🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(261వ రోజు):--
కోయంబత్తూరు సమీపంలో వందెకరాల్లో స్వామి సహజానంద చిన్మయ ఉద్యానవనం అనే పేరుతో ఒక పెద్ద ఆశ్రమ సముదాయాన్ని నిర్మించారు. అక్కడ బ్రహ్మచారులకు తరగతులు, వృద్ధాశ్రమం, ప్రకృతి వైద్య సదుపాయం ఉన్నాయి. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కొని ఒక హరిజన పాఠశాలనూ, ఆ ప్రాంతంలో అప్పటికే ఉన్న మరొక 10 గ్రామీణ పాఠశాలల అభివృద్ధినీ కూడా చేపట్టారు. ఆ ప్రదేశంలో ఒక నది, జలపాతం ఉండటంచేత సహ జంగానే ప్రకృతి సౌందర్యంతో విలసిల్లు తున్నప్పటికీ, పూదోటలను పెంచటం ద్వారా విద్యార్థులు దానిని ఇంకా అభివృద్ధి చేయగలిగారు. భవన నిర్మాణానికి కావలసిన ఇటుక లు కూడా అక్కడే తయారు చేయ బడ్డాయి. స్వామిని శారదప్రియా నంద ఎంత ఉత్సాహంగా, చైతన్య వంతంగా ఉంటారో, స్వామి సహజా నంద అంత ప్రశాంతంగా, తీరిగ్గా ఉన్నట్లగుపిస్తారు. ఐనప్పటికీ, ఒకే విధమైన సేవా కార్యక్రమాలు చే పట్టిన వారిద్దరూ ఒకేవిధమైన విజయాన్ని సాధించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దారుల సంతానానికి విద్యాబుద్ధులు నేర్పాలనే స్వామీజీ యోచనకు వారిద్దరూ కార్యరూపాన్నిచ్చారు. చిన్న పిల్లలకు చదవటం, వ్రాయటం, చిన్నచిన్న లెక్కలు చేయటం నేర్పు తారు. పది పన్నెండేళ్ల వయసున్న వారికి వారి సామర్థ్యాన్నిబట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా వృత్తివిద్యలో శిక్షణ నిస్తారు. ఈ శిక్షణ వారు సమాజంలో తమ కాళ్ళమీద తాము స్వతంత్రంగా నిలబడటానికి ఉద్దేశించబడింది. లౌకిక విద్యతో పాటు వారికి మతపర మైన, నైతికపరమైన శిక్షణ కూడా ఇచ్చి, దానిద్వారా వారు తమ ఆత్మ గౌరవాన్నీ, తమ సంస్కృతిపై అవగా హననూ పెంపొందించుకునే అవకాశాన్నీ కల్పిస్తారు.
స్వామీజీ శిష్యులలో కొందరు చాలా స్వతంత్రంగా వ్యవహరించే వారు ; కొందరు మాత్రం ఇతరులపై ఎక్కువగా ఆధారపడేవారు. వారి వారి ఆధ్యాత్మిక పరిణతిని బట్టి స్వామీజీని వారు అర్థంచేసుకునే తీరు ఉంటుంది. తనవద్దకు వచ్చే వారందరికీ వారివారికి తగిన రీతిలో ఆయన స్పందించేవారు. వందలాది విద్యార్థులతో ఆయనకు సంబంధ మున్నప్పటికీ, వారందరినీ నిష్పాక్షి కంగా ఒకే దృష్టితో చూచి ఒకేవిధ మైన స్పందనలీయటం ద్వారా, ఆధ్యాత్మిక గురువుల చుట్టూ ఉండే అసూయ వంటి భావాలను ఆయన దూరంగా ఉంచగలిగారు.
తను భగవంతుని ప్రత్యేకమైన అవతారమని స్వామి చిన్మయానంద ఎన్నడూ భావించి నట్లనిపించదు. తన విద్యార్థులు ఎలాంటివారో, తనూ అలానేనని ఆయన అభిప్రాయం. ఈవిధమైన ఆదర్శం వల్ల జీవితాన్నీ, దాని సమస్యలనూ, దాని ఆకర్షణలనూ గురువైన తను ఎదుర్కొన్న విధంగా తన విద్యార్థులు కొందరు ఎదుర్కొన లేకపోయినపుడు ఆయన నిరాశ చెందేవారు. దేవుని అవతారం అనేక రీతుల్లో ఉంటుంది : అది దావానలమైనా కావచ్చు ; కొవ్వొత్తి దీపమైనా కావచ్చు. సృష్టి స్వభావమే అది .
స్వామీజీ బోధన శ్రోతలవల్ల ప్రభావిత మయ్యేదికాదు. తను బోధించ దలుచుకున్న సత్యాన్ని అనర్గళంగా ఆలపిస్తారాయన. కొందరికి అది ఉపయోగపడుతుంది; కొందరికి ఉపయోగ పడదు. లాభించని వారు విమర్శించే అవకాశం కూడా ఉంది. కార్యకర్తల లో ఒకాయన తన వ్యాపారంలో అవి నీతి పద్ధతులవలంభిస్తారని అప్పు డప్పుడు విమర్శలు వచ్చేవి. ఆయన నవ్వి, "మతం కావల్సినది అవినీతి పరులకే ; మీరిక్కడున్నది అందుకే. మీరిద్దరూ ఎంత బాగుపడగలరో చూద్దాం" అనేవారు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment