*ఒకచోట ఓ పెద్ద సభ జరుగుతోంది. ఒక వక్త అదే పనిగా* *'అహింసో పరమో ధర్మః' అని ఊదర కొట్టేస్తున్నాడు.*
*వింటున్న నాలాంటోడికి విసుగు పుట్టింది.*
*కూర్చున్న అతను పైకి లేచాడు.*
*పక్కనున్న వాళ్ళు 'సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి... కూర్చోండి' అన్నారు.*
*"నేను వడ్డించడానికే వెళ్తున్నాను" అంటూ వేదిక మీదకు వెళ్ళాడు*
*వేదిక మీద ఉన్నవాళ్ళు 'ఏమిటి..?' అన్నట్లు చూసారు.*
*ఆ పెద్దమనిషి ఇందాకటినుండి 'అహింసో పరమో ధర్మః' అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్ళి... వాడి చెంప ఛెళ్ళు మనిపించాడు*.
*ఆ వక్త బిత్తరపోయాడు. వేదిక మీద ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి ఆ పెద్దమనిషిని పట్టుకున్నారు.*
*అప్పుడు ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు*
*"ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా..!ఇందాకటి నుండి మీరు చెబుతున్నదీ..? మరి మీరే రెండో చెంప చూపించరేమిటి..?" అని అడిగాడు.*
*బూరెలా వాచిపోయిన చెంపను తడుముకుంటున్న ఆ వక్త బిత్తరపోయి "ఉపన్యాసం ఇమ్మంటే వచ్చాను" అన్నాడు.*
*"మరి ఆ తరువాతి పాదం చెప్పరేమండీ?" అని అడిగాడు ఆ పెద్దమనిషి.*
*"అదీ... అదీ..."*
*"అది నేను చెప్పనా?" అని అడిగాడు ఆ పెద్ద మనిషి.*
*"ఒద్దొద్దు... నేనే చెబుతాను" అంటూ "ధర్మ_హింసా తదైవచ" అని చెప్పాడు, రెండో చెంపకు చెయ్యడ్డం పెట్టుకుంటూ.*
*"ఈ ముక్క నేను కొట్టకముందు చెప్పాలి" అంటూ అందరిని విదిలించుకుని వేదిక దిగాడు ఆ పెద్దమనిషి.*
*అంచేత నే చెప్పొచ్చేదీ ఏమిటంటే చెప్పే మంచి ముక్కల్ని... ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట.*
*'అహింస ఎంత ముఖ్యమో, అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం' అన్నమాట.*
*జాతి నిర్వీర్యం అయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి. జాతిని మేల్కొలిపే ప్రసంగాలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి...*
*మహాభారతంలోని ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేశారు...*
*"అహింసా పరమో ధర్మః." పూర్తి శ్లోకం ఇలా వుంటుంది.*
*"అహింసా పరమో ధర్మః*
*ధర్మ హింసా తదైవచ."*
*అర్థం:: అహింస మానవుని యొక్క పరమ ధర్మము... మరియు ధర్మ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్ఠమైనది...*
*అర్థమయ్యిందా ఓ హైందవుడా... ఇక కార్యోన్ముఖడవు అవ్వు... 🙏*
*"ఇన్నాళ్లూ... అన్నీ సగం సగం చెప్పి... హిందూ సమాజాన్ని సంక నాకిచ్చింది చాలు"*
*మన పిల్లలకి మన ధర్మాన్ని బోధించుదాం...*
*అలాగే షేర్ చేయండి*
No comments:
Post a Comment