🌹🌹 *"నిన్ను నీవు తెలుసుకో"* 🌹🌹
*"నువ్వు ఎవరివి?*
*నువ్వు నీ శరీరానివా?*
*లేక మనసు వా?*
*అంతకన్నా ఉత్తమమైనదా?"*
*"నువ్వు ఎవరో నీకు తెలుసా? లేకపోతే ఊరికే తెలుసు అనుకుంటున్నావా?తెలుసుకోవడం అంత అవసరమా...."*
*"చాలా చాలా అవసరం. లేకపోతే మానవ జన్మే వృధా అవుతుంది. భౌతికవాద సమాజం, ఉన్నతమైన మన ఆత్మ గురించి అన్వేషించడం దోషంగా భావిస్తుంది.* *అందుచేత అందరూ ఆత్మను మరచి శరీరాన్ని పోషించుకోవడానికి, సమాజంలో గుర్తింపు పొందడానికి తాపత్రయ పడిపోతున్నారు."*
*"ఆధ్యాత్మికత మృత్యువు నుంచి మానవ సమాజాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. "*
*"కొందరు మానవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మన ఆత్మను మనము సందర్శించడం లేదా భగవంతునితో మనం కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి నెలకొల్పు కోవడము మానవ జీవిత పరమార్థమని మర్చిపోయారు. అందుకే మనం ఆ విషయాన్ని తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం మానవులే కాక సమస్త జీవరాశులూ భగవంతుడు లోని అంశలే అని భగవద్గీత మనకు తెలియజేస్తుంది."*
*"మన అవయవాలన్నీ మన అవసరాలకు అనుగుణంగా మనకు ఉపయోగపడు తున్నట్లు గానే మన మందరము ఆయన లోని అంశాలను కనుక ఆయనను సేవించడమే మన కర్తవ్యం. వాస్తవ పరిస్థితి ఏమిటంటే- మానవులు ఎప్పుడు ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉంటారు. కుటుంబానికో దేశానికో,"*
*"సమాజానికో ఎవరూ దొరక్కపోతే కుక్కలు పల్లులు పెంచుకుంటారు.శక్తివంచన లేకుండా సేవను వృధా చేయటం కంటే ఆ పరమాత్ముడి సేవ చేసినట్లయితే, భౌతికంగా మనకు ఏ లోటు రాదన్న విషయం విస్మరిస్తున్నారు. దీనికి కారణం మనం, మన సేవలకు సరైన లక్ష్యాన్ని ఎంచుకోకపోవడమే."*
*"ఉదాహరణకి చెట్టుకు సేవ చేయాలంటే దాన్ని వేర్లకు నీరు పెట్టాలి అంతేకాని ఆకులను కొమ్మలను నీళ్లతో కడిగితే లాభం ఏముంటుంది."*
*"భగవంతుని సేవించినట్లైతే ఆయన లోని అంశాలు అన్నీ వాటంతట అవే సంతుష్టి చెందుతాయి. భగవంతునితో మనకుగల అసలైన సంబంధాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా నడుచుకోవడం మానవుని కర్తవ్యం."*
*"భగవంతునికి ఎదురుతిరిగి దేవుడు లేడని, దేవుడంటే నాకేం భయం లేదు, దేవుని నేను లెక్క చేయను. ఇలాంటి వాదనలు కూడా వింటూనే ఉంటాం. ప్రత్యామ్నాయంగా భయంకరమైన రోగాలు, భయాలు ఆందోళనలు, మనశ్శాంతి లేని జీవితాలు, క్రూరమైన మృత్యు రూపంలో మన ముందు నిలుస్తాయి."*
*"ఒక రూపంలో ఆయనను చూడడానికి మనం నిరాకరిస్తే, మరొక రూపంలో ఆయన మన ముందు ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే మొత్తం జగత్తు అభివ్యక్తికి ఆయన మూల కారణం.ఆయనను తప్పించు కోవడం మన తరం కాదు. ఆధ్యాత్మికం దేవదేవుడైన భగవంతునితో మనకు గల సంబంధం దృష్ట్యా మన నిత్య అవసరాన్ని తీర్చే ఒకప్రామాణిక మైన శాస్త్రీయమైన మార్గం."*
*"భగవంతునితో మనకు గల శాశ్విత సంబంధాన్ని, ఆయన పట్ల మనము నెరవేర్చవలసిన విధులను మనకు గుర్తు చేస్తుంది. మానవ జన్మలో మనం పరిపూర్ణతను సాధించేందుకు తోడ్పడుతుంది."*
*"మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మన ఆత్మకు ఈ మానవ జన్మ లభించడానికి జనన మరణ చక్రంలో అనేక లక్షల సంవత్సరాల పరిణామం జరిగిందనే విషయం."*
*"మానవుడికి సమస్యలను పరిష్కరించుకోవడం ఇతర జీవుల కంటే ఎక్కువగా సాధ్యమవుతుంది. ఇతర జీవుల అవసరాలన్నీ ప్రాకృతిక పద్ధతిలో పరిష్కార మవుతాయి. కానీ మనిషికి ఆర్థిక రూపంలో పరిష్కృతం అవుతున్నాయి. మానవుని సుఖజీవనానికి ప్రకృతి నియమాలు అన్ని సౌకర్యాలను కల్పించాయి."*
*"మానవుడు ఇతర జీవులకన్నా బాగా బ్రతికే అవకాశం ఎలాపొందగలిగాడు? ఉన్నత పదవిలో నియమితుడైన అధికారికి మామూలు గుమస్తాల కంటే సుఖమైన జీవితం గడిపే సౌకర్యాలు ఎందుకు కల్పిస్తారు? ఎక్కువ బాధ్యతాయుతమైన విధులు నిర్వహించవలసి ఉంటుంది కనుక. అదేవిధంగా మానవుడు కూడా నిరంతరం తన ఆకలి తీర్చుకునే ప్రయత్నం లో నిమగ్నమై ఉంటే, ఉత్తమ కర్తవ్యాలు నెరవేర్చవలసిన సమయము ఉండదు కనుక. అయితే ప్రస్తుతం మానవుడు తన కర్తవ్యాలు ఏమిటో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అనాగరిక మానవుడే కాదు, ఆధునికులు కూడా స్వార్థపూరితమైన కార్యక్రమాల్లోనే నిమగ్నమై జీవిస్తున్నారు, నరరూప పశువుల దగ్గరికి ఆధ్యాత్మిక తెలియ చేయడానికి వెళ్ళినప్పుడు, భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని, మీరు సమయం వృధా చేస్తున్నారని మాతో అన్నారు.ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి వారి మనసులు సహకరించడం లేదు పరమాత్ముని గ్రహించవలసిన అవసరం లేదంటున్నారు."*
*"జీవితంలో పరిపూర్ణతను సాధించడం కోసం మానవ జన్మ ఎత్తాము. అలాంటి పరిపూర్ణతను మనం కోరుకోకపోతే ప్రకృతి నియమాలు మనలను నానా యాతనలు పాలు అయ్యేటట్లు చేస్తాయి.మనసా వాచా చేసే కర్మలకు కూడా ప్రతిఫలం అనుభవించక తప్పదు. జీవాత్మ ప్రకృతి నియమాలను అనుసరించి తనకు తగిన దేహాన్ని ఇంద్రియాలను పొంది పునర్జన్మ ఎత్తి భౌతిక జగత్తు లోని సుఖాలు అనుభవించ గలదని భగవద్గీత విస్పష్టంగా చెబుతుంది. భగవంతుని చేరుకునే మార్గంలో సంపూర్ణ ప్రగతిని సాధించని వారు, విఫలమైన వారు మరలా తిరిగి జన్మిస్తారు. ఉత్తమమైన పునర్జన్మ కోసం ప్రస్తుతం మన పరిస్థితిని గ్రహించాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి."*
*"పూర్వజన్మలో తమ సాధన ఎక్కడ నిలిపివేశారో, మరుజన్మలో అచట నుండి ప్రారంభించి కైవల్య దిశగా ప్రయాణిస్తారు. దురదృష్ట వశాత్తు మాయా వశులైన వారు వీటన్నింటిని గ్రహించ లేకున్నారు. అట్టి కుటుంబాలలో జన్మించినవారు భగవద్గీతను పఠించుట లేదు. పూర్వ జన్మ సుకృతం వలన సంపన్న కుటుంబంలో పుట్టుట చేత, ఆహారం కోసం శ్రమ పడవలసిన అవసరం ఉండదు. ఏ ఆర్థిక అవసరాలైన ఇట్టే తీసుకోగలరు. కానీ తాము ఎందుకు జన్మించారో గ్రహించ లేకపోవడము వలన సుఖమయ జీవితానికి అలవాటు పడి, మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశమును మరచి ఒక జీవిత కాలాన్ని వృధా చేస్తున్నారు. దురదృష్టవశాత్తు యాంత్రిక జీవనాన్ని గడుపుతూ, సంపన్నుల సంతానం ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షించబడి, ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి తమకు గల అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు. తత్ఫలితంగా ప్రకృతి తన శాసనాలతో బంగారు లోగిళ్ళలో చిచ్చు పెడుతుంది. సువర్ణ నగరమైన లంక భస్మము అయినట్లు."*
*"జీవితంలోని ఆర్థిక సమస్యలను అస్థిరమైన వేదికమీద పరిష్కరించుకోవడం కాదు మన కర్తవ్యం. ప్రకృతి శాసనాలను అనుసరించే మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం మన కర్తవ్యం. ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతే నాగరికత స్థబ్ధం అవుతుంది.ఆత్మ దేహాన్ని కదిలిస్తుంది. ప్రాణం తో కూడిన దేహం ప్రపంచాన్ని కదిలిస్తుంది. అయితే మనము దేహం గురించి ఆలోచిస్తున్నాము. ఆ దేహాన్ని కదిలించే ఆత్మను గురించిన జ్ఞానం మనకు లేదు. ఆత్మ లేకపోతే దేహం మృత ప్రాయం. అమర జీవితాన్ని పొందడానికి మానవదేహం అత్యద్భుతమైన సాధనం. ఐహిక జీవితం అనే అజ్ఞాన సాగరాన్ని దాటడానికి అది ఒక అరుదైన మిక్కిలి ప్రధానమైన నౌక. ఆ నౌక మీద ఆధ్యాత్మిక గురువు అనే ఆరితేరిన కళాసు మనకు దారి చూపిస్తాడు. భగవంతుని కృప వలన అనుకూల వాతావరణంలో నౌక ముందుకు పయనిస్తుంది. పరిస్థితులన్నీ శుభప్రధంగా ఉండగా అజ్ఞాన సాగరాన్ని దాటే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? సదవకాశాన్ని వదులుకునే వారిని ఎలాంటి వారిని గ్రహించవలసి ఉంటుంది."*
*"ఒక రైలు పెట్టెలో సుఖ ప్రయాణము చేయు అనేక సౌకర్యములు ఉన్నా, ఆ రైలు మన గమ్యం చేరకపోతే ఉపయోగమేమిటి?"*
*"ప్రస్తుత నాగరికత మన భౌతిక దేహాన్ని సుఖవంతం చేయడంలోనే నిమగ్నం అవుతుంది. కానీ మన అసలైన గమ్యమైన పరమాత్ముని పరమపదాన్ని చేరుకోవడానికి ఉపయోగ పడడం లేదు. ఆలోచించాలి బాగా ఆలోచించాలి... లేకుంటే మన గమ్యం అగమ్యగోచరం."*
అరుణాచల శివ🌹
🙏🌹🙏🌹🙏
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏🥰🥰🔥🔥
🪷💖🪷💖🪷
🪷🕉️🪷
No comments:
Post a Comment