Friday, July 12, 2024

 🔔 *అనగనగా...* 🔔

రంగనాథుడికి పన్నెండేళ్ళవయసు వచ్చినా, వాడికి గురుకులంలో ఏమాత్రం చదువు అబ్బడంలేదు. ఆమధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా వాడు తప్పికూర్చున్నాడు. 

దానితో వాడికి బాధలు మొదలయ్యాయి.

తండ్రి, వాడిని ఎందుకూ పనికిరాని వెధవా అని తిట్టాడు.

 ఇదివరకు తను ఏదికోరితే అదివండిపెట్టే తల్లి, ఇప్పుడు వేళకు అన్నంకూడా సరిగా పెట్టడంలేదు.

 ఇదంతా రంగ నాథుడికి చాలా బాధ కలిగించింది.

 కానీ, తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు, విసుగుకలుగుతున్నది.

ఒక రోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు.

 క్రితంరోజు మిత్రులతో
కలిసి ఆడుతూంటే రాయితగిలి, వాడి కుడికాలు బొటన వేలికి చిన్నగాయమెంది. 


దానిమీద ఈగ ఒకటి వాలి బాధకలిగిస్తున్నది. 

దాన్ని ఎంత తోలినా పోయినట్టేపోయి,
తిరిగివస్తున్నది. 

దానితో వాడుపట్టరానికోపంతో, "ఛీ, పో" అంటూ
అరిచాడు. ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు, రంగనాథుడి అరుపువిని, వాణ్ణి అడిగి సంగతి తెలుసుకుని, “చూడు, రంగా! అల్పజీవి అయిన ఒక చిన్న ఈగకే తనకు కావల్సినదానిపై అంతపట్టుదల వుంటే, అన్ని జీవులకంటే తెలివెన్ష, శక్తికలిగిన మనిషికెంత పట్టుదల వుండాలో చెప్పు?” అన్నాడు.

ఆ మాటలు వింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు. 

అంతే! ఆరోజు నుంచీ మనసు లగ్నం చేసి, పట్టుదలతో చదివాడు. 

నెలరోజుల తర్వాత పరీక్షకువెళ్ళి ప్రశ్నలన్నిం టికీ తగు జవాబులు రాసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
ఉద్యమేనైవ  సిద్ధ్యంతి  కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥

పరిశ్రమతోనే పనులు నెరవేరతాయి, మనోరథములని బట్టి కాదు.

నిద్రిస్తున్న సింహము నోటిలోనికి మృగములు ప్రవేశించవు.
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

No comments:

Post a Comment