Saturday, February 19, 2022

చరిత్ర పుస్తకల్లో లేని ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర

*🚩🕉చరిత్ర పుస్తకల్లో లేని ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర🕉🚩*


*https://chat.whatsapp.com/HYYqSjq34yH5YudxhpqU7F*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఛత్రపతి శీవాజీ ఈ మహా యోధుడి గురించి తెలియని వారు ఉండరు. శీవాజీ లేని భారతన్ని మనం ఊహించాలేము. హిందూ దేశాన్ని , ధర్మన్ని కాపాడిన మహాయోధుడి గురించి మన చరిత్ర పుస్తకల్లో లేని విషయాలను మనం తెలుసుకుందాం..!*


*ఛత్రపతి శివాజీ జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ). మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి). హిందూదేశంలో ఎందరో రాజులు అధికారంకోసం, రాజ్యం కోసం యుద్ధాలు చేశారు. రాజ్యాలను స్థాపించారు. హిందూ దేశాన్ని విదేశీయుల దాడులనుండి కాపాడి అమరులైనారు. వారి మరణానంతరం అయా రాజ్యాలు కూడా అంతరించాయి. అయితే శివాజీ కూడా అలాంటి వాడేనా లేక ఆయన చేసిన పోరాటం మొత్తం దేశానికి సంబంధిం చిందా? ఆయన సాగించిన సమరం ఆయన తోనే ఆగిపోయిందా? లేక ఆ తర్వాత వచ్చిన తరానికి ఉపయోగపడిరదా లేదా? ఆలోచించాలి. శివాజీ గనుక ఈ దేశంలో జన్మించకపోతే ఏమి జరిగేదో ఆయనతోపాటు యుద్ధక్షేత్రంలో యుద్ధం చేసిన యోద్ధకవి, పండితుడు శివాజీ గురించి ఒక కావ్యంలో ఈవిధంగా వర్ణిస్తాడు.*


*కాశీజీకీ కళా జాతి, మథురా మసీద్‌ హోతి*

*యది శివాజి న హోతా తో సబకీ సున్నత్‌ హోతి*

*(కాశీ యొక్క కళ పోయేది, మథురా మసీ దయ్యేది. ఒకవేళ శివాజే లేకుంటే, అందరికి సుంతీ లయ్యేవి.)*


*శివాజీ రాజకీయ రంగప్రవేశం చేసేనాటి వరకు ఆసేతుహిమాచల పర్యంతం హిందూవీరులు ప్రాణా లను ఫణంగా పెట్టి మహమ్మదీయ బలాన్ని ఎదురిం చారు. కాని విజయాన్ని సాధించలేక పోయారు. ఈ చేదు నిజాన్ని దాహిర్‌ గతి, జయపాలుని యుద్ధాలు, అనంగపాలుని స్థైర్యం, పృథ్విరాజు పతనం, కళింగ పతనం, దేవగిరి పతనం, తాళికోట దుర్దినాలు ఋజువు చేయగలవు. కాని శివాజీ రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత హిందూజాతిని జాగృత పరిచి విదేశీయ మహమ్మదీయ పాలకుల ముందు ఏనాడూ తలవంచలేదు, హిందూవీరులను తల వంచనీయలేదు. ఎదురించి నిలిచారు. హిందూ పతాకాన్ని హిందూదేశ గగన తలంలో స్వాభి మానంతో రెపరెపలాడించాడు.*


*శివాజీ 1627లో జన్మించాడు. వయస్సు పెరిగే కొద్దీ అతనిలో హిందూజాతి రాజకీయ బానిసత్వం గురించిన ఆవేదన కూడా పెరుగుతూ పోయింది. మన గుళ్ళూ-గోపురాలు, గోమాతలు మ్లేచ్ఛుల పాదాల క్రింద నలిగి పోతుంటే తన హృదయం అగ్నిగోళమయింది. ఇందుకు కారణం వీరమాత జీజీయబాయి శ్రీకృష్ణ, శ్రీరామ, అర్జున, భీమ, అభిమన్యు, హరిశ్చంద్ర మొదలగు మహా పురుషుల తేజో మయ జీవితాలతో శివాజీలో తరుణ శక్తిని, ధార్మిక భక్తిని పెంచి పోషించడమే.*


*1645లో మొదటిసారిగా యువ శివాజీ విప్లవ పతాకాన్ని ఎత్తాడు. బీజాపూర్‌ నవాబు పట్ల తాను అవిశ్వాసాన్ని చూపినాడన్న అపవాదును తీవ్రంగా ఖండిస్తూ ‘‘నావిశ్వాసము ఏ శాహకో, ఏ నవాబుకో ఏ వ్యక్తి కో కాదు; కేవలం దేవునికి మాత్రమే అర్పింప బడిన’’దని ఉత్తరంవ్రాశాడు. తనను పెంచి పెద్ద చేసిన దాదాజీ కొండదేవుని సాక్షిగా తన అనుచరులతో గూడి మొదట తోరణ దుర్గంపై భగవత్‌ పతాకాన్ని ఎగరేశాడు. అప్పటికాయన వయస్సు పదహారేళ్ళే. అలా మొదలయింది విజయప్రస్థానం. సహ్యాద్రి శిఖరాల పైన దైవసమక్షంలో చివరి రక్తపు బొట్టు వరకు పోరి ‘‘హైందవ స్వరాజ్యం’’ను హిందు స్థానంలో ‘‘హిందూ – పద-పాద షాహి’’ని స్థాపించు టకు ప్రమాణముచేసి ప్రతిజ్ఞా కంకణం ధరించాడు. శివాజీ 1674లో జూన్‌ మాసంలో జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు సింహాసనస్థుడై ‘హిందూ-పద-పాదషాహి’ని స్థాపించి ప్రత్ఞిను నిలబెట్టుకున్నాడు. శివాజీ వంద ఏళ్ళకు సరిపోయే వ్యవస్థ చేశాడు.*


*ఛత్రపతి శీవాజీ గళం నుండి వెలువడిన ‘‘హిందవీ స్వరాజ్‌’’ అనే ఈ మాటలే ఒక వంద సంవత్సరాల పాటు మహారాష్ట్ర వీరుల ఆశయాలను, సాధించ డానికి ప్రేరేపించాయి. శివాజీ ప్రారంభించిన ఉద్య మము స్థానిక ఉద్యమంగా, వ్యక్తిగత ఉద్యమంగా నడవలేదు, ముఖ్యంగా అది హిందూ ధర్మ రక్షణ కొరకు, విదేశీయ, విజాతీయ మహమ్మ దీయ అధికార ఆగడాల నిర్మూలన కొరకు, స్వతంత్ర హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ప్రారంభించబడిన అఖిల హిందూ ఉద్యమమిది.*


*విదేశీ బానిసత్వం నుండి హిందూజాతిని రక్షించే నాయకుడు ఒక్క శివాజేనని దేశప్రజలందరూ గుర్తిం చారు. సావనూరు ప్రజలు శివాజీకి పంపిన లేఖలో ‘‘విదేశీయుల క్రూర నిరంకుశ పాలన క్రింద నలుగు తున్నాం. పవిత్ర హిందూధర్మం కాలిక్రింద త్రొక్కి వేయబడుచున్నది. మహమ్మదీయ సేనాని యూసఫ్‌ దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం, రండి, మమ్ములను కర్తవ్యోన్ముఖులను చేయండి.’’ అని ప్రార్థిం చారు. ప్రజల ఆవేదనను ఆర్తనాదాన్ని అందు కున్న శివాజీ షయిస్థఖాన్‌ను పరుగుతీ యించాడు, అఫ్జల్‌ఖాన్‌ను అంతమొందించాడు. ఒక్కొక్క దుర్గాన్ని జయించుకుంటూ ముందుకు సాగిపోయాడు. హిందూ విజయకేతనాన్ని హిందూ గగనతలంలో రెపరెపలాడిరచాడు. సుస్థిరమైన రాజ్యవ్యవస్థను ఏర్పాటుచేశాడు. హిందూ విమోచ నోద్యమం శివాజీ, రామదాసుల కాలంలో పునః ప్రారంభింపబడి నప్పటికీ అది వారితో ఆగలేదు. ఆ మహాపురుషుల సంతతివారు,అనుయాయులు దానిని విజయ పీఠంపై కూర్చోబెట్టడానికి నిరంతర పోరాటం సాగించారు.*


*ఛత్రపతి శీవాజీ మరణంతో మరాఠా రాజ్యం అనాథ అయిందని కొందరు భావించారు. ఔరంగజేబు ఆయన తాబేదార్లు సంతోషించారు.శివాజీ నిర్మించిన శివశక్తి అనాథ కాలేదు. శివాజీ లక్ష్యాన్ని పోరాట పటిమను ముందుకు తీసుకొని పోయింది. శంభాజీ తాను పాలించిన తొమ్మిది సంవత్సరాల్లో విరామ మెరుగక పోరాటం సాగిస్తూ. చివరకు ఔరంగజేబు సైన్యాలకు చిక్కాడు. ఔరంగజేబు శంభాజీని మతం మార్చుకొమ్మని అనేక చిత్ర హింసలకు గురి చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించనందుకు శంభాజీ నాలుకను కోశారు. అయినా శంభాజీ ఒప్పుకోలేదు. చివరకు చిత్రహింసలకు గురిచేశారు.*


*అతని కళ్ళు పొడిచారు. నాలుక కోశారు.. ‘‘ముస్లిములను చంపి, బంధించి, అగౌరవ పరిచినం దుకు, ఇస్లాం నగరాలను కొల్లగొట్టినందుకు’’ శంభాజీని చంపాలని మహమ్మదీయ న్యాయవేత్తలు డిక్రీ ప్రకటించారు. శరీరంలోని ఒక్కొక్క అంగాన్ని నరికి ఆ మాంసాన్ని కుక్కలకు వేసి క్రూరంగా శంభాజీని హింసించి చంపారు. నరికిన ఆయన తలలో గడ్డి కూరి డోలు, సన్నాయిలు వాయిస్తూ దక్కన్‌ లోని ముఖ్య పట్టణాలన్నింటిలో ప్రదర్శించారు. శంభాజీ బలిదానం సంగతి తెలియగానే మహా రాష్ట్రుల గుండెలు మండి ఉవ్వెత్తునలేచి కదన రంగానికి పరుగులు తీశారు. బ్రతికి వున్నప్పటికంటే అమరుడయ్యాకనే శంభాజీ తన జాతిని ఉత్తేజ పరిచాడు. ప్రతి మరాఠా వీరుడు సర్వస్వం త్యాగం చేసే వీర సైనికుడయ్యాడు. ఆయుధాలతో యుద్ధ రంగంలో దుమికారు.*


*అధికారం కాదు- హిందూ సమాజ రక్షణే ముఖ్యం*


*శంభాజీ మరణం తర్వాత శివాజీ కోడలు, శంభాజీ భార్య యశూబాయి కూడా తన మామగారు ఆచరించిన రీతికి నీతికి మచ్చ రానీయకుండా అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి ఏడేళ్ళ కుమారుడు సాహు ఉన్నప్పటికి సమాజ రక్షణ ముఖ్యమని భావించి యుక్త వయస్కుడైన తన మరిది రాజారాంకు పట్టం కట్టింది. శివాజీ మార్గానికి దారి చూపింది. శంభాజీ బలిదానం, యశూబాయి త్యాగంతో హిందూధర్మ రక్షణఆవశ్యకతను హిందూ ప్రజానీకమంతా గుర్తించి నది. హిందూ సమాజ రక్షణకు పూనుకున్నది.*


*https://www.facebook.com/groups/638078683192004*

No comments:

Post a Comment