WHATSAPP Collection
ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి.రంజాన్ పండుగ వచ్చింది . మసీదు ముస్తాబు అవుతున్నది . బూజు ,దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడినుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి గుడి అంతర్భాగంలో మకాం పెట్టాయి . ఇంతలో దసరా పండుగ వచ్చింది .
ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చిలో కుదురుకున్నాయి .క్రిస్టమస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకి మారాయి .ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి . అప్పుడే ఎదుగుతున్న చిన్ని పావురం తల్లిని అడిగింది ‘ఎవరు ఆ తన్నుకునేది ‘ అని .తల్లి పావురం చెప్పింది ‘ వాళ్ళు మనుషులు ‘ అని. ‘ ఎందుకు తన్నుకుంటున్నారు ?’ మసీదుకి వెళ్ళేవాళ్ళు ముస్లింలు .గుళ్ళకు వెళ్లేవాళ్లు హిందువులు . చర్చికి వెళ్లేవాళ్లు క్రైస్తవులు . ఇది హిందూ ముస్లిం ఘర్షణ ‘ చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది. ‘మనం కూడా మసీదుకి , గుడికి , చర్చికి తిరిగాం కదా ! మనం ఎక్కడైనా పావురాలమే . మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా ?’
తల్లి పావురం నవ్వింది .
“మనం వారికంటే ఎత్తు లో ఉన్నాం . విశాల విశ్వం మనది.స్వేఛ్ఛా ప్రపంచం మనది. అన్ని జీవుల కంటె మేధావి అయిన మానవుడు కుల, మత, జాతి, లింగ గోడలు నిర్మించుకున్నాడు.అవి పోగొ
ట్టుకొంటేనే వారు మన ‘ఎత్తు’ కు ఎదుగుతారు.
ఈ ఘర్షణలు అంతరిస్తాయి..
No comments:
Post a Comment