Monday, January 30, 2023

****శ్రీ రమణులు…ధ్యానం నాన్న

 శ్రీ రమణులు…ధ్యానం నాన్న

ఆధ్యాత్మిక సంగమం శంబలనగరి
ఒక నాయకుడు తనకు ఎంతమంది అనుయాయులు ఉన్నా వారిలో ఒకరినో ఇద్దరినో నాయకుడిగా తయారు చేస్తారు. ఇందులో కూడా తన లాభం చూసుకుంటాడు. గురువు శిష్యులను తయారు చేస్తాడు. కానీ దేవుని అనుభూతి (పరమాత్మ సత్య అనుభూతి) ఇవ్వలేడు. అదే ఒక తపస్వి ప్రత్యక్ష, పరోక్ష శాశ్వత దైవాల అనుసంధాన చైతన్య అనుభూతిలో పరమాత్మ అనుభూతి నింపి ప్రతి మనిషిని పరమాత్మ సత్యం ను చేరే తపస్విగా చెక్కుతాడు. ఇలాంటి తపస్విలు గతంలోనూ ఉన్నారు. ధ్యానం నాన్నను ఒక్కసారి కనెక్ట్ అయితే ఈ అనుభూతిని పొందగలరు. సమాజ హితమూ, నిత్య గాయత్రి చింతన లేకపోతే పద్మాసనంలో ఒకే చోట సంవత్సరాల తరబడి కూర్చోవడం సాధ్యం కాదు. స్వీకరించి, అనుసరించి, విశ్వసించడంలోనే ఉంది. స్వీకరణనుబట్టి బోధ ఉంటుంది. శ్రీ రమణులు గురించి ధ్యానం నాన్న చెప్పింది తెలుసుకుంటే అవగతమవుతుంది.

ఒకసారి 12 సంవత్సరాల కుర్రవాడు శ్రీ రమణ మహర్షి దగ్గరకు వాళ్ళ పెద్దలతో కలసి వచ్చాడు. మౌనంగా కూర్చున్న శ్రీ రమణులకు అందరూ నమస్కరించడం చూశాడు. వారు అలా నమస్కరించడం ఆ కుర్రవాడికి నచ్చలేదు. పైగా శ్రీ రమణులకు ఏమి తెలుసు అంటూ ఆక్షేపించాడు. తప్పు నాయనా అలా అనకూడదు దండం పెట్టు అంటే పెట్టనని భీష్మీంచాడు. పెద్దలు గదమాయిస్తే తాను అడిగిన దానికి సమాధానం చెబితే నమస్కరిస్తానన్నాడు. ఇది అంతా గమనించిన శ్రీ రమణులు సైగ చేసి ఆ కుర్రవాడిని దగ్గరకు రమన్నారు. ఏమిటి అని అడిగారు. దానికి ఆ కుర్రవాడు మీకు ఆర్క్ మెడీస్ గురించి తెలుసా ఆన్నాడు. శ్రీ రమణులు నాకు తెలియదు అన్నారు. దీంతో ఆ కుర్రవాడు ఈయనకు ఏమీ తెలియదు. తెలిసిందల్లా నమస్కారాలే అన్నాడు. ఇంతలో అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త ఒకరు శ్రీ రమణుల దర్శనార్ధం వచ్చారు. ఆయన వి ఐ పి కాబట్టి ఆ శాస్త్రవేత్తను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టారు. ఆయన దగ్గరకు వెళ్ళిన రమణ మహర్షి ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత అంతరిక్షం గురించి చెబుతుంటే ఆ శాస్త్రవేత్త చేతులు కట్టుకొని శ్రద్దగా విన్నారు. ఆ శాస్త్రవేత్త శ్రీ రమణుల కాళ్ళకు నమస్కరించి వెళ్ళారు. ఇది అంతా కిటికీ లో నుంచి చూసిన ఆ కుర్రవాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. శ్రీ రమణ మహర్షి బయటకు వచ్చాక…అర్క్ మెడిస్ తెలియదన్నారు. కానీ సైన్స్, అంతరిక్షం గురించి అనర్గళంగా చెప్పారు. మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు శ్రీ రమణులు అన్నారూ…వాస్తవంగా నాకు ఏమీ తెలియదు. నా ఎదుట ఉన్న వారినిబట్టి నాకు తెలుసును. వారు మంచి శాస్త్రవేత్త కాబట్టి తెలిసింది. మరి నీవు? అందుకు నాకు ఏమీ తెలియదు అని శ్రీ రమణులు అనగానే ఆ కుర్రవాడు తల వంచుకున్నాడు. ఆధ్యాత్మికులు ఏమీ తెలియని స్థితి నుంచి అనంతం అనుభవిస్తారు. మరలా ఏమీ తెలియని స్థితికి వస్తారు. ఎదుటివారిని బట్టి వారి బోధ ఉంటుంది. ధ్యానం నాన్న బోధలు ఇందుకు అద్దం పడతాయి. ఒక్కోసారి చిన్న పిల్లవాడు అయిపోతారు.

రోగి కోరిన మందే వైద్యుడు ఇస్తే రోగం కుదుట పడదు. ఇద్దరూ లౌక్యం, తెలివి ప్రదర్శించినట్లే. ఆధ్యాత్మికంలో ఈ ధోరణులు కనిపిస్తున్నాయి. పై పై మనసు సహకారంతో చెప్పేది సమాజానికి ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి ఇవ్వదు. భారతీయ వేదాంత హైందవ గాయత్రి తపస్సు ఆధ్యాత్మిక సమాజానికి అవసరం. కొన్ని నదులు కలిసిన చోటును సంగమం అంటాము. ప్రత్యక్ష, పరోక్ష శాశ్వత దైవాల అనుసంధాన తపస్సు ప్రదేశాలు ఆధ్యాత్మిక తీర్ధ ప్రదేశాలు. శంబలనగరి అదే. అజ్ఞాత ఏకాంత నిత్య గాయత్రి తపస్వి ధ్యానం నాన్న. ఆ రుషి నిత్య గాయత్రి చైతన్యంతో నిండిన చైతన్యం. అలాంటి ప్రదేశానికి వచ్చి కొలువైన గాయత్రి మాత. శంబల చైతన్యాన్ని అందిచే గోవులు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ లోని విజియనగరం జిల్లా ఎస్ కోట సమీపంలో రాజీపేటలోని శంబలనగరి ఆధ్యాత్మిక సంఘమంను ఒకసారి దర్శించండి... 🙏🏻

No comments:

Post a Comment