Thursday, November 30, 2023

****'శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం’ అనే తత్వాలు కలిగినవారిని ఉత్తములుగా పరిగణిస్తాం.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*’శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం’ అనే తత్వాలు కలిగినవారిని ఉత్తములుగా పరిగణిస్తాం.* 
💖*వీటికి వ్యతిరేక గుణాలు కలుపుమొక్కల్లా మనిషి మదిలో మొలకెత్తుతూ ఉంటాయి. వెలుగు వెనకాలే చీకటి, సుఖం వెనక దుఃఖం, శాంతికి అశాంతి, ప్రేమకు ద్వేషం, అనురాగానికి అహంకారం, ఆనందానికి విషాదం … ఇలా ఎన్నో వ్యతిరేక లక్షణాలు మదిని చొరబడి చోటు చేసుకొంటాయి. మెల్లిగా పెత్తనం చెలాయించనారంభిస్తాయి.* 
💞 *వివేకం, విచక్షణాజ్ఞానంగల వ్యక్తి తనలో పుట్టిన ఈ వ్యతిరేక లక్షణాలను ఎప్పటికప్పుడు పొలాల్లోని కలుపుమొక్కల్లా ఏరి పడేస్తూ ముందుకెళ్తాడు. బలహీనుడు దాసోహం అంటూ ఆ వికారాలకు లొంగిపోతాడు.*
❤️ *మనిషి మనసు కురుక్షేత్రం లాంటిది. అందులో దైవీగుణ సంపద కలిగినవాళ్లు పాండవులు, అసురీగుణం కలిగినవారు కౌరవులు.క్షీరసాగర మథనం సమయంలో విషం, అమృతం రెండూ పుట్టినట్లు- మానవ మానస సాగరంలో ఈ రెండు గుణాలూ మిళితమై ఉంటాయి. అలజడులు లేపడమే చెడుగుణ స్వభావం. మనం మంచికి చోటివ్వాలి. చెడును దరికి రానీయొద్దు.*
💞 *అరిషడ్వర్గాలు మన అంతశ్శత్రువులు. వాటిలో మొదటిది కామం. ప్రతి ఒక్కరికీ కోరికలుండటం సహజం. ఒక కోరికతీరి హాయిననుభవిస్తూ ఉండగానే దాని వెనకాలే మరో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. అది తీర్చుకొనేందుకు చేయరాని పనులు చేయాల్సివస్తుంది.అలా కోర్కెల కోరల్లో చిక్కుకొన్నవారికి మనశ్శాంతి ఉండదు.*

💖 *రెండోది క్రోధం. దీన్ని క్రోధాగ్నిగా చెబుతారు. నిప్పుకు ఉండే లక్షణాలన్నీ దీనికున్నాయి. తాను ఆవహించిన వాణ్ణిది కాల్చి బూడిద చేస్తుంది. అటుపై ఎదుటివారినీ తాకి వాళ్ల రక్తాన్నీ వేడెక్కించేస్తుంది. దీని మొదటి లక్షణమే అది. ఆ ప్రభావం గుండెమీదా, మెదడుమీదా చూపుతుంది. క్రోధంతో మనిషి వివేకాన్ని కోల్పోతాడు.*
💓 *పీనాసితనమే లోభం. లోభి తాను తినడు. ఎవరికీ పెట్టడు. 💕 *పరమాత్ముడు జీవులను భ్రమింపజేయడానికి పుట్టించిన మనోదశ మోహం. లేనిది ఉన్నట్లూ, కానిది అవునన్నట్లూ తోచేలా చేస్తుంది. బుద్ధిహీనతకు కారణం అవుతుంది.*
💞 *మదం ఆవహించిన వ్యక్తి అంతటా, అన్నింటా తానే గొప్ప అంటాడు. తనంతటివాడు మరెవ్వడూ లేడని గొప్పలు చెప్పుకొంటాడు. మదం ఆవహించిన వ్యక్తి గుడ్డివాడితో సమానమంటుంది నీతిశాస్త్రం.* 💓 *మాత్సర్యానికి మరోపేరు అసూయ. ఎవర్నీ ఓర్వలేక పోవడం దీని లక్షణం.నరంమీద లేచిన నారికురుపులాగా ఇది మనిషిని ఓ చోట నిలకడగా నిలబడనివ్వదు. లోలోపలే సలుపుతూ ఉంటుంది.*
💖 *ఈ అరిషడ్వర్గ మూకను వాటి మానాన అలా వదిలేసే బదులు మనకు అనుకూలమైన హితషడ్వర్గంగా మలచుకోవాలి*
💓 *దేన్నయినా కోరుకోవడం మానవ లక్షణం. చెడును కోరుకోకుండా సద్గతిని ఇచ్చే మోక్షాన్ని కోరుకోవడం మంచిది. దానికి కావాల్సిన చిత్తశుద్ధిని కోరుకోవడం ఉత్తమం. మంచి జరిగేది ఏది కోరినా ఫలితం మధురంగానే ఉంటుంది. చెడు అన్న ప్రతి విషయంపై కోపగించుకోవడం తప్పుకాదు. మంచికి ఊతమిచ్చే కోపం మనిషికి ఉత్తమ స్థితిని కలగచేస్తుంది. సద్గుణ సంపదల్ని అధికంగా కూడబెట్టుకోవడంలో లోభిగా ఉన్నా ఫర్వాలేదు. ఆత్మచింతన కావాల్సినంత పెంచుకోవడంలో తప్పేలేదు. భగవత్‌ చింతనపై మోహం పెంచుకోవాలి. సద్గ్రంథ పఠనంపై, సత్సాంగత్యంపై మోహం చూపొచ్చు.ఆత్మజ్ఞానం, జీవన్ముక్తిపై మోహం ఉత్తమం.*
💖 *ఆత్మజ్ఞానం కలిగి ‘అహంబ్రహ్మాస్మి’ అన్న దర్పం కలిగి ఉండటం తప్పుకాదు. లౌకిక సుఖదుఃఖాలపై మాత్సర్యమూ మంచిదే.* 
💓 *అరిషడ్వర్గాలను హిత షడ్వర్గంగా మలచుకొంటేజీవితం ఆనందతుందిలమౌతుంది* 
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment