Sunday, December 25, 2022

తల రాత

 *తల రాత*

మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా

మరి మనం పూజలు ఎందుకు చేయాలి. అని కొంతమందికి అనుమానం వస్తుంది.

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడు.

నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను.

మీరు మీ "ఉపాసనల" తోటి... మీ  "అర్చన"లతోటి మార్చుకోగలరు అని రాసారట.

అర్చనలు, ఉపాసనలు  ద్వారా మీ
విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు.

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది.
చెప్పాడు.

పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.

బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం, మంత్రాలను చదవడం,                    ప్రదక్షణలు చేయడం
వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది
తొలగిపోయి కొత్తది వస్తుంది.

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుని పాదాలను  స్మరించాలి.

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు
ద్రౌపతిని జుట్టుపట్టి దుస్సాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు.

ఆయువు ఉన్నప్పటికీ
బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు.

విభుముఖుడు అనే రాజు తన జాతకం లో 50 వ ఏట మరణ గండం ఉండగా.....మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసన చేసి చావవలసిన వాడు బ్రతికారు అని చెప్తారు.

పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.

అందుకని ఏ కష్టం వచ్చిన 
"బ్రహ్మ నాకు ఇలా రాసాడు" అని కృంగిపోకుండా.....ఆ రాతను
మార్చుకోవడానికి విద్య చెప్పించడం 
పూజలు, దానాలు, ధర్మాలు పేదలకు సహాయం చెయ్యండి.

No comments:

Post a Comment