Wednesday, September 8, 2021

ఏ పనీ అల్పం కాదు.

ఏ పనీ అల్పం కాదు.

ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు.

అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి

దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.

పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.

ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.

ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.

మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.

సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

జననం-మరణం,
మంచి-చెడు,
జ్ఞానం-అజ్ఞానం,
వీటి మిశ్రమాన్నే మాయ అంటారు.

ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.
జీవితం పోరాటాల,భ్రమల పరంపర.

జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.

విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది.

అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.

చెలిమిని మించిన కలిమి లేదు,
సంతృప్తిని మించిన బలిమి లేదు.

విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ.

అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.

మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.
అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు.

చిత్తశుద్ది,పట్టుదల,ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం.

కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.
స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.

సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.

నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.
మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది.

వినయం మనిషికి భూషణం వంటిది.

ఈ జీవితం క్షణికమైనది,
లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు.



Source - Whatsapp Message

No comments:

Post a Comment