Saturday, November 1, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   మహాత్మాగాంధి హత్య జరిగిన రోజులవి. ఉన్నట్లుండి ఎక్కడినుండో మతి స్థిమితంలేని ఒక యువకుడు రమణాశ్రమం వచ్చాడు. సరాసరి మహర్షి సన్నిధిలోకి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఉగ్ర నరసింహుని వలె ఊగిపోతూ  "గాడ్సే, గాంధీని చంపి ప్రఖ్యాతి పొందాడు. నేను, నిన్ను చంపి కీర్తి పొందుతాను" అని బెదిరించాడు మహర్షిని.

      అందుకు మహర్షి "చంపు నాయనా చంపు; నాకు కూడా ఈ శరీర భారం తప్పిపోతుంది" అని సెలవిచ్చారు. 

     అక్కడేఉన్న ఆశ్రమభక్తులు ఆ యువకుడిని బయటకు పంపించి వేయాలని చూశారు. కాని మహర్షి ఆ యువకుడిని తన వద్దనే ఉంచుకుని తనతోపాటే భోజనానికి తీసుకువెళ్ళారు. ఆ యువకుడు రెండు రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు.

     మూడవ రోజున ఆ యువకుడు మహర్షి వద్దకు పోయి వినయంగా "నన్ను క్షమించండి భగవాన్! నాకు అనుకోకుండా మతి స్థిమితం తప్పిపోతూ ఉంటుంది. నా మతి స్థిరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించి నాకు ఏదయినా  ఉపదేశించండి!" అని అన్నాడు. 

  మహర్షి ఆ యువకునితో  "గాయత్రి మంత్రం చెయ్యి! అని అన్నారు. ఆ యువకుడు ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తరువాత పిచ్చి కుదిరి, గొప్ప భక్తితో ఆశ్రమానికి వచ్చాడు ఆ యువకుడు.

No comments:

Post a Comment