శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…
*కడుపునొప్పి మాయం!*
```
ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మకాం చేశారు.
నడిచే దైవాన్ని చర్మచక్షువులతో చూడగలిగే తమ అదృష్టానికి పొంగిపోతూ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.
మా తాతగారు, యండగండి వాస్తవ్యులు శ్రీ దివాకర్ల కనకముత్యం గారు స్వామివారిని దర్శించే ఉత్సాహంతో ప్రయాణం ప్రారంభించినా, అడపా దడపా వస్తూ, వచ్చినప్పుడల్లా తీవ్రంగా బాధించే కడుపునొప్పి ఆరోజు మరోసారి ఆయనను పలకరించింది.
బాధ భరిస్తూనే స్వామివారు ఉన్న చోటుకు చేరుకొని దర్శనం కోసం వరుసలో నిలబడ్డారు.
చంద్రమౌళీశ్వర పూజ అయిన తరువాత, స్వామివారు స్వహస్తాలతో భక్తులకు తీర్థం ఇస్తున్నారు.
మా తాతగారు కూడా తీర్థం తీసుకొని ముందుకు కదులుతుంటే, “ఏమైంది అలాగున్నారు? ఏమైనా నొప్పిగా ఉన్నదా?” అని ప్రశ్నించారు స్వామివారు.
స్వయంగా పరమాచార్య స్వామివారే అడగటంతో మా తాతగారు తమ కడుపునొప్పి, దానివల్ల కలిగే బాధ గురించి స్వామివారికి మొరపెట్టుకున్నారు.
కానీ మహాస్వామి వారు ఏమీ మాట్లాడకుండా మరొకమారు తీర్థం యిచ్చి పంపించివేశారు.
ఆ తరువాత మా తాతగారి జీవిత పర్యంతం మరెప్పుడూ ఆ కడుపునొప్పి రాలేదు.✍️
-శివకిరణ్ ధూళిపాళ,బెంగళూరు.
```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
No comments:
Post a Comment