Tuesday, July 1, 2025

 *మరణం తర్వాత ఆత్మ సైజ్ ఎంత.?*

*మనిషి మరణించాక శరీరం వదిలి పెట్టి వెళ్ళడానికి ఇష్టపడడు, రోదిస్తూ ఉంటాడు, భార్య బిడ్డలపై ప్రేమ, తల్లి తండ్రి పై ప్రేమ, స్నేహితుల పై ప్రేమ, డబ్బు పై ప్రేమ, జ్యూదం పై ప్రేమ, కామం పై ప్రేమ, ఒకడి నాశనం పై ప్రేమ, ఇలా ఇవన్నీ తీరక మరణించిన తర్వాత కూడా శరీరాన్ని వదలలేక మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోదిస్తూ ఉంటాడు జీవుడు...*

*కానీ యమభటులు వచ్చి యమపాశం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు, అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్ఠ మాత్రం అంటే మన చేతి బొటన వేలి సైజ్ లో ఉంటుంది,*

*శరీరం నుండి వేరు పరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతం అంటారు, వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు, ఆత్మకు కాళ్ళు చేతులు ఆకారం ఉండదు, ఎలాంటి శక్తి ఉండదు...*
 
*అలా అంగుష్ట మాత్రం ఆకారంతో 12 రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుంది, ఇష్టమైనవారితో మాటాడాలని చూస్తూ* *ఉంటుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వింటుంది కానీ, ఎవరికీ సమాధానం చెప్పడానికి సాధ్యపడదు.*

*12 రోజులు కర్మలు చేయాలి, వాటినే ధ్వదస కర్మలు అంటారు, పిండ కర్మలు, తిల తర్పణాలు, దానాలు ధర్మాలు, గరుడపురాణ పారాయణం, ఇవన్నీ ఖచ్చితంగా 12 రోజులు చేయాలి, గరుడపురాణంలో చెప్పినవిదంగాచేయాలి.*

*కానీ, కొందరు మూడురోజులకు కలిపి ఒకరోజు చేస్తారు, కొందరు 12 రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు, ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది, ధ్వదస దిన కర్మలు సరిగా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆత్మ సైజ్ ఉన్న ఆత్మ అరచేయి సైజ్ కి పెరుగుతుంట, అలా మారిన ఆకారాన్ని దివ్య శరీరం అంటారు.*

*దివ్యశరీరాన్ని తీసుకెళ్లి పాప పుణ్యాల విశ్లేషణ చేస్తారు, చిన్న వెలుగులా కనిపించే యముడి ముందు, ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి, పుణ్యానికి పితృలోకానికి వెళ్తారు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసి పోతారు, లేదా మళ్ళీ భూమ్మీద మనిషిగా పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు, చివరగా మనిషి జన్మ తీసుకొని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు, దాన్నే గత జన్మ వాసన అంటారు.* 

*ద్వాదశ కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు, దాన్నే పున్నామ నరకం అంటారు, పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు, పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయట పడక ఇక్కడే భాదపడుతూ కొన్నాళ్ళు తిరుగుతా ఉంటుంది,*

*ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది, అలా ఆత్మ చింతిస్తే అది పితృ దోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది, వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు వంశంలో అందరికీ శిక్షపడుతుంది, కాబట్టి ద్వాదశ కర్మలు గరుడ పురాణంలో చెప్పినమాదిరి శాస్త్రోక్తంగ చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్లేల కర్మలు చేయండి.*

*అందుకే ఎవరైన వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవడం మన విధి, అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట,*
 
*ఆడైన మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు. ఆత్మకు ఆడఆత్మ మగ ఆత్మ అని లింగ బేధం ఉండదు, కాబట్టి జీవుడు అంటారు, ఇక్కడ శాంతిగ ఉండటం ఏంటి.?*

*ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ్వ లోకాలకు వెళుతుంది అలా వెళ్లాలని మనం కోరుకోవాలి.*

*కానీ, ఆత్మకు శాంతి కలగాలి అనడం అర్థం లేనిదీ.*

*కాబట్టి... "సద్గతిప్రాప్తిరస్తు" అని చెప్పండి...*

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺📿🌺 🙏🕉️🙏 🌺📿🌺

No comments:

Post a Comment