*ఓం నమో శ్రీ శివ కేశవాయ నమః*🙏🙏🙏
*ప్ర : జీవితమంతా భగవదారాధన చేస్తూ,స్మరణ చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండి,అవసాన దశలో పక్షవాతం, హృద్రోగం వంటి వ్యాధులకు లోనవ డంవల్ల బాహ్యస్పృహ కోల్పోవడం జరుగుతుంది. అట్టివారు నామ స్మరణ చేసేందుకు శరీరం, మనస్సు సహకరించని స్థితిలో వారి గతి ఏమిటి ?*
జ : *"అన్తకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కలేబరం l యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంశయః॥*
*చివరి దశలో భగవత్ స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవారు భగవత్ భావాన్ని పొందుతారని శ్రీకృష్ణ వచనం.*
ఇది నిజమే. కానీ బాహ్యస్పృహలో లేనివారి విషయం వేరు. జీవితమంతా భగవచ్చింతన చేసేవారు - స్పృహ ఉన్నంతవరకు చేస్తున్న కారణంగా వారికి తప్పక సద్గతి కలుగుతుంది.
*" స్పృహకు అంతము కలిగే వరకు " అనే అర్థాన్నే తీసుకోవాలి.*
*" అన్తకాలే చ "- అనడంలో "అన్తకాల మునందు కూడా " అని అర్థం.*
*నిత్యం స్మరించేవానికే అవసానకాలంలో స్ఫూరణకు వస్తుంది. నిత్యస్మరణం వల్ల భగవద్భావం వ్యక్తి వ్యవస్థగా మారిపోతుంది.*
*భావన భగవన్మయమైన వాడు, బాహ్యస్పృహ లేకున్నా సద్గతి పొందుతాడు.*
దీనిలో సందేహం లేదు.
🕉 *సర్వేజనా సుఖినోభవంతు*🕉
No comments:
Post a Comment