Monday, January 2, 2023

🎻🌹🙏 మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి..

 🎻🌹🙏 మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸 1.  అర్ధ దోషం
🌿 2.  నిమిత్త దోషం         
🌸 3.  స్ధాన దోషం
🌿 4.  గుణ దోషం   
🌸 5.  సంస్కార దోషం.

🌿ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.

🌷అర్ధ దోషం

🌿ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒకవ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతోవున్న మూటని ఇవ్వడం చూశాడు.

🌸భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే  శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది.

🌿ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

🌸మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

🌿తను శిష్యుని ఇంట్లో చేసిన దోష భూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు.

🌸వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతాచెప్పి, ఆడబ్బును  తిరిగిచ్చేసాడు శిష్యుడిని "ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?" అని అడిగాడు.

🌿శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు". అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.

🌸మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

🌷నిమిత్త దోషం

🌿మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు.

🌸ఆహారం మీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి. 

🌿భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధంముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు.

🌸వారికి భీష్ముడు మంచిమంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది.

🌿"ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?"అని అనుకొన్నది.

🌸ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు,  "అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను.

🌿నా స్వీయబుధ్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను.

🌸నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను" అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది  తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.

🌷స్ధాన దోషం

🌿ఏ స్ధలంలో ఆహారం వండ బడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడినవంట కూడా పాడైపోతుంది.

🌸యుధ్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు. 
దుర్యోధనుడు  ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.

🌿కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.

🌸తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.

🌿ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను.

🌸నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను"అని అన్నాడు. కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

🌷గుణ దోషం 

🌿మనం వండే ఆహారం సాత్వికఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🌷సంస్కారదోషం

🌸ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది..స్వస్తి..🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
సేకరణ:-
      💐#శుభమస్తు💐

No comments:

Post a Comment