Wednesday, July 6, 2022

మూడు చేదు నిజాలు

మూడు చేదు నిజాలు:

ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీ, గాదంతో నింపేస్తుంది.
అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

ఎవరివద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు.
సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు.
దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.
జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు.
భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు.
భయస్తులు భయాన్నే పంచగలరు.

మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోండి. లేకపోతే...
భోజనం
అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
ధనం
అరగకపోతే బడాయి పెరుగుతుంది.
మాటలు
అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
ప్రశంస
అరగకపోతే అహంకారం పెరుగుతుంది.
నిందలు
అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది.
అధికారం
అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది.
దుఃఖం
అరగకపోతే నిరాశ పెరుగుతుంది.
సుఖం
అరగకపోతే పాపం పెరుగుతుంది.

విషయం చేదుగా ఉన్నా ఇది నిజం.

సేకరణ. మానస సరోవరం

సేకరణ

No comments:

Post a Comment