*🌻భగవంతుని దృష్టిలో.... 🌻*
💦ఒక దేవాలయంలో బ్రాహ్మణుడు ప్రతిరోజు బిక్షాటన చేసుకొని వచ్చి, వచ్చిన ద్రవ్యముతో భగవంతునికి నైవేద్యము పెట్టేవాడు..
💦ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచేవాడు.
అలా కాలము గడుచుతున్న సమయంలో ఒక రోజు ఒక కోటీశ్వరుడు దేవాలయమునకు వచ్చాడు.
💦ఆ కోటీశ్వరుడిని చూడగానే బ్రాహ్మణుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది.
💦కోటీశ్వరుడు దేవాలయమునకు వచ్చాడు కదా.. ఈరోజు ఈయన వేసే ధనముతో రేపు స్వామి వారికి మంచి భోజనం పెడదాము అని మనసులో అనుకున్నాడు బ్రాహ్మణుడు.
💦కోటీశ్వరుడు లోపలికి రాగానే యోగ సమాచారాలను కనుక్కుని ఆయన పేరు మీద అర్చన చేసి మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆయన వేసే దక్షణ కోసము ఎదురు చూస్తున్నాడు బ్రాహ్మణుడు.
💦అప్పుడు ఆ కోటీశ్వరుడు జేబులో చేయిపెట్టి 2000 రూపాయల నోటు తీసాడు బయటకి. మళ్ళీ జేబులో చేయి పెట్టి 500,100, 50, 20, 10, 5 నోట్లు తీసాడు వరుసగా బయటకి.
💦అప్పుడు బ్రాహ్మణుడు మనసులో ఇలా అనుకుంటాడు. 2685 రూపాయలు ఇస్తున్నాడు ఈయన. కాబట్టి స్వామి వారికి 4 రోజులు మంచి మంచి నైవేద్యము చేసి పెట్టవొచ్చు అని...
💦మళ్ళీ కోటీశ్వరుడు జేబులో చేయిపెట్టి రెండు రూపాయల బిళ్ళ బయటకు తీసి మిగతా ధనాన్ని అంతా జేబులో పెట్టుకొని రెండు రూపాయలు బ్రాహ్మణుడి చేతికి ఇచ్చి కాళ్ళు మొక్కి వెళ్ళిపోతాడు.
💦ఆ రెండు రూపాయల బిళ్లను చూడగానే బ్రాహ్మణుడికి మూర్చ వచ్చి కిందపడతాడు.
💦ఈ విషయాన్ని గమనించిన భగవంతుడు మారు వేషము లో వచ్చి బ్రాహ్మణుడి ముఖం పై నీళ్ళు చిలకరించి లేపి ఏమైంది స్వామి అని అడుగుతాడు బ్రాహ్మణుడిని.
💦అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగిందంతా పూర్తిగా వివరిస్తాడు.అప్పుడు మారు వేషం లో వున్న భగవంతుడు ఇలా చెబుతాడు.
💦భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, కాని ధనము ఉండి కూడా దాన ధర్మములు చేయనివాడు మళ్లీ జన్మలో కాకిగా పుడతాడు.
💦దాన ధర్మాలు చేస్తూ కాలము గడిపేవాడు దేవాలయాలలో గోమాతగా పుడతాడు.
అంతే కాని వాళ్ళు ఇంత ఇస్తారు.. వీళ్ళు ఇంత ఇస్తారు అనే ఆలోచన పెట్టుకోకు స్వామి అని చెప్పి వెళ్లిపోతాడు.
*🌻ఈ సంఘటనలో సారాంశం ఏమిటంటే !!!🌻*
💦ఎవరి మీద ఆశ పెట్టుకోకు.
ఇచ్చేవాడు ఇస్తాడు, ఇవ్వనివాడు ఇవ్వడు.
💦అంతేకాని ఎవరినీ నిందించకు అని అర్థము. అన్నింటినీ ఆ భగవంతునికే వదిలేయి. ఆయనే చూసుకుంటాడు..
☘️☘️🌼🌹🌼🌸🌼🌹🌼☘️☘️
No comments:
Post a Comment