*అంతర్దృష్టి యొక్క జ్ఞానం*
```
పురాతన కాలంలో ప్రసిద్ధ రాజు జనకుడు భారతదేశంలోని మిథిలా ప్రాంతాన్ని పరిపాలించేవాడు.
ప్రసిద్ధ ఇతిహాసం రామాయణం ద్వారా ఆయన సీత తండ్రి అన్న విషయం మనకు విదితమే.
అతనికి ఒక రోజురాత్రి ఒక వింత కల వచ్చింది. ఒక శక్తివంతమైన రాజు అతని రాజ్యం మీద దాడి చేసి అంతా నాశనం చేసాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి అతను అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు జనక మహారాజు దట్టమైన అడవిలో ఒంటరిగా ఉన్నాడు, యుద్ధం ఓడిపోయాడు, పరుగుతో అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు. అంత దట్టమైన అడవిలో అతనికి ఏమి దొరుకుతుంది?
ఇలా కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఒకరోజు ఒక బాటసారి అతని పరిస్థితి చూసి జాలిపడి అతనికి ఒక రొట్టె ముక్కను ఇచ్చాడు.
రాజు దానిని తినడానికి చెట్టుకింద కూర్చోగానే, ఒక పెద్ద కాకి అకస్మాత్తుగా ఆ రొట్టెముక్కను లాక్కుపోయింది.
దానితో జనక మహారాజు గట్టిగా అరుస్తూ, నిద్ర నుండి మేల్కొన్నాడు.
అతను తన రాజమందిరంలో తన సొంత మంచం మీద చెమటతో తడిసిఉన్నాడు.
ఈ కల వల్ల అతను సరిగ్గా ఆలోచించలేకపోయాడు.
అతడు మతపరమైన, ఆధ్యాత్మిక వ్యక్తి అయినందున, కల గురించి ఆలోచిస్తూ, ఆశ్చర్యానికి గురయ్యాడు…. "కల కంటున్నప్పుడు నేను నా మంచం మీద ఉన్నాను, కానీ నా మనస్సు పూర్తిగా అడవిలోనికి వెళ్ళి పోయింది.
కాకి నారొట్టెను లాక్కొని ఎగిరిపోయింది. నేను పరిగెత్తుకుంటూ, అరుస్తూ, చెమటతో మేల్కొన్నాను.
కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ క్షణంలో అసలు నిజం ఏమిటి?
“నేను మంచం మీద పడుకున్నది- నిజమా! లేక యుద్ధంలో ఓడిపోయి అడవిలో తిరగడం నిజమా!”
ప్రశ్న ప్రామాణికమైనదే, కానీ సమాధానం ఏమిటి?
ఆ క్షణం నుండి, జనకమహారాజు సమాధానం వెతకడంలో నిమగ్నమై, మరేవిషయం పైన దృష్టి సారించలేకపోయాడు.
పగలు- రాత్రి తన ఆస్థానానికి మత నిపుణులను, మతవిశ్వాసులను పిలిచి, వారు ఏ సత్యాన్ని యథార్థమైనదని నమ్ముతారు, “ఈ సత్యాన్నా లేక ఆ సత్యాన్నా” అని అడుగుతూ ఉన్నాడు.
ఆయన పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు, మంత్రులు, శ్రేయోభిలాషులంతా ఆందోళనకు గురయ్యారు.
గొప్ప మతపరమైన, జ్ఞానం ఉన్నమహాపండితులు కూడా అతని గందరగోళాన్ని పరిష్కరించలేకపోయారు.
ఈ వార్త అష్టావక్రుడు చెవులకు చేరింది, అతను వెంటనే దర్భారుకు వచ్చాడు.
సహజంగా, జనక మహారాజు అష్టావక్రుడికి కూడా అదే ప్రశ్నను పునరావృతం చేశాడు.
అష్టావక్రుడు నవ్వుతూ “ప్రభూ! రెండూ నిజం కాదు.” అని జవాబిచ్చాడు.
జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు ఆయన సంప్రదింపులు జరిపిన వారంతా రెండు పరిస్థితులలో కనీసం ఒక దానినైనా నిజమని వివరించి నిరూపించేందుకు ప్రయత్నించారు!
ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో, జనక మహారాజు ఆశ్చర్యానికి లోనవడం గొప్ప పరిణామం.
అష్టావక్రుడు తన అభిప్రాయాన్ని విపులీకరిస్తు జనకునితో ఇలా అన్నాడు - "చూడoడి, మీరు కలలు కంటున్నప్పుడు, మీ రాజభవనంలోనే ఉన్నారు, కాబట్టి ఆ క్షణంలో అరణ్యాలలో సంచరించడం నిజం కాదు.
అదేవిధంగా, మీరు రాజభవనంలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో మీ మనసు అడవిలో తిరుగుతోంది కాబట్టి ఆ క్షణంలో మీరు రాజభవనంలో ఉన్నారన్నది కూడా నిజం కాదు.”
జనక మహారాజు అతని ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు అతని ఉత్సుక్తత కొత్త మలుపు తీసుకుంది.
అతను వెంటనే, “అలాంటప్పుడు నిజం ఏమిటి?!” అని అడిగాడు.
అష్టావక్రుడు, “నిజమే మీలోని దీర్ఘదర్శి, (మనఃసాక్షి) ఈ రెండు సంఘటనలకు సాక్ష్యంగా ఉన్నాడు. అతనికి దేనితోనూ సంబంధం లేదు.” అని చెప్పాడు.
ఇది విన్న జనక మహారాజు తన జీవితానికి కొత్త దిశను కనుగొన్నట్లుగా ఆత్మ సాక్షాత్కారం పొందాడు.
ఇప్పుడు అతనికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది, ఏది జరిగినా, అతను జీవించి ఉన్నంతవరకు ఒక దీర్ఘదర్శిగా అనుభూతి చెందాలి.
ఆవిధంగా, గురువు హోదాలో అష్టావక్రుడు చాలాకాలం తరువాత జనకుడిలో దీర్ఘదర్శిని స్థిరపరచాడు.
ఈ సమస్త అంశం 'అష్టావక్రగీత' పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది.
మానసిక వికాసంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మనం కూడా జనకమహారాజులా ఉత్సుక్తతతో ఉండాలి.
మనం దానిని సంపూర్ణంగా చేయలేకపోవచ్చు, కానీ క్రమంగా, మనలోని సాక్షి అనే భావనను మేల్కొల్పాలి.
మన దుఃఖాలు, సుఖాలు, ఎత్తుపల్లాలు, వస్తువులు, బంధువులు, మిత్రులు, శత్రువులు మాత్రమే కాదు, మన స్వంత భావాల హెచ్చు తగ్గులు కూడా మనకు 'పరాయివే’ అని అర్థం చేసుకోవాలి.
వాటన్నిటినీ చూసేందుకు మనం ప్రేక్షకులం మాత్రమే కాని, మనం అవి కాదు.
కాబట్టి వాస్తవమేమిటంటే, లోపల లేదా వెలుపల కూడా మనపై ప్రభావం చూపే సంఘటనలు ఏమీ లేవు.✍️```
♾♾ ♾♾♾ ♾♾️
మనస్సు, హృదయానికి సాక్షిగా ఉన్నప్పుడు, రెండూ సంపూర్ణ సమకాలీకరణను పొందుతాయి, అప్పుడు చైతన్యం స్పష్టంగా ఉంటుంది, మంచితనం సహజంగా వ్యక్తమవుతుంది. *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment