Wednesday, December 29, 2021

💐రతన్ టాటా గారి జన్మదినోత్సవం సందర్భంగా💐

🔥వ్యక్తిత్వంలో వజ్రం -మన💎 జాతికి దొరికిన రత్నం.....🌟
🕉️🌞🌎🏵️🌼🚩

💐రతన్ టాటా గారి జన్మదినోత్సవం సందర్భంగా💐

రతన్ టాటా,స్వామి వివేకానంద.... ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా యువతకు ఆదర్శప్రాయుడు. వ్యాపార విలువలు, మంచితనం, సింప్లిసిటీతో ఆయన ముందుకుసాగుతున్నారు.
దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేతల్లో రతన్ టాటా ఒకరు. మంచి మనసు, వినూత్న ఆలోచనలు, సింప్లిసిటీతో ఆయన ప్రజల మనసుల్లో అత్యున్నతంగా ఉన్నారు. పాజిటివ్ థింకింగ్​ ఆయనను ప్రస్తుతం ఈ స్థాయికి చేర్పించింది.


డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు డిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.
కారణం ఆ నాల్గవ వ్యక్తి రతన_టాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని౹౹ కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]

టాటా గ్రూప్ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !
బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.
యవ్వనంలో ఆయన గర్ల్ ప్రెండ్ మోసం చేసింది.

ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.
కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :

టాటా సంస్థ అయిన TCS యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.

భారతదేశపు GDP కి టాటా సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.

ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క టాటాసంస్థనే దేశానికి చెల్లిస్తుంది.

నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క TajHotel మీద ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య టాయిలెట్ లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ టాటా సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.

రతన్ టాటా,స్వామి వివేకానంద.... ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.

#దేశ సంపద#

రతన్ టాటా గారు చెప్పినది:*

" ఒక సారి మేము జర్మనీ వెళ్ళాము . అది ధనిక దేశం . ఒక రోజు మేము ఒక హోటల్ కి వెళ్ళాము .
చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి . ఆశర్యపోయాము అక్కడ అందరూ ఒకటో రెండో డిష్ లు తెప్పించుకుని పూర్తిగా తిని వెళ్తున్నారు .
ఒక మూలన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు .
ఇంత ధనిక దేశం లో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు
మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకుని తిన్నాం . కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యయనో వదిలేశారు మా వాళ్ళు . తెప్పించుకున్న దాంట్లో మూడోవంతు వదిలేశారు మా వాళ్ళు
మేము లేచి వెళ్లి పోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరకి వచ్చి అలా వేస్ట్ చెయ్యకూడదు అంది
మా ఫుడ్ . మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడారు . అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది . వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది .
పోలీసులు వచ్చారు . జరిగినది విన్నారు .50 యూరోలు ఫైన్ వేశారు మాకు .
చెల్లించి వచ్చాము .
వాళ్ళు అన్నది
" డబ్బులు నీవి . కానీ ఇక్కడి రిసోర్స్ నీవి కావు . అందరివీ . ఇంకొకడు తినవలసినది నువ్వు పాడు చేశావు . ఆరకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు . దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు "
.
మనం పెళ్ళిళ్ళలో ఎంత దుబారా చేస్తాం ? ఇది మనకు ఒక గుణ పాఠం కాదూ ?
మనం దీని నుండి నేర్చుకోవాలసిన అవసరం ఉంది.

🙏🙏💐💐🙏🙏
Collected by
A.Srinivasa Reddy

🍀🌹🌻🍁🦜💦💥

సేకరణ

No comments:

Post a Comment