Thursday, December 29, 2022

🛕శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం🛕 📖 కాలజ్ఞానం -25

 🛕శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం🛕 

          📖 కాలజ్ఞానం -25

🎯ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. 

🎯తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను. 

🎯విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. 

🎯అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, 

🎯ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. 

🎯అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. 

🎯అక్కడ 15 దినములు గడుపుతాను.

🎯కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. 

🎯గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.

🎯ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. 

🎯పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. 

🎯నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. 

🎯నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. 

🎯సముద్రాలు కలుషితమయిపోతాయి. 

🎯జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి. 

🎯బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. 

🎯కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. 

🎯వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. 

🎯కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. 

🎯కుటుంబంలో సామరస్యత వుండదు. 

🎯వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.

🎯సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. 

🎯రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. 

🎯వినాయకుడు వలవల ఏడుస్తాడు. 

🎯గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. 

🎯శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. 

🎯హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. 

🎯హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. 

🎯అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది. 

🎯నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. 

🎯కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’

🗻సమాధి తర్వాత తిరిగి దర్శనం🛕

🎯నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. 

🎯వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

🎯సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. 

🎯అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. 

🎯సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

🎯అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

🎯బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. 

🎯అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. 

🎯దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

🎯సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. 

🎯తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. 

🎯అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

🏜️కందిమల్లాయపాలెం – చింతచెట్టు🏝️

🎯కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. 

🎯పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. 

🎯అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. 

🎯ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు, సూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి, జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

🎯అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండి, తినడానికి పనికి రాకుండా వుంటాయి. 

🎯చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి, గడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. 

🎯దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. 

🎯బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

🎯ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది........

✒️సేకరణ 
💞విప్పోజు శ్రీనివాస ఆచార్య విశ్వకర్మ💕

No comments:

Post a Comment