Thursday, August 22, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

  *రత్నాలను ఎలా సేకరిస్తారు?*
              ➖➖➖✍️


ఒకసారి, ఒక న్యాయస్థానం తన సైనికులకు అర కిలో సున్నపురాయి పొడి తినమని శిక్ష విధించేది.

తమలపాకులతో (తాంబూలం) సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ, అర కిలో సున్నాన్ని ఒకేసారి తినడం ద్వారా మానవులు బతికే అవకాశం లేదు.

కాబట్టి, అలాంటి శిక్ష పొందారంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి!

ఒక సైనికుడు సున్నం కొని మరుసటి రోజు న్యాయస్థానంలో తినాలి, 
కాబట్టి అతను దానిని కొనడానికి తమలపాకు దుకాణానికి వెళ్ళాడు.

అయితే అంత సున్నం అడిగేసరికి దుకాణదారుడు ఖంగుతిన్నాడు.

దుకాణదారుడికి ఏదో సందేహం వచ్చి, ఇంత పెద్ద మొత్తంలో సున్నం కొనడానికి కారణం అడిగాడు.

శిక్షగా మరుసటి రోజు కోర్టులో సున్నం తినవలసి ఉందని ఆ వ్యక్తి చాలా విచారంగా చెప్పాడు.

దానికి దుకాణదారుడు, "ఫర్వాలేదు. నేను నీకు సహాయం చేస్తాను. ముందుగా వెళ్లి అర కిలో నెయ్యి తీసుకురా" అని బదులిచ్చాడు.

సైనికుడు ఆశగా చూసి, వెంటనే వెళ్లి నెయ్యి కొనుక్కొచ్చాడు.

అతనికి అరకిలో సున్నం ఇస్తుండగా, దుకాణదారుడు "రేపు న్యాయస్థానంకు వెళ్లే ముందు ఈ నెయ్యి తాగు, ఆపై  నీ శిక్ష ప్రకారం సున్నం తిను.

ఆ తర్వాత, ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది నిన్ను రక్షించడంలో సహాయపడవచ్చు." అని చెప్పాడు.

మునిగిపోతున్న వ్యక్తి  ఒక గడ్డిపోచనైనా పట్టుకుంటాడు!

సైనికుడు చాలా ఆశలతో ఇంటికి వెళ్ళాడు, మరుసటి రోజు అతను దుకాణదారుడు చెప్పినట్లు చేశాడు.  అర కిలో నెయ్యి తాగి ఇంటి నుంచి వెళ్ళాడు. శిక్షగా, అతను ప్రజలతో నిండిన న్యాయస్థానంలో అర కిలో సున్నం కూడా తిన్నాడు.

సున్నం తిన్న వెంటనే శిక్ష పూర్తవడం వల్ల, జీవితంలోని చివరి క్షణాలను కుటుంబంతో గడుపుతాడని అతనిని ఇంటికి పంపేశారు.

ఇంటికి చేరుకున్న వెంటనే సున్నం మొత్తం నెయ్యితో కలిపి వాంతి చేసుకున్నాడు.

కొంత బలహీనంగా అనిపించినా, మరుసటి ఉదయం నాటికి బాగానే ఉన్నాడు.

మాములుగా తన ఉద్యోగవిధికి సమయానికి ఆస్థానం చేరుకున్నాడు.

అందరికీ అతను ముందు రోజు సున్నపుపొడిని తిన్నాడని తెలుసు, కానీ ఎలా బతికిఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోయారు.

వెంటనే, ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించింది, ఈ విషయం అక్బర్‌కు కూడా చేరింది.


అక్బర్ కూడా ఆశ్చర్యపోయాడు, వెంటనే ఆ సైనికుడిని ఆస్థానానికి పిలిచాడు.

అక్కడికి చేరుకోగానే అక్బర్ అతను ఎలా బతికాడో ఆ రహస్యాన్ని చెప్పమన్నాడు.

దుకాణదారుడి గురించి, నెయ్యి, వాంతుల గురించి అతను నిజాయితీగా మొత్తం కథను వివరించాడు.

దుకాణదారుడి తెలివిని, దూరదృష్టిని చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు.

అతను ఆ దుకాణదారుని తన ఆస్థానానికి పిలవడమే కాకుండా, ‘వజీర్-ఎ-ఆజం’ పదవి మీద తన రాజ్యసభలో సభ్యునిగా కూడా నియమించాడు.

ఆ దుకాణదారుడి పేరు మహేష్ దాస్, కానీ అక్బర్ అతని పేరును ‘బీర్బల్‌’ గా మార్చాడు, అంటే "సమర్థవంతమైన మనస్సు కలిగిన వ్యక్తి" అని అర్ధం.

ఇది మాత్రమే కాకుండా, అతనికి 'రాజు'  అనే బిరుదుతో కూడా సత్కరించారు.

అతను అక్బర్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకడిగా పేరు పొందాడు.

జీవితంలో మన పురోగతి వాస్తవానికి మనం ఏ రకమైన వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటామో దానిపై ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే మనం ఉన్న వాతావరణం నేరుగా మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది, మన జీవనశైలి మన విధిని రూపొందిస్తుంది.


నిజమైన ప్రతిభను గుర్తించేందుకు నిష్పక్షపాత దృష్టిని, వారిని బహిరంగంగా గౌరవించే, అంగీకరించే ఉదార హృదయాన్ని మనం అలవర్చుకోవాలి.✍️

              ♾♾  ♾  ♾♾

*రాళ్ళ సందుల మధ్య పువ్వు దాగిఉన్నా, తేనెటీగ దానిని కనుగొంటుంది?*
*మన హృదయాలను అలాంటి పువ్వులలాగా ఎలా తయారు చేసుకోగలం?*

*అనుభూతి: -*
ఇతరుల అంతర్గత ప్రతిభను గుర్తించి, గౌరవించే ఉదార హృదయాన్ని కలిగి ఉన్నందుకు నేను  కృతజ్ఞతతో ఉంటాను.✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment