయి . అతడికి విసుగు వచ్చేస్తోంది .
.
ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది . భూతం తో పాటు సంపదలూ పోతాయి . ఎలా ?
.
.
.
.
పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు . ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు .
.
తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి " ఏమి నీ కోరిక ? " అడిగింది
.
భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు . వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం . అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు . పాతేసి " ఏమి నీ కోరిక ? " అడిగింది .
.
ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు . నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని అది అని చెప్పాడు పేద వాడు . భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది .
.
.

,
పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు . తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు . తన సౌఖ్యం , తన ఇరుగు పొరుగు సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు .
.
.
కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు . భూతం స్థంభం ప్రక్కన నిద్రపోతోంది .
.
.
తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు .

.
.

ఇక్కడితో కధ కాలేదు .
.
.

ఈ కధ మనది .
.
.
ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?
.

మన మనసే ఆ భూతం . అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది . ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని
.
.
.
సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్థంభం " మంత్రం " --- ఎక్కడం దిగడం మంత్రం జపం . జప సాధన !
.
. అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది .
.
అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది . మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది .
.
.
అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి , మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము . ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం ! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం!
.
.
.
.

మిత్రులారా !
.
మనం మనసు మాత్రమె కాదు . అతకన్నా ఎక్కువ . మనం అవినాశి అయిన ఆత్మలం .
.
.
మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం .చెయ్యలెము .
.
మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది . అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం .
.
.
మన మనసు మనకు ఆలోచననూ , విచక్షణనూ , కోరికలనూ , అవగాహననూ , విమర్శనాత్మక దృష్టినీ , న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ , ఎన్నింటినో ఇచ్చింది . దీనివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం !
.
.
.
.
. మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం . ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు . మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది
.
.
. ద్యానమూ , మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది . దాని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని నాశనమూ చెయ్యగలదు.
.

.
ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు . ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు .
.
మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం . జీవిత లక్ష్యాలను సాధించగలం . దాని మానాన దానిని వదిలేస్తే
( శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ , పగ , ప్రతీకారం , కామం , క్రోధం , గర్వం , అహంభావం , --- ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది .
.

.
మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి . అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి .
.

.
ఇది రవి చాబ్ర గారి టైం లైన్ లో చూసి అనువదించాను . నేను చేసిన అనువాదాలు అన్నిట్లోనూ ఇది నన్ను కదిలించిన పోస్ట్ గా నేను భావిస్తాను .
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment