Thursday, February 24, 2022

Story వ్యాపారి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని రాత్రి ఆనక పగలనక అందరినీ పీడిస్తూ డబ్బు సంపాదిస్తూ వుండేవాడు

ఒక ఊరిలో ఒక వ్యాపారి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని రాత్రి ఆనక పగలనక అందరినీ పీడిస్తూ డబ్బు సంపాదిస్తూ వుండేవాడు

ఇది చూస్తున్న ఒక పెద్దాయన ఆ వ్యాపారి తో ఇలా అంటాడు
బాబు నువ్వు ఎంతో కష్టపడి నీ జీవితానికి కావలసిన దానికంటే కూడ ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించావు కదా ఇక నైనా డబ్బు సంపాదన ఆపి కాస్త మనశ్శాంతి గా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటాడు

అప్పుడు ఆ పెద్దాయన మాటకు సమాధానంగా ఆ వ్యాపారి ఇలా అంటాడు నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు నా ఒక్కడి కోసం కాదు నా పిల్లల కోసం,నా పిల్లల పిల్లల కోసం ఇలా నా తరువాత తరాల నా వారసుల కోసం అంటాడు

అప్పుడు ఆ పెద్దాయన ఇంకా పుట్టని వారికోసం ఇప్పుడు వున్న నీ తోటి వారిని పీడుంచు కొని ఇబ్బంది పెడుతూ సంపాదించడం ధర్మమా?
అంటాడు

అప్పుడు ఆ వ్యాపారి దర్మమో కాదో నాకు
తెలియదు కానీ నాకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు నేను సంపాదిస్తున్నాను అంతే అంటాడు

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఎంతో తరగని డబ్బు సంపాదించిన ఆ వ్యాపారి చనిపోతాడు
చనిపోయిన ఆ వ్యాపారి నేరుగా భగవంతుడి దగ్గరకు వెళతాడు

అప్పుడు ఆ భగవంతుడు ఆ వ్యాపారిని ఇలా ప్రశ్నిస్తాడు

బాబు నువ్వు
ఎందుకు అందరిని పీడించి అందరిని ఇబ్బంది పెట్టి ఎవరి కోసం అంత డబ్బు సంపాదించావు అంటాడు

అప్పుడు ఆ వ్యాపారి నా తరువాత తరాల నా వారసుల కోసం అంటాడు

అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు నువ్వు మంచి జ్ఞానాన్ని సంపాదించాలని మంచి ఆనంద కరమైన జీవితాన్ని జీవించాలని నేను నీకు ఎంతో విలువైన సమయాన్ని ,ఎంతో విలువైన శరీరాన్ని ఇచ్చి పంపితే నువ్వేమో
నువ్వు మనశ్శాంతి గా వుండక ఇతరులను మనశ్శాంతి గా వుంచక ఇలా చేసావు భాగుంది నీ నిర్వాకం

సరే నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన నీ సంపాదనను
అనుభవించే నీ వారసులను
చూస్తావ అంటాడు

దానికి ఆ వ్యాపారి సంతోషం తో సారే అంటాడు అప్పుడు భగవంతుడు ఆ వ్యాపారి యొక్క వారసులను చూపిస్తాడు

వారిని చూసిన ఆ వ్యాపారి తన అజ్ఞానానికి తానే
నవ్వు కుంటాడు.
ఎందుకంటే తను సంపాదన కోసం ఎవరినైతే పీడించి బాధ పెట్టాడో వారే తన వారసులుగా పుడుతున్నారు అని. అంటే మన శత్రువులు మన మీద పగ తీర్చుకోవాలి అంటే ఇదొక మార్గం. కావున ఈ సత్యం తెలుసుకొని మనందరం ఎలా మెలగాలో నిర్ణయించుకుందాం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment