Friday, March 31, 2023

గుణ దోషాలు

 🪔🪔🪔🪔

            🎈🎈గుణ దోషాలు🎈🎈

🌹మనిషి మనసు నిరంతరం మంచి-చెడుల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది. ఒక్కొక్కప్పుడు మంచివైపు మొగ్గుతుంది. మరొకప్పుడు చెడువైపు మొగ్గుతుంది. స్వార్ధానికి దాసుడైనవాడు తన చెడును కూడా మంచిగా సమర్థించుకుంటాడు. విద్యావంతుడు, సంస్కారి, వివేకశీలి, జ్ఞాని ఎక్కడ మంచిని గ్రహించినా స్వీకరిస్తాడు. చెడును దూరంగా ఉంచేస్తాడు.

🌹పిడికిలి ఎంత పరిమాణంలో ఉంటుందో దాదాపు అంతే పరిమాణంలో ఉంటుంది. పుట్టిన పసిబిడ్డ పిడికిలి మూసుకునే ఉంటుంది. ఏదైనా పట్టుకోవడానికే ఈ ప్రపంచంలోకి వచ్చానని దాని సంకేతం. ఆ పిడికిలి తెరిచి మంచినే పట్టుకోవడమన్నది తల్లిదండ్రులిచ్చే శిక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాగే గుండె తలుపులు తెరుచుకుంటేనే జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. గుణాలు అంటే సద్గుణాలనే అర్ధం. గుండె వీటినే ఆహ్వానించాలి. అవగుణాలంటే దోషాలు. ఆ దోషాలను విసర్జించాలి.

🌹మనిషి సద్గుణాలని తెలిసినా జీవితంలోకి తేలిగ్గా వాటిని ఆహ్వానించలేడు. నీరు పల్లంవైపే ప్రవహించినట్లు మనసు చెడు వైపే లాగుతుంటుంది.

🌹 మనిషిని సప్త వ్యసనాల్లో ఏదో ఒకటి ప్రలోభపెడుతుంది. పరస్త్రీ వ్యామోహం, జూదం, వేట, మద్యపానం, వదరుబోతుతనం, నేరాన్ని మించి శిక్షించడం, పూర్వీ కులు సంపాదించి ఇచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపర చడం- ఈ సప్త వ్యసనాల్లో ఏదో ఒకదానికి బానిసలై కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్లెందరో ఉన్నారు. రావణుడు, కీచకుడు, దక్షప్రజాపతి, దుర్వాసుడు, శిశుపాలుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, దుర్యో ధనుడు, బలి, కంసుడు... ఇలా ఎందరో ఏదో ఒక దుర్లక్షణానికి దాసులై అనేక కష్టనష్టాలకు బలైపోయినవారే!

🌹మనిషి మూడు ‘దకారాలను ఎప్పుడూ
గుర్తుచేసుకుంటే చాలు- దేహభక్తి, దేశభక్తి, దైవభక్తి. ధర్మసాధన చేయాలంటే శారీరక స్వస్థత ముఖ్యం. దేహం ఆత్మకు గేహం(ఇల్లు). పరమాత్మలో కలిసిపోయేందుకు తపించేది ఆత్మ. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఏదైనా పుణ్యకార్యం చేయగలిగేది. తరవాత దేశభక్తి. సమాజహితం, పరోపకారం, లోకకల్యాణం, మానవతా దృక్పథం, పారమార్థిక చింతన- ఇవన్నీ దేశభక్తికి సంబంధించినవి. మూడోది దైవభక్తి. చిత్తశుద్ధి ఏకాగ్రత, శ్రద్ధ, అపేక్షారాహిత్యం- ఇవి భక్తికి ఉండవలసిన లక్షణాలు. 

🌹ఆరొంతులు మానవ ప్రయత్నం జరగాలి. ఏడోవంతే దైవభక్తి.

🌹 ఈ కలియుగంలో 'నామస్మరణ'ను మించిన ఆధ్యాత్మిక యాగం లేదు. అది కూడా చేయలేని దౌర్భాగ్యస్థితికి మనిషి దిగజారకూడదు. పాపభీతి లేని ప్రవర్తన దుర్మార్గానికి తెరతీస్తుంది. 

🌹సద్ధంథ పఠనం, సత్సాంగత్యం, ప్రవచన శ్రవణం, మంచి స్నేహం, ధర్మబద్ధమైన సంపాదన- ఈ సులక్షణాల వల్ల లోకంలో దుర్మార్గాల సంఖ్య తగ్గుతుంది.
🌹 'పరులను పీడించడం మహాపాపం, పరోపకారంపుణ్యప్రదమైనది' అని మహాభారతం చెబుతోంది.

🌹 క్షీరనీరాలను వేరు చేయగల హంస నుంచి పాఠం నేర్చుకుంటే- మనిషి ఆదర్శవంతమైన జీవితం గడపగలుగుతాడు. 
🌹ధర్మం నిర్వచనం గ్రహించగలిగితే గుణదోషాలు సులభంగా అవగతమవుతాయి.🙏

- ✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment