Wednesday, September 8, 2021

అధికారం ధనం ప్రేమ..కర్మ సిద్ధాంతం

అధికారం ధనం ప్రేమ..కర్మ సిద్ధాంతం

ఒక వ్యక్తి ని పరీక్షించ దలచుకుంటే అధికారం కానీ ధనం కానీ లభింప చేయాలి. అతడి అంతర్గత గుణం వ్యక్తిత్వం వెలికి వస్తాయి.

భగవంతుడు కొన్ని ఇచ్చి పరీక్షిస్తాడు.కొన్ని దూరం చేసి పరీక్షిస్తాడు. ప్రారబ్ధ కర్మలో ఈ అధికార ధనాలు పొందాలనే ఉంది కాని, దాని వల్ల అహంకారం పొందమని కానీ, దుర్వినియోగం చేయమని కానీ లేదు.

కర్మ సిద్ధాంతానుసారం దుర్వినియోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకి లభించిన శక్తి ఒక సత్కర్మ ఫలితమే అని గ్రహించాలి.. అలా లభించిన శక్తి పది మందికి ఉపయోగ పడేలా చేయక పోయినా,
లాభం తో , స్వార్ధం తో అహంకారం తో తన స్వ ప్రయోజనానికి మాత్రమే పరిమితం చేసుకుంటే , లభించిన ఆ శక్తి ,తిరిగి ఎప్పటికి , ఏ జన్మ కి లభించదు. తిరిగి మళ్లీ ఆ శక్తి పొందాలంటే ,అంతటి కృషి శ్రమ అటువంటి కర్మ చేయ వలసిందే..

అధికారం ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తే, హింస పెడితే, ఆ ఆధికారం ఒక భయంకర చక్రం లా తిరిగి అతడి పైకి వస్తుంది.. తాను ఇతరులను ఎలా పీడించాడో , దుఃఖం కలిగించాడో మరచి పోయి , " దేవుడు కాపాడడా ? అని ఒకరోజు దుఃఖిస్తాడు..

ఇదే విధం గా ఎంతో ప్రేమ ని పొందినా తిరస్కరించి , అవమానించి , దూరం చేసినా,, ఇదే ఫలం. తల్లి తండ్రి. ప్రేయసీ ప్రియులు అక్క తమ్ముడు ప్రతి బంధానికి ఈ కర్మ వర్తిస్తుంది..

ప్రేమ కి ద్రోహం చేస్తే , తిరిగి , తాను కోరుకున్న చోట ఆ ప్రేమ లభించక పోగా , అదే ద్రోహానికి మోసానికి గురి అవుతారు.. ప్రతి ఒక్కరు తాను ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించారో జ్ఞాపకం తెచ్చుకోరుగా..

ప్రతి ఒక్క కర్మ స్వయం కృతమే. దీనిని తెలుసు కోకుండా భగవంతుడిని నిందిస్తారు.. అధికారం పొందగానే సర్వ విధ జ్ఞానం పొందినట్లు అనిపిస్తుంది. కొద్దీ అధికారమే సంపూర్ణం గా. వినయాన్ని. హరిస్తుంది..ప్రతి మాట. ఒక దుష్కర్మ గా మరి ఒక శరం లా తిరిగి వస్తుందని గ్రహించరు..

వ్యంగ్యాలు వెటకారాలు పరుష వాక్కులు ఉత్తముడని తెలిసినా నింద లు వేస్తూ హృదయాన్ని గాయ పరుస్తూ మాట్లాడే. అహంకారులు ఎందరో. ఉన్నారు..దీనికి. కర్మ ఫలం గా. వారి. మనస్సు భవిష్యత్తు లో అతి దారుణంగా శిక్షించ బడుతుంది అనే విషయం గ్రహించరు..ఆనాడు. పరుష వాక్కులు చాలా " తప్పు ".అనే. విషయం గ్రహిస్తారు.

అహంకారం విపరీతం అవుతుంది తన క్రింద పని చేసే వాళ్ళందరు
తెలివి తక్కువ వాళ్ళు గా కనిపిస్తారు.. తన క్రింద పనిచేసే వారికి
కీర్తి పేరు వస్తే తమ గొప్పతనం తగ్గిపోతుందని...వారిని. ప్రతిక్షణం కించ పరుస్తూ అవమానిస్తూ మాట్లాడతారు.. ఈ. అధికారం లేకపోతే తాము ఇలా మాట్లాడ లేమనే విషయం. వారికి. గుర్తుకు. రాదు.

చాలామంది అధికారులు ఆత్మన్యూనత భావం తో
బాధ పడతారు. దీని వలన ఒక భజన బృందం చుట్టూ ఏర్పడుతుంది.
ఇది పతనానికి మార్గం..

వంద యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి పొందిన నహుషుడు అధికారం
తో గర్వించి సప్త ఋషులను అవమానించాడు...ఒక సర్పమయి
అరణ్యం లో పడి ధర్మ రాజు తో తన దీన గాధ చెప్పుకుంటాడు.
వినయం కలిగిన అధికారులు చాలా తక్కువ..


మీ మాట లోని శృతి లో మీ అహంకారం లేదా వినయం శాంతం
సౌజన్యం వినిపిస్తాయి....పరీక్షించుకుందామా. !
డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment