Tuesday, October 15, 2024

 *నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు*✊✊

*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*

రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ
నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.

రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,
దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.
కానీ,
ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి? 

నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.
కానీ,
భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.
కాని,
మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
*రైతు తినేది దొంగ సొమ్మా?*
 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.

*విద్యలో రాజకీయం 100%*
*రాజకీయంలో విద్య 00%*
ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.
ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.

దేశంలోని ప్రతిభావంతులేమో
వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని  ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు 
వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*
అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు.

దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

No comments:

Post a Comment