Saturday, April 13, 2024

కష్టాలు! కష్టాలు! అని మనం తెగ బాధపడతాం. కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?

 *మన కష్టాలకు కష్టాలేనా* 

కష్టాలు! కష్టాలు! అని మనం తెగ బాధపడతాం.
కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?

ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్లి తామర తూడులో దాక్కున్నాడు.

నహుషుడు శాపం వలన తొండగా మారి పోయాడు.

సత్య హరిశ్చంద్రుదు అమ్ముడుపోయి కాటికాపరిగా ఉండలేదా?

హరిభక్తుడైన పరమ  భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.

పాండవులు అడవుల పాలయ్యారు. వేరేవాడి దగ్గర ఆవులు  కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.

నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు.

దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందలాది  సంవత్సరాలు దాక్కున్నారు.

రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.

శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూనే ఉన్నాడు.    అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దాడులు చేశారు.

చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు.

ఆయన భార్యల్నిదొంగలు ఎత్తుకెళ్ళి పోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది.

సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది.

పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి  దృతరాష్ట్రుడి తో  సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది.

ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారరాడు

అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు.  వీటి ముందు మనకి వచ్చే  చిన్ని చిన్ని కష్టాలు కూడా                 
ఓ లెక్కంటారా?  కానేకాదు!

*ప్రతీది కాలం నిర్ణయిస్తుంది.*

🙏
*యేలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం తాడిగడప విజయవాడ*

No comments:

Post a Comment