*పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఏలాగంటే?*
🌼 *ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది..*
🌼 *'నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను?*
*ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని?*
🌼 'మరుసటిరోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు'...
🌼 అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది 'అన్నాడు...రాజు వెళ్ళాడు..
🌼 అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటుంటాడు.. అది చూసి రాజు ఆశ్చర్యపోయి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు.. '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''
🌼 నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.. రాజు ఆయన్ని చూసినపుడు, ఆ సన్యాసి మట్టి తింటూంటాడు..
🌼 రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపొమ్మంటాడు...
రాజుకు కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు... తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అంటాడు..
🌼 ''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి..
'' రాజుకంతా గందరగోళంగా వుంది."అయినా అక్కడికెళతాడు..
🌼 చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు...
అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు...
🌼 గత జన్మ లో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి వుంటారు.. ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.. తినబోతుంటే
🌼 అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే...
🌼 ఆ నలుగురిలో మొదటి వాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు...
🌼 రెండవ వాడిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు..
🌼 మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటే ముసలిదానా ? ''అని నీచంగా మాట్లాడాడు...
🌼 కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' ఆవ్వా , నీవు చాలా నీరసంగా వున్నావు.. ఈ రొట్టె తిను, '' అని తాను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేసాడు...
🌼 ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు...
🌼 రాజు దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు..
🌼 రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు...
🌼 మనం గత కర్మల ఆధారమే మన భవిష్యత్తు చేసినదేదీ వృథాగా పోదు...;
No comments:
Post a Comment