Wednesday, February 23, 2022

భగవద్గీతలో ఒక ప్రసిద్ధ శ్లోకము

ఇది భగవద్గీతలో ఒక ప్రసిద్ధ శ్లోకము, ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారత దేశం లోని చాల మంది స్కూలు పిల్లలకి కూడా ఇది తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది. కర్మ యోగ విషయం ఎప్పుడు చర్చించబడినా ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తున్నది..

1. నీ కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి పట్టించుకోకు.

2. వచ్చిన కర్మ ఫలములు నీ యొక్క ఆనందం కోసం కాదు.

3. పని చేసేటప్పుడు కూడా కర్తుత్వభావన (నేనే చేస్తున్నాను అన్న భావన) విడిచిపెట్టు.

4. కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు.
నీ ధర్మ నీవు చేయుము కానీ ఫలితాల గురించి విచారించకు.

మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నము మీదనే ఆధారపడి ఉండవు. చాలా కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి - మన పరిశ్రమ, మన ప్రారబ్ధం (గత కర్మలు), భగవంతుని సంకల్పము, ఇతరుల పరిశ్రమ, సంబంధిత అందరి ప్రారబ్ధం, దేశ కాల పరిస్థితులు (అదృష్టము) మొదలగునవి. ఇప్పుడు మనం ఫలితాల గురించి ఆరాట పడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ఫలితముల గురించి ఆందోళనని విడిచి పెట్టి, చేయవలసిన పని మీదనే శ్రద్ధ చూపమని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నిజానికి ఫలితాల గురించి పట్టించుకోనప్పుడే, మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాము, దీనితో ఇంతకు పూర్వం కన్నా మంచి ఫలితాలు వస్తాయి.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🚩

సేకరణ

No comments:

Post a Comment