Tuesday, September 7, 2021

మత మార్పిడి అసహన ద్వేషాలను ఇంకా సహించకూడదు - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

అసహన ద్వేషాలను ఇంకా సహించకూడదు

ఒక వైద్యుడు (గోదావరి జిల్లా) ఈ మధ్య మాట్లాడుతూ - "ఒక పేషంటు నా క్లినిక్కి వచ్చింది - తన తండ్రి తోడుగా. తన వ్యాధి వివరాలు సంప్రదించిన వెంటనే తండ్రిని వైద్యునివద్ద ఉంచి, తాను లేచి వెళ్లి తన కారులో కూర్చుంది. ఆ తొందర ఏమిటా అని ఆరా తీస్తే - ఈ క్లినిక్లో హిందూ దేవతల ఫోటోలు చూస్తుంటే కంపరంగా ఉంది. అందుకే భరించలేక వెళ్ళిపోయానని వివరించింది. నిజానికి కొద్ది రోజుల వరకు ఆమె హిందువే. మతం మారిన దగ్గరనుండి ఇలాంటి మనస్తత్వం ఏర్పడింది.

ఇలాంటి సంఘటనలు ఎన్నో! హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయాలపై దాడులు , ధర్మాన్ని అవమానించడం, కొట్టి హింసించి మతం మార్చడం కూడా జరుగుతున్నాయి. ఇళ్ళ మీదికి ఆ మార్పిడి మతగూండాలు దాడులు చేస్తారేమోననే భయం కూడా ఉంది" అన్నారు.

ఒక ఐటి కంపెనీ ఉద్యోగి చెప్పిన వార్త "మా ఆఫీసులో పొద్దునే శుభ్రపరిచే వ్యక్తి డెస్కుల దగ్గర ఉద్యోగులు ఉంచుకున్న వారి ఇష్టదేవతా చిత్రపటాలను తీసి డస్ట్బిన్లో వేస్తుంది. ప్రశ్నించడానికి అందరికీ భయమే. అట్రాసిటీ కేసులతో ఇబ్బంది పెడుతుందేమోనని భయం." మతం మారిన క్లీనర్ నిర్వాకమది.

"మా ఇంటికొచ్చిన మిత్రురాలికి అతిథి మర్యాదగా పులిహోర పెడితే, 'ఇది మీ దేవుని ప్రసాదం - మేము తినం' అన్నది. 'మా ఇంట్లో మంచినీళ్లు కూడా దేవుని ప్రసాదమే. నువ్వు వెళ్ళవచ్చు అన్నాను." అని ఓ గృహిణి చెప్పిన మాట. కానీ, వాళ్ల పండుగల కేకుల్ని తినే ఉదార హృదయ హిందువులు ఎందరో! వాళ్లు మాత్రం హిందూ దేవుళ్ల ప్రసాదం తినరు.

మరొకచోట, మార్పిడి మతసభలో ముఖ్య సభ్యుడు "మా మతంవాళ్ల కోసం ఒక దేశాన్నో, రాష్ట్రాన్నో ఇచ్చేయండి - తెలంగాణా ఇచ్చినట్టు, పాకిస్తాన్ ఇచ్చినట్టు" అని స్పష్టంగా చెప్పగానే సభలోనివాళ్ల చప్పట్లు మిన్నుముట్టాయి.

ఆ మధ్య ఒక మతమార్పిడి కూటమి సభలో ముందే నిర్ణయించుకున్న పథకం ప్రకారంగా -ఒకామె ఊగిపోతూవచ్చి, తనకు దెయ్యం పట్టినట్టు అభినయించింది. స్టేజి మీద ఉన్న మార్పిడి మత పెద్ద దెయ్యం వదిలించినట్టు నటిస్తూ -'ఓ దెయ్యమా! నీ పేరేంటి?" అని అడిగితే, 'బెజవాడ కనకదుర్గమ్మ' అని ఆమె బదులిచ్చింది. వెంటనే తమ మతదేవుని పేరుతో దెయ్యాన్ని వదలగొట్టినట్టు మత పెద్దగారు హంగామా చేశారు. హిందువులు భక్తిగా కొలుచుకునే దేవతను వారు దెయ్యంగా చెబుతుంటే ప్రతిఘటించలేని చేతకానితనం ఉంది కనుకనే, వాళ్లు విజృంభిస్తున్నారు.

సత్యము, ప్రేమ - లాంటి కబుర్లు చెప్పే ఈ మతాల మార్పిడి ముఠాలు ఆ రెండూ లేని కల్లడొల్ల గుంపులు - అని తేలుతూనే ఉంది. ప్రభుత్వపు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, మారిన మతంలో ప్రచార కార్యక్రమాల వ్యాపారాదాయాలను పొందుతున్న 'అబద్ధపు బ్రతుకులను' - వాళ్ల ప్రభువు క్షమిస్తాడా?

విదేశీ మిషనరీల ద్వారా దొడ్డిదారి సొమ్ములు పొందుతూ, 'దశమభాగా'లను మింగుతూ అక్రమార్జనలను మరిగిన ఈ 'దేవుని బిడ్డలు' - ఒకప్పటి తమ హిందూ మతాన్నీ, ఆచారాలనీ, దేవుళ్లనీ తూలనాడుతూ జీవిస్తున్నారు. 'ఈ పాపమునకు జీతము వారి పరలోక ప్రభువు తప్పక ఇచ్చును'.

వీరి చేతలన్నిటిలో కనిపిస్తున్న అంశాలు - 1) మరొక మతంతో కలిసి బతకలేరు. 2) అన్యమతాలపట్ల అసహనం, ద్వేషం తీవ్రం. 3) అధికారం కోసం, అధికారం అడ్డుపెట్టుకుని తమ మతరాజ్యంగా రాష్ట్రాన్ని దేశాన్ని మార్చే ప్రయత్నం స్పష్టం. వంచన, హింస స్వభావంగా కలిగిన ఈ క్షుద్రమతాలు అల్పాయువు కలిగినవే అయినా చేస్తున్న దేశ సంస్కృతి ద్రోహాలు భీకరంగా ఉన్నాయి.

కొంతమంది ధర్మరక్షణ కోసం, దేశం క్షేమం కోసం వాపోతూ ఉన్నా, అది అరణ్యరోదనే అవుతోంది. మార్పిడి మతాల దాష్టీకం కొనసాగుతూనే ఉంది.

హిందూ హృదయాలను తూట్లు పొడిచి నింద, ద్వేషం పునాదులుగా మార్పిడులు చేసుకుంటున్న సిగ్గుమాలిన మతాలకు పాలనాంగాల వత్తాసు, చేయూత పుష్కలంగా ఉంది. పోలీసు యంత్రాంగం వారిని ఆదుకోవడమేకాక న్యాయం కోసం అర్థించే హిందువులను హింసిస్తున్నారని కూడా వార్తలొస్తున్నాయి.

ఇతరుల్ని మార్చడమే స్వర్గానికి దారి అనే సిద్ధాంతం ప్రగాఢంగా కలిగిన మతం ఎవరినీ తన మానాన తనను బతకనివ్వదు. కార్యాలయాల్లో, దుకాణాల్లో, బస్టాండులలో, విద్యాసంస్థల్లో ఆటో - ట్రెయిన్‌లాంటి వాహనాల్లో... అన్ని చోట్ల కరోనా క్రిమి కంటే కరాళంగా నిండిపోయి, కరపత్రాలు పంచుతూ, బోధలు చేస్తున్న ఈ మార్పిడి మహమ్మారి కీటకాల కిరాతకాన్ని మీడియావారు, రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించవు. పైగా తమ ఉనికి కోసం ప్రోత్సహిస్తున్నాయి కూడా.

సంస్కృతి, భాష, సంప్రదాయం, అనుబంధాలు, దేశీయభావం, పరంపర..... ధ్వంసం కావడమో, కలుషితమవడమో ఈ మార్పిడుల పర్యవసానం. కేవలం మతం కారణంగానే పలుముక్కలైన దేశచరిత్రను నేటితరం తెలుసుకోవాలి. ఈ దశలోనైనా మేల్కొని హిందువులు మార్పిడికి, వంచనకి గురికాకుండా ఉద్యమించకపోతే విషమ పరిణామాలు తప్పవు.

అసలు హిందువులే ఎందుకు మతం మారుతున్నారు? అనే ప్రశ్నకి సరియైన సమాధానాలు గ్రహించాలి.

౼ కులభేదాలవల్లా? ఇది సరికాదు. మతం మారినా కులభేదాలు వదలడం లేదు కదా!

౼ 'అన్ని మతాలూ ఒకటే కదా! ఏ దేవుడైతే ఏం పోయింది?' అనే భ్రాంతి ఒక కారణం. తన ధర్మంపై అవగాహనారాహిత్యం - పెద్ద కారణం.

౼ "నా మతం గొప్పది. అమ్మవంటిది. తత్త్వచింతన, ధర్మం, సంస్కారం వంటి ఉదాత్త భావాలు కలది" అనే స్వాభిమానం లేకపోవడం మరో కారణం. పెద్దలు తమ పరంపరను పాటించక, పిల్లలకు బోధించకపోవడం ఇంకో కారణం. ప్రలోభాలకు లోబడే పాపబుద్ధి ముఖ్యహేతువు.

౼ విద్యావ్యవస్థలో మన సంస్కృతి, సద్గ్రంథాల పరిజ్ఞానం, బోధ లేకపోవడం కూడా వీటికి దోహదపడుతోంది.

"హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, దేశక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా - మరో స్వాతంత్రోద్యమమంత ఎత్తున - వెల్లువెత్తవలసిన తరుణమిది."
ఆ స్ఫూర్తి, సాధన, సాఫల్యం పరమేశ్వరుడు హైందవజాతికి ప్రసాదించుగాక.

- పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment