Wednesday, November 26, 2025

 అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయిన చాలా లోభి. అంటే యెంత పీనాసితనం అంటే ఒక్క పైసా కూడా చేతిలోంచి జార నిచ్చే వాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్ట నిచ్చే వాడు కాదు. 

పైసా పైసా కూడ పెట్టి, ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. *అవి లెక్ఖ పెట్టుకోవడం ఒక సరదా.*

ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి, ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి, ఆ సంచీ అందులో కప్పెట్టాడు.

అప్పుడప్పుడు గొయ్యి తీసి, సంచీ చూసుకుని, నాణాలు లెక్ఖ పెట్టుకుని, మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు. 

ఇలా కొంత కాలం బాగానే గడిచింది. కాని ఒక రోజు ఇలాగే సంచీ తీసి నాణాలు లెక్ఖ పెట్టుకుంటుంటే *ఒక దొంగ చూసాడు.*

ఇంకేముంది? రాత్రికి రాత్రి వచ్చి, గొయ్యి తీసి, *సంచీ దోచేసాడు.*

ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గిరకి వెళ్లి జరిగినది చెప్పాడు. *నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు.*

స్వామీజీ, *బంగారం తీసుకెళ్ళి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసారినికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా?*” అని అడిగారు.

*ఖర్చు పెట్టడమా! నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను! అందులోంచి ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తి లేదు!*” అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేసాడు.

అప్పుడు స్వామీజీ నవ్వి, *ఒక సంచీలో కొన్ని రాళ్ళు వేసుకుని కప్పెట్టుకో, నీకు బంగారు నాణాలన్నా, రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్ఖ పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా.* 

*వాడని వస్తువు అవసరం మనకి వుండదు. ఇంకది పోయిందని బాధెందుకు?*” అని సలహా ఇచ్చి పంపించేసారు.🍁.      

No comments:

Post a Comment