🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"352"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మంత్ర జపం, నామస్మరణ మొదలుపెట్టగానే ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఎందువలన ?"*
***************************
*"మనం నిత్య జీవితంలో ఏపనిలోవున్నా ఇతర ఆలోచనలు ఆపాలనుకోవటం లేదు. చివరికి దేవుడి పూజలోవున్నా ఆలోచనలు కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ మంత్రజపం, నామస్మరణ, శ్వాసమీద ధ్యాన చేయాల్సి రాగానే అందుకు అవరోధంగా ఉన్న ఆలోచనలు మనకి అడ్డం అనిపిస్తున్నాయి. నిజానికి ధ్యానం అనేది ఒక పనికాదు. మనలోని శాంతి స్థితిని అనుభవించటానికి పెట్టిన పేరే ధ్యానం. రోగం క్రొత్తగా వచ్చేదే కానీ ఆరోగ్యం పాతదే ! క్రొత్తగా వచ్చిన అనారోగ్యాన్ని తొలగించుకుంటే మనకి మునుపటి ఆరోగ్యం ఎలాగైతే వస్తుందో అలాగే క్రొత్తగా వచ్చిన అశాంతిని తీసేస్తే మనకు సహజసిద్ధంగా ఉన్న శాంతి తెలుస్తుంది. చిలుము పట్టిన పాత్రను తోమితే దాని సహజమైన మెరుపు కనిపిస్తుంది. అలాగే కోర్కెలను తొలగించుకుంటే మన సహజశాంతి వ్యక్తం అవుతుంది. అంతేగాని తాత్కాలిక శాంతి కోసంచేసే ప్రక్రియలు పాత్రకు పూతరంగులు పూసినట్లే సహజమైన గుణాన్ని తెలుపలేవు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
*"శ్రీ"*
No comments:
Post a Comment