ఇది పునరంకితవేళ...
జెండా ఊంచా రహే హమారా' నినాదం-ఎదలోయల్లో చెలమగా, చెలిమిగా చివురుగా కలంగా కవితగా... జాతి భావోద్వేగాలకు వేదికగా, జనుల గుండె చప్పుళ్ల నివేదికగా ఉప్పొంగే రోజిది. జెండా అంటే- సర్వతంత్ర స్వతంత్ర భారతదేశ సర్వసత్తాక సౌభాగ్య చిహ్నం! వినువీధుల్లో రెపరెపలాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని సగర్వంగా లోకానికి చాటే విజయకేతనం! జాతి స్వాభిమానమది! 'ఇనుపకరాలు, ఉక్కునరాలు, జవం, జీవమూ, ఆత్మస్థైర్యం' అంటూ వివేకానందుడు ఎలుగెత్తి చాటిన జీవలక్షణాల మేలికలబోత- దాని మువ్వన్నెల నేత! ‘సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల చండ శౌర్యము, చిత్ర దాస్యముచే చరిత్రల చెరిగి పోయెర సోదరా!' అని అలనాడు ఈ జాతి గుర్తించింది. జూలు విదిల్చింది. సమరశంఖం పూరించింది. సుదీర్ఘ పోరాటం సాగించింది. స్వరాజ్యాన్ని సాధించింది. ఆ సమరయోధుల, అమరవీరుల త్యాగఫలాలనే మన తరం అనుభవిస్తోంది!
ఆనాటి యోధుల వీరగాథలను వింటుంటే ఒళ్లుగగుర్పొడుస్తుంది. గాంధీజీ పిలుపుతో జాతి జాతిమొత్తం ఉత్తేజితమైంది. సుబ్బారావు పాణిగ్రాహి
అన్నట్లు ‘దిక్కుమొక్కులేని జనం- ఒక్కొక్కరుఅగ్నికణమై' కదనరంగంలోకి దూకారు. భగత్్సంగ్ గురించి కవి సోమసుందర్ చెప్పినట్లు 'ఒక తారక
మేల్కాంచెను, ఒక వీరుడు కనువిచ్చెను, ఒక
మెళుకువ, ఒక్క వెలుగు' ఆంగ్లేయుల కళ్లకుమిరుమిట్లుకొల్పిందిచేసేదేం లేక, దేశం వదిలిపోలేక
'మీకింకా పాలనా సామర్థ్యం పట్టుబడలేదు, ఏలడం చేతకాదు' అని పెదవి విరిచారు ఆంగ్లేయులు. దానికి దాదాభాయ్ నౌరోజి మనవరాలు ఖుర్షిద్
గొప్ప సమాధానం చెప్పారు. 'మా దుస్థితి ఎలా
ఉందంటే- ఇంటికొచ్చిన అతిథులు పొమ్మంటున్నా
పోకుండా నట్టింట తిష్టవేసినట్లుంది- స్వతంత్రభారతం
మీరంటున్నట్లు ‘అరాచక రాజ్యం’ కాబోదు. మా
సమస్యలను మేం పరిష్కరించుకోగలం' అన్నారామె.
మా యువతరంపై మాకు నమ్మకం ఉంది. మా
స్వయం ప్రతిపత్తి పట్ల మాకు ధీమా ఉంది. మా
దేశం అద్భుతాలు చేస్తుందన్న విశ్వాసాన్ని నాటి దేశం అద్భుతాలు చేస్తుందన్న విశ్వాసాన్ని నాటి నేతలెందరో సగర్వంగా ప్రకటించారు. అదే భవిష్యద్వాణిగా, జీవనాడిగా మారింది. ఆ తరం దీవెనలు ఆశలు ఆశయాలే- మన జెండాలో మువ్వన్నెలుగా వెలుగులు చిమ్ముతున్నాయి. కేవలం వస్త్రం కాదది- జాతి నిస్తేజాన్ని నిర్మూలించే బ్రహ్మాస్త్రం! మనం చేయాల్సింది వట్టి వందనం కాదు-ముందుతరం ఆశయాలను పూర్తిచేస్తామన్న
తెలుగు వెలుగు పింగళి వెంకయ్య రూపొందించిన ఆ జాతీయ జయకేతనం- సమరోద్యమ చరిత్రలో
పెను సంచలనం. నివురు కప్పిన జాతి
ఆభిజాత్యానికి, ఆత్మప్రత్యయానికి- ఇంధనం. అలనాటి
సమరస్ఫూర్తికి, ఉద్యమదీప్తికి నేటి సజీవచిహ్నం.
దాని పరువెంతో, బరువెంతో తెలియాలంటే-
మంచుకొండల్లోని వీరసైనికుల తుపాకులను
అడగాలి. రైతన్నలు భుజానమోసే నాగళ్లను
అడగాలి. పరిశోధనాశాలల్లో మగ్గిపోయే శాస్త్రవేత్తల
మెదళ్లను అడగాలి. 'జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్'
నినాదంలోని హిమనగమంత సందేశాన్ని గ్రహించాలి.
అప్పుడే 'నేనంతా పిడికెడు మట్టే కావచ్చుకాని, కలం
ఎత్తితే- నాకీ దేశపు జెండాకున్నంత పొగరుంది' అన్న
కవి శేషేంద్ర ధీమాతో పరిచయం అవుతుంది. 'నా
దేశం భగవద్గీత. నా దేశం అగ్నిపునీత సీత. నా
దేశం కరుణాంతరంగ. నా దేశం సంస్కార గంగ
అన్న సినారె నివాళిలోని భావసాంద్రత గుండెను
తాకుతుంది. స్వరాజ్య సమరోద్యమ చైతన్యాన్ని
యువతరం గుండెల్లో రగిలించి, సురాజ్యస్థాపన
దిశగా నడిపించడమే- జెండా పండుగకు ఫలశ్రుతి!
దానికోసమే- ఈ వైతాళిక గీతాలాపనలూ... స్వా
తోరణాలూ... జెండా వందనాలూను!
ఈనాడు సంపాదకీయం
No comments:
Post a Comment