Monday, September 27, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

కెరటం నాకు ఆదర్శం. పడినందుకు కాదు పడినా తిరిగి లేచినందుకు.నేటి తరానికి ఇది అర్దం అయితే చాలు.అందరూ వివేకానందులు అయినట్లే.

అంటే జీవితం ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో కెరటాలు రావడమూ,పడటమూపడినా తిరిగి లేవడమూ ఇది నిరంతర ప్రక్రియ అని భావం.అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఎదురౌతాయి.వాటిని కాచుకోవాలి ఎదుర్కోవాలి అని అర్దం. ఎవరి జీవితమూ పూలపాన్పు కాదు అని అర్దం.

యుగ యుగాలుగా తరతరాలుగా మనమంతా దేవుళ్ళని భావించి పూజిస్తున్న రాముడూ,కృష్ణుడూ,సీతమ్మ తల్లీ మొదలు నేటి దిగ్గజాలు అనుకునే వారివరకు ఎవరి జీవితం పూలపాన్పు కాలేదు .

రాముడు దేముడే కదా! అరణ్యవాసం ఏమిటండీ? కృష్ణుడు దేవుడే కదా చెరసాలలో పుట్టడం ఏమిటండీ? సీతమ్మ తల్లి దేవతే గదా వనవాసం ఏమిటండీ? అంటే కష్టాలు అందరికీ వస్తాయి,పోతాయి అని తెలుసుకోవాలి.ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించాలి. అన్ని కష్టాలు,బాధలు పడి వున్నారు కాబట్టే నాటి నుండి నేటి వరకు దేవతలుగా వెలుగొందుతున్నారు.

అందుకే నరేంద్రనాథ్ దత్తా అదేనండి స్వామి వివేకానంద ధైర్యమే దైవం,భయమే దయ్యం అన్నారు.ధైర్యంగా ఉండాలన్నా,భయం వద్దనుకున్నా చక్కటి శుద్ధమైన సాత్వికాహారం శాకాహారం మితాహారం తీసుకోవాలి.శ్వాస మీద థ్యాస తో థ్యానం చేస్తూ శాంతంగా ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి.
ఇదే జీవిత పరమార్థం .

శుభోదయం తో మానస సరోవరం. 👏

సేకరణ

No comments:

Post a Comment